ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మందిపై అత్యాచారం

అమ్మాయిల బలహీనతల్ని ఆసరాగా చేసుకొని దురాగతాలకు పాల్పడిన కామాంధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది అమ్మాయిల్ని ఇతడు రేప్ చేసినట్టు గుర్తించి అవాక్కయ్యారు. ఉత్తరాంఖండ్ లో జరిగింది…

అమ్మాయిల బలహీనతల్ని ఆసరాగా చేసుకొని దురాగతాలకు పాల్పడిన కామాంధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది అమ్మాయిల్ని ఇతడు రేప్ చేసినట్టు గుర్తించి అవాక్కయ్యారు. ఉత్తరాంఖండ్ లో జరిగింది ఈ ఘటన.

నైనిటాల్ జిల్లా హల్ ద్వానీలో ఉంటున్న చారు చంద్రజోషి, ఫేస్ బుక్ వేదికగా మోసాలకు తెగబడ్డాడు. నర్సింగ్ కోర్స్ చేసిన మహిళలే ఇతడి టార్గెట్. తను మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానని, లంచం ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు వల వేసేవాడు చంద్రజోషి.

ఇతడి మాయమాటలు నమ్మి చాలామంది లక్షల రూపాయలు లంచాలిచ్చారు. అలా డబ్బులు తీసుకున్న చంద్రజోషి, వాళ్లను సిటీకి పిలిచేవాడు. ఇంటర్వ్యూలు, మెడికల్ చెకప్ అంటూ 2 రోజులు ఉంచుకొని వాళ్లపై అత్యాచారాలకు పాల్పడేవాడు. ఇలా 50 మందికి పైగా మహిళల్ని ఇతడు లైంగికంగా వేధించాడు.

ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రజోషి ఆగడాలు ఒక్కసారిగా బయటపడ్డాడు. తన దగ్గర్నుంచి లక్ష రూపాయల డబ్బు తీసుకోవడంతో పాటు, తనను లైంగికంగా వేధించాడని ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం బండారం బయటపడింది.

వల పన్ని చంద్రజోషిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడ్ని జైలుకు తరలించారు. అతడి చేతిలో మోసపోయిన మహిళలంతా వచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.