భార్యను చంపి, మృతదేహంతో సెల్ఫీ

కొత్తగా పెళ్లైన ఆ జంట చూడ్డానికి కూడా ఎంతో ముచ్చటగా ఉంది. చూడ్డానికి ఎంతో అన్యోన్యంగా కనిపించారు. చూడ్డానికి ఆదర్శ దంపతులు అనిపించారు. కానీ అదంతా చూడ్డానికే.  Advertisement నాలుగు గోడల మధ్య ఏం…

కొత్తగా పెళ్లైన ఆ జంట చూడ్డానికి కూడా ఎంతో ముచ్చటగా ఉంది. చూడ్డానికి ఎంతో అన్యోన్యంగా కనిపించారు. చూడ్డానికి ఆదర్శ దంపతులు అనిపించారు. కానీ అదంతా చూడ్డానికే. 

నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఫలితంగా.. కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు భర్త. అత్యంత పైశాచికంగా మృతదేహంతో సెల్ఫీ కూడా దిగాడు.

కడప జిల్లా బద్వేల్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పట్టణంలోని సుందరయ్యా కాలనీకి చెందిన హరికి, మంజులతో వివాహం అయింది. వీళ్ల పెళ్లయి కేవలం 7 నెలలు మాత్రమే అవుతోంది. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో హఠాత్తుగా కుదుపు.

నిన్న రాత్రి హరి-మంజులకు గొడవ జరిగింది. ఆ గొడవలో హరి విచక్షణ కోల్పోయాడు. భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. హరి దాడితో మంజుల అక్కడికక్కడే మరణించింది. అక్కడితో హరిలో పైశాచికత్వం చల్లారలేదు. 

తన భార్య మృతదేహాన్ని మంచంపై వేసి, ఆ పక్కనే తను కూడా పడుకొని సెల్ఫీ దిగాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు హరిని అరెస్ట్ చేశారు.

పెళ్లయిన 7 నెలలకే భార్యను ఇంత దారుణంగా హరి ఎందుకు హత్య చేశాడనేది మిస్టరీగా మారింది. మంజుల కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తే, ఎలాంటి మనస్పర్థలు లేవని చెబుతున్నారు. హరికి కూడా ఎలాంటి మానసిక సమస్యలు లేవని చెబుతున్నారు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది.