చుట్టూ రద్దీ, ట్రాఫిక్.. అయినా నడిబొడ్డున అత్యాచారం

ఇంటికి వెళ్లడానికి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే.. హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది ఈ దారుణం. కూకట్ పల్లి ఏరియాలో…

ఇంటికి వెళ్లడానికి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే.. హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది ఈ దారుణం. కూకట్ పల్లి ఏరియాలో జరిగిన ఈ ఘటన అందర్నీ షాక్ కు గురిచేసింది.

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిథిలో ఉన్న మూసాపేటలో 50 ఏళ్ల మహిళ తన తల్లితో కలిసి ఉంటోంది. కొన్ని రోజుల కిందట భర్తతో విడిపోయి, స్థానికంగా కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది. 

ఈమెకు అదే బస్తీలో ఉండే రాముతో పరిచయం ఏర్పడింది. ఆమె ప్రతి రోజూ కూలిపని పూర్తయిన తర్వాత ఇంటికి నడిచి వెళ్తుందనే విషయాన్ని రాము గ్రహించాడు.

ఎప్పట్లానే పని పూర్తిచేసుకొని ఇంటికెళ్తున్న మహిళను రాము రోడ్డుపై కలిశాడు. తన బైక్ పై ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని నమ్మించాడు. అయితే కొంతదూరం వెళ్లిన తర్వాత దారి మళ్లించాడు. 

సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బండరాయితో ఆమె ముఖంపై బాదాడు. ఆమెను లైంగికంగా తీవ్రంగా హింసించాడు. చనిపోయిందనుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు రాము. అయితే మహిళ చనిపోలేదు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హాస్పిటల్ లో చేర్పించిన పోలీసులు.. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేశారు. 

విషయం తెలుసుకున్న రాము, తన కుటుంబంతో సహా పరారయ్యాడు. ఇతడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి. హైదరాబాద్ లో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడం, పక్కనే పెద్ద ఆలయం కూడా ఉన్నప్పటికీ ఇది జరగడంతో స్థానికంగా ఇది సంచలనంగా మారింది. 

అరియ‌నా ట్రోఫీ గెలుస్తుంద‌ని ఎదురుచూసా