ల‌స్ట్ స్టోరీస్ చేయాల్సింద‌న్న మారుతి!

వెబ్ సీరిస్ ల‌దే ఫ్యూచ‌ర్ అని అంటున్నాడు ద‌ర్శ‌కుడు మారుతి. త‌ను కూడా వెబ్ సీరిస్ లు చేయ‌బోతున్న‌ట్టుగా ఆయ‌న చెప్పారు. అందులో భాగంగా ఇప్ప‌టికే త‌న‌కు ఒక ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టుగా కూడ ఆయ‌న…

వెబ్ సీరిస్ ల‌దే ఫ్యూచ‌ర్ అని అంటున్నాడు ద‌ర్శ‌కుడు మారుతి. త‌ను కూడా వెబ్ సీరిస్ లు చేయ‌బోతున్న‌ట్టుగా ఆయ‌న చెప్పారు. అందులో భాగంగా ఇప్ప‌టికే త‌న‌కు ఒక ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టుగా కూడ ఆయ‌న వివ‌రించారు. హిందీలో హిట్టైన ల‌స్ట్ స్టోరీస్ సీరిస్ తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ వెబ్ సీరిస్ ద‌ర్శ‌క‌త్వం ఆఫ‌ర్ త‌న‌కూ వ‌చ్చిన‌ట్టుగా ఈ ద‌ర్శ‌కుడు చెప్పాడు. అయితే త‌ను చేయ‌లేక‌పోయిన‌ట్టుగా వివ‌రించాడు.

కానీ భ‌విష్య‌త్తులో త‌ను వెబ్ సీరిస్ చేయ‌డానికి రెడీ అని మారుతి ప్ర‌క‌టించారు. ఇలా మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడు వెబ్ సీరిస్ ల‌కు సై అంటున్నాడు. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్ తో స‌హా ప‌లువురు ద‌ర్శ‌కులు వెబ్ సీరిస్ ల‌కు సై అన్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగులో చెప్పుకోద‌గిన వెబ్ సీరిస్ లు ఏమీ రాలేదు. వ‌చ్చిన‌వి ఏవీ అంత‌గా ఆక‌ట్టుకోలేదు.

ప్ర‌స్తుతానికి అయితే ల‌స్ట్ స్టోరీస్ మేకింగ్ ద‌శ‌లో ఉన్న‌ట్టుంది. దానికి నందినీ రెడ్డి, సందీప్ రెడ్డి, సంక‌ల్ప్ రెడ్డి త‌దిత‌రులు ప‌ని చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌లువురు న‌టీమ‌ణుల పేర్లు కూడా ఆ సీరిస్ విష‌యంలో వినిపించాయి. ఇంత‌కీ తెలుగులో ఎప్పుడు వెబ్ సీరిస్ ల ట్రెండ్ పుంజుకుంటుందో!