ఒకటో తరగతి కుర్రాడు.. రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు

ఇటీవల మైనర్ బాలికలపై రేప్ ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలురు కూడా అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. పోనీ టీనేజ్ పిల్లలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారంటే వారి వయసు, సోషల్…

ఇటీవల మైనర్ బాలికలపై రేప్ ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలురు కూడా అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. పోనీ టీనేజ్ పిల్లలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారంటే వారి వయసు, సోషల్ మీడియా ప్రభావం అనుకోవచ్చు. కానీ ఒకటో తరగతి కుర్రాడు రేప్ కేసులో అరెస్ట్ కావడం మాత్రం విచిత్రం. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. రేప్ కేసులో ఒకటో తరగతి పిల్లాడిని ముజఫర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

స్కూల్ లో రేప్..

ఉత్తరప్రదేశ్‌ లోని ముజఫర్‌ నగర్ జిల్లాలోని ఒక పాఠశాలలో ఈ రేప్ జరిగినట్టు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడేళ్ల ఆ బాలిక ప్లే క్లాస్ చదువుతోంది. అదే స్కూల్ లో ఒకటో తరగతి చదివే విద్యార్థి ఓ రోజు ఆ బాలికను స్కూల్ పై అంతస్తుకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరికి కనిపించకుండా చాటుకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 

ఆ బాలిక ఏడుస్తూ క్లాస్ రూమ్ కి వచ్చింది. తోటి పిల్లలు అడిగితే ఏం చెప్పాలో తెలియలేదు. ఇంటికెళ్లిన తర్వాత తల్లిదండ్రులు ఆమెపై జరిగిన అఘాయిత్యాన్ని తెలుసుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒకటో తరగతి పిల్లాడు రేప్ చేశాడంటే ఎవరూ నమ్మడంలేదు. కనీసం లైంగిక దాడికి పాల్పడేంత ధైర్యం కూడా ఆ వయసువారికి ఉండదు. చివరికి ప్రేమ లాంటి వ్యవహారాలు కూడా తెలిసే వయసు కాదు. స్వచ్ఛమైన స్నేహం మాత్రమే వారికి తెలుసు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రేమకు మాత్రమే వారు కరిగిపోతారు.

అలాంటిది తనకంటే చిన్నపిల్లను, మరో క్లాస్ అమ్మాయిని డాబాపైకి తీసుకెళ్లి రేప్ చేశాడంటే పోలీసులే ఆశ్చర్యపోయారు. కానీ బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ పిల్లవాడిని అరెస్ట్ చేశారు. ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.