కడప జిల్లాలో టీడీపీ నేత నందం సుబ్బయ్య రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ హత్య ప్రమాణాలకు దారి తీసింది. హతుడు ప్రొద్దుటూరు నివాసి కావడంతో, స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదంటూ నిన్న చౌడమ్మ అమ్మ వారి ఆలయంలో ఆమె పాదాల సాక్షిగా ఎమ్మెల్యే ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే ప్రమాణంపై మృతుడి భార్య అపరాజిత తీవ్రంగా స్పందించారు.
తన భర్తను ఎమ్మెల్యే బామ్మర్ది బంగారురెడ్డి చంపాడని తన ఇద్దరి కుమారులపై ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. ఎమ్మెల్యే ప్రోత్సాహం లేకుండానే ఆయన బామ్మర్ది బంగారురెడ్డి తన భర్తను చంపుతాడా? అని ఆమె ప్రశ్నించారు.
బంగారురెడ్డిపై మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు వస్తుంటే …ఆయన బయటికి వచ్చి ఎందుకు ప్రమాణం చేయలేదని బాధితురాలు నిలదీశారు.
తన ఇద్దరు కుమారులపై తాను ప్రమాణం చేసి బంగారురెడ్డే హత్యా చేశారని చెబుతున్నప్పుడు, ఆయన కూడా తాను చేయలేదని ప్రమాణం చేయాలని అపరాజిత డిమాండ్ చేశారు.
బావ కాదని, బామ్మర్ది ప్రమాణం చేయాలని ఆమె గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. బావ, బామ్మర్దుల అరాచకాలను తన భర్త బయట పెట్టాడని దారుణంగా చంపారని అపరాజిత ఆవేదన వ్యక్తం చేశారు.