కన్న కూతుర్ని కిడ్నాప్ చేసి వేధించిన తండ్రి

కన్న కూతుర్ని కిడ్నాప్ చేసి, బంధువుల ఇంట్లో దాచి వేధించిన తండ్రి ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. కలువాయి మండలానికి చెందిన ఓ యువతి, వెంకటరమణయ్య అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో ఆ విషయం…

కన్న కూతుర్ని కిడ్నాప్ చేసి, బంధువుల ఇంట్లో దాచి వేధించిన తండ్రి ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. కలువాయి మండలానికి చెందిన ఓ యువతి, వెంకటరమణయ్య అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో ఆ విషయం చెప్పింది. దీనికి యువతి తల్లిదండ్రులు ముసలయ్య, రత్నమ్మ ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. తన ప్రియుడ్ని పెళ్లి చేసుకొని విడిగా ఉంటుంది.

కూతురు చేసిన పనిని ముసలయ్య తట్టుకోలేకపోయాడు. తమ మాట వినకుండా వెళ్లిన కూతురికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకే బావ వెంకటస్వామితో కలిసి కుట్రపన్నాడు. ఓ ఆటోడ్రైవర్ సహాయంతో కిడ్నాప్ కు ప్లాన్ చేశారు. నెల్లూరులో ఆమె చదువుతున్న కాలేజ్ వద్ద మాటువేశారు.

ప్రాక్టికల్ పరీక్షలు పూర్తిచేసి బయటకు వచ్చిన యువతి, కూరగాయలు కొనేందుకు భర్తతో కలిసి మార్కెట్ కు వెళ్లింది. అదే సమయం కోసం వేచి చూసి ముసలయ్య.. బావ, ఆటోడ్రైవర్ తో కలిసి వాళ్లను అటకాయించాడు. యువతి భర్తను నడిరోడ్డుపై చితక్కొట్టి, ఆటోలో కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అట్నుంచి అటు బంధువుల ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించాడు.

యువతి కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గంటల వ్యవథిలో కేసును ఛేదించారు. యువతి భర్త చెప్పిన సమాచారం ఆధారంగా ఆమెను విడిపించి ఇద్దర్నీ ఒకటి చేశారు. అయితే విషయం తెలుసుకున్న ముసలయ్య, ఆయన బావ పరారయ్యారు. పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారు.

ఈ రికార్డులు ఎవ‌రైనా బ్రేక్ చేస్తే చూడాల‌ని వుంది