ఏరుదాటాక తెప్ప తగలేస్తున్న హీరోయిన్లు

టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటారు. ఇక్కడే అన్నీ నేర్చుకుంటారు. డబ్బులు కూడా సంపాదించుకుంటారు. బాలీవుడ్ లో అంతోఇంతో పేరు తెచ్చుకున్న వెంటనే విషం చిమ్ముతుంటారు. Advertisement టాలీవుడ్ వేస్ట్ అంటూ కామెంట్స్ చేస్తారు. ఇక్కడి…

టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటారు. ఇక్కడే అన్నీ నేర్చుకుంటారు. డబ్బులు కూడా సంపాదించుకుంటారు. బాలీవుడ్ లో అంతోఇంతో పేరు తెచ్చుకున్న వెంటనే విషం చిమ్ముతుంటారు.

టాలీవుడ్ వేస్ట్ అంటూ కామెంట్స్ చేస్తారు. ఇక్కడి మేకర్స్ పై సెటైర్లు వేస్తారు. రాధిక ఆప్టే, తాప్సి, నగ్మా.. ఇలా చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ పై జోకులేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ రాశిఖన్నా కూడా చేరిపోయింది.

తెలుగులో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న రాశీఖన్నా.. తను చేసినవన్నీ బోరింగ్ పాత్రలని చెప్పుకొచ్చింది. తెలుగులో నటించి తనకు టాలెంట్ ఉందనే విషయాన్నే మరిచిపోయిందట. ఇకపై బాలీవుడ్ లో తన విశ్వరూపం చూస్తారంటూ గొప్పలు చెప్పుకుంది. ఇంతా చేసి రాశిఖన్నా హిందీలో చేసింది సినిమా కాదు, ఓ వెబ్ సిరీస్.

మొన్నటికిమొన్న పూజాహెగ్డే కూడా టాలీవుడ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. తెలుగు ప్రేక్షకులు హీరోయిన్ల నడుము మాత్రమే చూడాలనుకుంటారని, అందుకే నడుము కనిపించేలా దుస్తులు వేస్తారని, ఇక తన విషయానికొస్తే.. నడుముతో పాటు కాళ్లు కూడా చూడాలనుకుంటారని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై ఆమె ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది.

తాప్సి అయితే మరీ ఘోరంగా స్పందించింది ఈమధ్య. హీరోయిన్ బొడ్డు కనిపిస్తే రకరకాల పండ్లు పరిచేస్తారని ఎద్దేవా చేసింది. హీరోయిన్ల నడుము చూపించడానికి అక్కడ దర్శకులు పోటీపడుతుంటారని జోకులేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే రాధిక ఆప్టే, నగ్మ, శృతిహాసన్ కూడా టాలీవుడ్ పై వివిధ సందర్భాల్లో నోరుపారేసుకున్నారు.