పట్టపగలు కాలేజీలో కత్తితో పొడిచేశాడు

న్యూ ఇయర్ వేడుకలు అయిపోయాయి, వీకెండ్ కూడా కావడంతో కుర్రకారు ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఎంతో ఆనందంగా, రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ్టి నుంచి కాలేజీల్లోకి అడుగుపెట్టారు యూత్. 20 ఏళ్ల లయశ్మిత కూడా…

న్యూ ఇయర్ వేడుకలు అయిపోయాయి, వీకెండ్ కూడా కావడంతో కుర్రకారు ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఎంతో ఆనందంగా, రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ్టి నుంచి కాలేజీల్లోకి అడుగుపెట్టారు యూత్. 20 ఏళ్ల లయశ్మిత కూడా అంతే ఉత్సాహంతో కాలేజీకి వచ్చింది. కానీ విధి వెక్కిరించింది. ఈరోజే ఆమెకు ఆఖరి రోజు అయింది.

స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతున్న లయశ్మిత ముందు సడెన్ గా ప్రత్యక్షమయ్యాడు పవన్ కల్యాణ్. నిజానికి అతడిది ఆ కాలేజీ  కాదు. కళ్లముందు ప్రత్యక్షమైన పవన్ కల్యాణ్ ను చూసి లయశ్మిత షాక్ అయింది.

ఆమె ఆ షాక్ లో ఉంటుండగానే, పవన్ కల్యాణ్ తన వెంట తెచ్చుకున్న కత్తి తీశాడు. కసితీరా లయశ్మితను పొడిచాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. లయశ్మిత కుప్పకూలిపోయింది. చుట్టూ ఉన్న స్నేహితులు భయంతో కేకలు వేశారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది లయశ్మితను హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమెను పొడిచిన పవన్ కల్యాణ్ కూడా అదే కత్తితో ఆత్మహత్యకు యత్నించాడు. కొన ఊపిరితో ఉన్న అతడ్ని హాస్పిటల్ లో చేర్పించారు.

బెంగళూరు శివార్లలోని ప్రెసిడెన్సీ కాలేజీలో జరిగింది ఈ ఘటన. ప్రేమిస్తున్నానంటూ కొన్నాళ్లుగా వెంట పడుతున్న పవన్ కల్యాణ్ ను లయశ్మిత తిరస్కరిస్తూ వస్తోందట. ఈ క్రమంలో కక్ష పెంచుకున్న పవన్ కల్యాణ్, ఆమెను హత్య చేశాడని కొంతమంది కాలేజీ విద్యార్థినులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.