పిల్లలను కంటే పన్ను రాయితీలు.. రిజర్వేషన్లు!

1950లో మహిళల్లో మొత్తం సంతానోత్పత్తి రేటు 4.5 కంటే ఎక్కువ ఉండేది. కానీ అది 2021 నాటికి 2.2 కి తగ్గింది.

కొన్ని దేశాల్లో పిల్లలను కనండి అంటూ ప్రభుత్వాలు అనేక రకాలైన ప్రోత్సహకాలు ఇస్తున్నాయి. పిల్లలను కనేవారికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఆర్థికపరంగా అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే…ఆ దేశాల్లో జనాభా తగ్గిపోతోంది కాబట్టి. ఇలాంటి దేశాల్లో ఎక్కువగా జపాన్​ పేరు వినిపిస్తుంది. ఆ దేశంలో ప్రజలు పిల్లలను కనకపోవడంతో దేశంలో యువత సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది.

ఈమధ్య కూడా జపాన్​ ప్రభుత్వం ఉద్యోగుల పనిగంటలు తగ్గించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం నాలుగు గంటలు మాత్రమే పనిచేయండి. మిగతా సమయంలో పిల్లలను కనడానికి కృషి చేయండని చెప్పింది. జనాభా తగ్గుదలతో బాధపడుతున్న మరికొన్ని దేశాలు కూడా జనాభా పెంచడానికి అనేక రకాల ప్లాన్లు అమలు చేస్తున్నాయి. ఈ మధ్య తమిళనాడు సీఎం స్టాలిన్​ ఎక్కువమంది పిల్లలను కనండి అంటూ కొత్తగా వివాహం చేసుకున్నవారికి అదే పనిగా ఊదరగొడుతున్నాడు.

ఎందుకంటే.. జనాభా తగ్గితే దక్షిణాదిలో పార్లమెంటు సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందట. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే పాట పాడుతున్నాడు. సరే…వీళ్లది రాజకీయ వ్యవహారం. ఎక్కువమంది పిల్లలను కనండి అనే నాయకులను ప్రజలు విమర్శిస్తున్నారు. ఎక్కువమందిని కంటే వారిని ప్రభుత్వం పోషిస్తుందా? అని అడుగుతున్నారు. సరే…ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే…అమెరికాలో కూడా జనాభా పెంచుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్​ సర్కారు దీనిపై దృష్టి సారించింది.

పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. పిల్లలను కనే మహిళలకు 5 వేల డాలర్ల బేబీ బోనస్​ ఇవ్వాలని అనుకుంటోంది. 5 వేల డాలర్లు అంటే సుమారు రూ. 4.25 లక్షలు. ఇదొక్కటే కాదు. చైల్డ్​ ట్యాక్స్​ క్రెడిట్​ పేరిట పన్ను రాయితీలు ఉంటాయి. క్రమంగా ఈ రాయితీలు పెరుగుతాయి కూడా . ఇవి మాత్రమే కాదు. స్కాలర్​షిప్​లు కూడా ఉంటాయి. పిల్లలు ఉన్నవారికి 30 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. అయితే ఇదంతా ప్రతిపాదనల దశలోనే ఉన్నా త్వరలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ముగ్గురు పిల్లలున్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, 14 మంది పిల్లలున్న ఎలన్​ మస్క్​ ఈ ప్రతిపాదనలకు మద్దతు ప్రకటించారు. 1990ల నుంచి అమెరికాలో సంతానోత్పత్తి రేటు పడిపోతోంది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 1960వ దశకంలో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 5గా ఉండేది. 2021 నాటికి అది 2.4కు పడిపోయింది. ఈ విషయాన్ని అమెరికా వార్తాపత్రిక ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది.

దక్షిణకొరియాలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 0.75గా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో సంతానోత్పత్తి రేటు 1.6గా ఉండగా.. భారతదేశంలో 1.98గా, చైనాలో 1.7గా ఉన్నట్టు వివరించింది. లాన్సెట్ జర్నల్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. 1950లో మనదేశంలో ఫెర్టిలిటీ రేటు 6.2గా ఉండేది. 2021 నాటికి అది 2.0 కంటే తక్కువకు పడిపోయింది.

1950లో మహిళల్లో మొత్తం సంతానోత్పత్తి రేటు 4.5 కంటే ఎక్కువ ఉండేది. కానీ అది 2021 నాటికి 2.2 కి తగ్గింది. సంతానోత్పత్తి రేటు 2050 సంవత్సరం నాటికి 1.29 కి, 2100 సంవత్సరం నాటికి 1.4 కి పడిపోవచ్చని అంచనా వేసింది. మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్ళు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటి అంశాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

4 Replies to “పిల్లలను కంటే పన్ను రాయితీలు.. రిజర్వేషన్లు!”

  1. ఢిల్లీ రాజకీయాల్లో వేళ్ళ వేళ్ళ పలుకుబడి ఎక్కువ ఎక్కువ ఉండడం కోసం జనాలు ఎక్కువ మందిని కనాల. చంద్ర బాబు లోకేష్ వచ్చి పిల్లలను పెంచి చదివిస్తారా. పోతారా ర రేయ్.

    1. నాకు ఇద్దరు పిల్లలు. ఆదాయం బాగానే ఉన్నా కూడా పెంచడానికి ఇబ్బంది పడుతున్నా. టాక్స్ రూపం లో 30% పోతుంది . లక్ష కోట్లు ఉన్న వాళ్ళు మాత్రం ఒకరిద్దరు పిల్లల్తో సర్దుకుంటున్నారు. జనాల్ని మాత్రం కానమంటున్నారు. ఎక్కువ మంది జనాభా ఉంటే ఎక్కువ అప్పు వస్తుంది ఎక్కువ డబ్బులు దొబ్బేయొచ్చు. ఈ లంజాకొడుకులు ఖాళీగానే ఉన్నారు కదా ? పప్పు గాడు ఒక్కరితోనే దుకాణం సర్దేశాడు . జనాల డబ్బులు దెంగేయడానికే ఈ లంజాకొడుకులు.

    2. నాకు ఇద్దరు పిల్లలు. ఆదాయం బాగానే ఉన్నా కూడా పెంచడానికి ఇబ్బంది పడుతున్నా. టాక్స్ రూపం లో 30% పోతుంది . లక్ష కోట్లు ఉన్న వాళ్ళు మాత్రం ఒకరిద్దరు పిల్లల్తో సర్దుకుంటున్నారు. జనాల్ని మాత్రం క నమంటున్నారు. ఎక్కువ మంది జనాభా ఉంటే ఎక్కువ అప్పు వస్తుంది ఎక్కువ డబ్బులు దొబ్బేయొచ్చు. ఈ లంజాకొడుకులు ఖాళీగానే ఉన్నారు కదా ? పప్పు గాడు ఒక్కరితోనే దుకాణం సర్దేశాడు . జనాల డబ్బులు దెంగేయడానికే ఈ లంజాకొడుకులు.

Comments are closed.