కన్న కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం

హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాదిగా జరుగుతున్న ఈ ఘాతుకం తీవ్ర సంచలనం రేపింది. Advertisement తన ఇద్దరు కుమార్తెలపై…

హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాదిగా జరుగుతున్న ఈ ఘాతుకం తీవ్ర సంచలనం రేపింది.

తన ఇద్దరు కుమార్తెలపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని దుండిగల్ ప్రాంతంలో వెలుగుజూసింది. బీహార్ నుంచి నగరానికి వలస వచ్చిన కుటుంబం ఇది. భార్యభర్త, ఇద్దరు కూతుళ్లు ఉంటారు. పెద్ద కూతురుకు 14 ఏళ్లు, చిన్నకూతురుకు 12 ఏళ్లు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి తన కూతుళ్లపై కన్నేశాడు.

కూతుళ్లను బెదిరించి దాదాపు ఏడాదిగా వాళ్లను రేప్ చేస్తూనే ఉన్నాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలా తన భార్యకు తెలియకుండా కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. అయితే ఒక దశలో పిల్లల వ్యవహార శైలి చూసి తల్లికి అనుమానం వచ్చింది.

కూతుళ్లను దగ్గర చేసి అడగడంతో బోరున ఏడుస్తూ జరుగుతున్న అకృత్యాన్ని తల్లికి వివరించారు కూతుళ్లు. దీంతో ఆ తల్లి షాక్ కు గురైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుండిగల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తపై స్వయంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ కీచకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని చట్టాలు చేసినా దేశంలో ఇలాంటి నీచులు పుట్టుకొస్తూనే ఉన్నారు. మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారు.

బయట వాళ్ళు చూసి పిచ్చోడు వీడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి అనేవాళ్లు