సరిహద్దుల్లో పాక్ యుద్ధోన్మాదం: పాక్ సైన్యం కాల్పులు!

ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదుల్ని తయారుచేస్తున్న పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. Advertisement మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను…

ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదుల్ని తయారుచేస్తున్న పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ.. భారత్ సైన్యం దాడులు నిర్వహించింది. అయితే ఈ దాడులకు జవాబుగా పాకిస్తాన్ సైన్యం స్పందిస్తుండడం, సరిహద్దుల్లో యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తూ పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

పూంఛ్, రాజౌరీ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. ఈ కాల్పులకు భారత్ సైన్యం కూడా దీటుగానే జవాబిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

పాక్ సైన్యం కొన్ని రోజులుగా ప్రతిరోజూ సరిహద్దుల్లో ఎక్కడో ఒకచోట చెదురుమదురుగా కాల్పులకు పాల్పడడం.. భారత దళాలు దీటుగా స్పందిస్తుండడం జరుగుతూనే వస్తోంది. అయితే.. భారత వైమానిక దళం.. పీఓకేలో ప్రత్యేకించి నిర్దిష్టంగా ఎంపిక చేసిన ఉగ్రవాద స్థావరాల మీద మాత్రం దాడులు నిర్వహిస్తే, దానికి కూడా పాకిస్తాన్ సైన్యం స్పందించి కాల్పులకు దిగడం గమనార్హం.

యుద్ధాన్ని నివారించేందుకు, పాకిస్తాన్ కూడా రెచ్చిపోయి తీవ్రంగా స్పందించకుండా ఉండేందుకు భారత సైన్యం ఆచితూచి వ్యవహరించింది. ఎక్కడా పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లకుండా.. కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు నిర్వహించారు. అయినా సరే.. వీటికి పాక్ సైన్యం స్పందించడం దుర్మార్గం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భారత్ దాడులు చేస్తున్నది ఉగ్రవాదం మీద, ఉగ్రవాదుల్ని తయారుచేస్తున్న స్థావరాల మీద మాత్రమే అనే సంగతి గ్రహించకుండా.. పాకిస్తాన్ ప్రభుత్వం తరఫు వారు కూడా అతిగా స్పందిస్తున్నారు.

ఈ దాడులకు పాక్ దీటుగా సరైన సమయంలో, స్పందిస్తుందని.. ఈ రెచ్చగొట్టే చర్యలకు సరైన జవాబు చెప్పకుండా వదలిపెట్టేది లేదని ఒక పాకిస్తాన్ నాయకుడు వ్యాఖ్యానించినట్టుగా ఒక ఆంగ్లదినపత్రిక వెబ్ సైట్ పేర్కొంది.