గోదావరి పరవళ్లకు ‘మేఘా’ కొత్త నడకలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ జలభాండారంగా మారుతోంది. గోదావరి పరవళ్లకు 'మేఘా' కొత్త నడకలు నేర్పుతూ, రైతు కళ్ళలో ఆశలు రేకెతిస్తూన్నాయి గోదావరి నీళ్లు. కనుచూపుమేర ఎక్కడ చూసిన గోదావరి నీళ్లే! కొన్నేళ్లుగా నీరు లేని భూములు…

కాళేశ్వరం ప్రాజెక్ట్ జలభాండారంగా మారుతోంది. గోదావరి పరవళ్లకు 'మేఘా' కొత్త నడకలు నేర్పుతూ, రైతు కళ్ళలో ఆశలు రేకెతిస్తూన్నాయి గోదావరి నీళ్లు. కనుచూపుమేర ఎక్కడ చూసిన గోదావరి నీళ్లే! కొన్నేళ్లుగా నీరు లేని భూములు మేఘా మిషన్లతో జలకళను సంతరించుకుంటున్నాయి. సాగునీరు కరువై బీడువారిన వ్యవసాయభూములు సాగుకు నోచుకోనున్నాయి. ఎండిన తెలంగాణ బీడు భూములను సస్యశామలం చేయడానికి గలగలా పారుతోంది.

ఊహలకు సైతం అందని రీతిలో రూపుదిద్దుకున్న పుంపుహౌసులు.. వేలకొలది క్యూసెక్కుల నీటిని అలవోకగా ఎత్తిపోసే మిషన్లు.. వందల కిలోమీటర్ల కాల్వలు.. సుదీర్ఘమైన సొరంగాల ద్వారా పరుగులు తీస్తూ పరవశించిపోతున్నది. కడలి బాట పట్టకుండా భువినుంచి తనను దివికి తీసుకుపోయేందుకు మేఘా ఆవిష్కరించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఆ గోదారమ్మ ఎగువకు పరుగులు పెడుతోంది. దాదాపు 170 కిలోమీటర్లకుపైగా గోదావరి ఏడాదిపాటు జలసిరులతో కళకళలాడుతుంది. ప్రపంచ చరిత్రలోనే ఎవరూ వినియోగించని అతి పెద్ద మేఘా మోటర్లతో కొనసాగుతున్న ఎత్తిపోతలతో గోదావరి జలాలు మిడ్మానేరు రిజర్వాయర్కు పరుగులు తీస్తున్నాయి.

ప్రాణహిత నది కలిసే కాళేశ్వరం వద్ద మేడిగడ్డ పంప్హంస్ ద్వారా ఎత్తిపోస్తుండడంతో అన్నారం అక్కడి నుండి సుందిళ్ల ద్వారా గాయత్రి పంప్హౌస్ వరకు పరుగులు పెడుతోంది. మేఘా గాయత్రి భూగర్భ పంప్హౌస్ నుండి గోదావరి జలాలు వాయువేగంతో పరుగులు తీస్తూ మిడ్మానేరుకు చేరుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి 13 జిల్లాల్లోని కొన్ని లక్షల ఎకరాలను తడుపనుంది. కాళేశ్వరంలో ప్రాజెక్ట్లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ నీటి పంపింగ్ కేంద్రాన్ని ఆగస్టు 11న ప్రారంభించి ఇప్పటివరకు నిరంతరాయంగా పంపింగ్ కొనసాగిస్తూ క్రమంగా మిషన్ల వినియోగాన్ని పెంచుతోంది. మొదటిదశలో రోజుకు 2 టిఎంసీల నీటిని పంపింగ్ చేసే విధంగా 5 మిషన్లను ఏర్పాటు చేయగా ఇప్పటికి నాలుగు మిషన్లు (మూడవ మిషన్ మినహా) వినియోగంలోకి తెచ్చింది. వీటి ద్వారా సరాసరిన 15 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తోంది.

కాళేశ్వరంలో కీలకమైన అతిపెద్ద భూగర్భం పంపింగ్ కేంద్రమైన గాయత్రి పంప్హౌస్ 22 రోజుల్లోనే 3 మిషన్ల ద్వారా 11.40 టిఎంసీల నీటిని పంపింగ్ చేసి మిడ్ మానేరుకు చేర్చింది. అందులో 5వ మిషన్ మొదట ప్రారంభించగా 380 గంటలపాటు నిరంతరాయంగా పనిచేసింది (16 రోజులపాటు). 2వ మిషన్ (క్రమ సంఖ్య 4) అదే రోజుల్లో 378 గంటలపాటు పనిచేసింది. ఈ రెండు మిషన్లు సరాసరిన ఒక్కొక్కటి 4.30 టిఎంసీల చొప్పున నీటిని పంప్ చేశాయి. మూడవ మిషన్ (క్రమసంఖ్య 1) 10 రోజులపాటు (అంటే ఆలస్యంగా ప్రారంభించారు) 248 గంటలు పనిచేసి 2.80 టిఎంసిల నీటిని పంప్ చేసింది. ఈ పంపింగ్ కేంద్రం భూమి దిగువన 470 అడుగుల నుంచి నీటిని పైకి పంప్ చేస్తోంది.   

మేఘా రికార్డుల నిర్మాణం
కాళేశ్వరానికి భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రం గుండెకాయ వంటింది. లింక్ 1లోని లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) నుంచి నీటిని పంపింగ్ చేస్తున్న మేఘా తన రికార్డును తానే అధిగమించింది. ఇప్పటి దాకా అతిపెద్ద పంపింగ్ కేంద్రాలుగా హంద్రీనీవాలోని మొదటిదశలోని 12 కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఇదే పధకంలోని 2వ దశలో 18 కేంద్రాలు పనిచేస్తున్నవి. అలాగే ఆంధ్ర ప్రదేశ్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో ఏ పంపింగ్ కేంద్రం చూసినా మేఘా నిర్మించినవే. అతి తక్కువ కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం ద్వారా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే.

రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకోవడంతో పాటు గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసిన పట్టిసీమలో 24 మిషన్లు వున్నాయి. ఎలాంటి సాంకేతిక అవరోధాలు లేకుండా గత ఐదేళ్లుగా విజయవంతంగా నీటిని పంపుచేస్తున్న ఈ పథకం 2015 నుంచి ఇప్పటిదాకా (ఆగస్టు 31వరకు) 289.8 టిఎంసీల నీటిని పంపుచేసింది. 2018లో 76,068 గంటలు పంపుచేసి 96.94 టిఎంసిలు కృష్ణలోకి చేర్చింది. ఈ ఏడాది (2019) ఇప్పటి (ఆగస్టు 31) వరకు 21,356 గంటలు పనిచేసి, 27.22 టిఎంసిల నీటిని అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి కృష్ణకు తరలించింది.

భూగర్భంలో మేఘా మిషన్ల విశిష్టత
ఈ పథకంతో పోల్చితే గాయత్రి (లక్ష్మీపూర్) భూగర్భ పంపింగ్ కేంద్రం భూమికి దిగువన 470 అడుగు లోతులో వుంది. అయినప్పటికీ 22 రోజుల్లో 1006 గంటలు పనిచేసి 11.40 టిఎంసిల నీటిని మిడ్ మానేరుకు చేర్చింది. మిడ్ మానేరు సామర్ధ్యం 25 టిఎంసిలు కాగా, అందులో అంత మొత్తం నీటిని 22 రోజుల్లో మూడు మిషన్ల ద్వారా చేర్చిందంటే ఈ మేఘా మిషన్ల విశిష్టత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజంగానే పట్టిసీమ లాగ 21,356 గంటు పనిచేస్తే ఎంత నీరు చేరుతుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంచుమించు 230 టిఎంసిల నీరు మిడ్ మానేరుకు చేరుతుంది. ఆ జలాశయం సామర్ధ్యం 25.60 టిఎంసిలు (పదో వంతు మాత్రమే). దీన్ని బట్టి చూస్తే ఈ పంపింగ్ కేంద్రం గొప్పతనం అర్ధమవుతుంది.

కీలకం లక్ష్మి పుంపుహౌస్
లింక్-1 లోని లక్ష్మీ (మేడిగడ్డ) పంపింగ్ కేంద్రం జూన్ 21న ముఖ్యమంత్రులు, నాటి గవర్నర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే! ప్రాణహిత నీటిని వెనక్కి ఒడిసిపట్టి ఎగువకు మళ్లించడంలో ఈ పంపింగ్ కేంద్రం కీలకమైనది. ఇందులో ఆరుమిషన్లు పనిచేస్తుండగా 36 రోజుల్లో 1593 గంటలు (అన్ని మిషన్లు కలిపి) నీటిని 12.20 టిఎంసిలు పంపుచేశాయి. ముఖ్యమంత్రులు ప్రారంభించిన ఆరవ మిషన్ అత్యధికంగా 22 రోజుల్లో 367 గంటల పాటు 2.80 టిఎంసిల నీటిని పంపుచేసింది. దాదాపు అదే విధంగా 4, 3, 1, 5 మిషన్లు కూడా పనిచేశాయి. ఆలస్యంగా ప్రారంభమైన 2వ మిషన్ ఇప్పటి దాకా (ఆగస్టు 31) 0.7 టిఎంసిల నీటిని అందించింది. సరస్వతి (అన్నారం) పంపింగ్ కేంద్రం ఇప్పటి దాకా 6 మిషన్లను 16 రోజుల్లో 461 గంటల పాటు పనిచేయించి 4.86 టిఎంసి నీటిని పంపు చేసింది. అందులో ప్రధానంగా 1వ మిషన్ 8 రోజుల్లో 161 గంటలు పనిచేసి 1.70 టిఎంసిల నీటిని సుందిళ్లకు అందించింది. ఇక ఎల్లంపల్లికి నీటిని చేర్చి లింక్-1, లింక్-2 మధ్య అనుసంధానంగా వుండే పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రం 11 రోజుల్లో 23.67 గంటల పాటు ఆరు మిషన్లను పనిచేయించింది. ప్రస్తుతం గోదావరికి వరద వచ్చి ఎల్లంపల్లి నిండు కుండల ఉండడంతో సుందిళ్ల పుంపుహౌస్లోని మిషన్లను అప్పుడప్పుడు నడిపిస్తున్నారు.

మేఘా అద్భుతాలు
మేఘా ఇంజనీరింగ్ దేశంలో నిర్మించిన అతిపెద్ద పంపింగ్ కేంద్రాలతో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ 1లోని మూడు కేంద్రాలు, లింక్ 2లోని గాయత్రి పంపింగ్ కేంద్రం ఎంత పెద్దదో అర్థమవుతోంది. ఇప్పటివరకు అతి పెద్దది, అతి పొడవైనదిగా ఎక్కువ పంపింగ్ కేంద్రాతో హంద్రీనీవా ప్రసిద్ధి చెందింది.  ఇందులో మొదటిదశలో 12 కేంద్రాలు, 2వ దశలో 18 కేంద్రాలు వున్నాయి. మొదటి దశలోని మొదటి పంపింగ్ కేంద్రం కృష్ణ నదివద్ద శ్రీశైలం ఎగువ భాగంలో మాల్యా దగ్గర నిర్మించారు. ఈ పంపింగ్ కేంద్రంలో 12 మిషన్లు వున్నాయి. ఒక్కొక్క మిషన్ ద్వారా 9.56 క్యూమెక్కుల నీటిని 5 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించారు. సరాసరి నీటి పంపింగ్ ఎత్తు 38 మీటర్లు. మళ్లీ మనం కాళేశ్వరంలోకి వస్తే లింక్ 1లో ఒక్కొక్క మిషన్ సామర్ధ్యం 40 మెగావాట్లు.

ఒక్క లక్ష్మీకేంద్రంలోనే 17 మిషన్లు వున్నాయి. వీటి మొత్తం సామర్ధ్యం 680 మెగావాట్లు హంద్రీనీవా మాల్యాల పంపింగ్ కేంద్రం మొత్తం సామర్ధ్యం 60 మెగావాట్లు. అంటే దాని కన్నా లక్ష్మీ (కాళేశ్వరంలో) పంపింగ్ కేంద్రం ఎంత పెద్దదో ఇట్టే అర్ధమైపోతుంది. ఈ లక్ష్మీ కేంద్రంతో పోల్చితే గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం మరింత పెద్దది. ఇందులో ఒక్కొక్కటి 139 మెగావాట్ల చొప్పున 7 మిషన్లు 973 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించింది. అందులోనూ భూగర్భంలో 470 అడుగుల దిగువన నిర్మించినది. అంటే ఏ పంపింగ్ కేంద్రాతోనూ గాయత్రి కేంద్రానికి అసలు పోలికే లేదు.

హంద్రీనీవా అతిపెద్ద పంపింగ్ పధకం అయినప్పటికీ అందులో మరింత పెద్దదిగా పరిగణించేది మాల్యాలోనిది (అంటే మొదటి కేంద్రం). ఇక్కడ 2012 నుంచి పంపింగ్ జరుగుతుండగా ఇప్పటి దాకా 8 ఏళ్లలో 1242 రోజులపాటు పంపింగ్ జరిగి 163.4 టిఎంసిల నీటిని ఎత్తిపోశారు. అదే సమయంలో పట్టిసీమ నుంచి ఐదేళ్ల కాలంలో 289 టిఎంసిల నీటిని అందించారు. ఈ పంపింగ్ కేంద్రాలు పనిచేసిన విధంగా లింక్1, లింక్2లోని నాలుగు మెగా పంపింగ్ కేంద్రాలు పనిచేస్తే ఎంత నీరు తెలంగాణ బీడు భూములకు చేరుతుందో అంచనా వేయొచ్చు.

కాళేశ్వరం లక్ష్యం నెరవేర్చడంలో మేఘా తన ప్రత్యేకతను అద్భుత పంపింగ్ ద్వారా చాటుకుంటోంది. ప్రారంభంలోనే అంత నీటిని అందిస్తుంటే భవిష్యత్తులో హంద్రీనీవా, పట్టిసీమ పథకాల తరహాలో వేల గంటలు, వంద రోజులు పనిచేస్తే తెలంగాణలో నీటి విప్లవం కళ్లెదుట కనిపిస్తుంది.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!