ఉగాది వచ్చిందంటేనే పంచాంగాలు జాతకాలతో ఒకింత ఆనందం మరో వైపు భయం కూడా కలుగుగుతుంది. ఎవరి జాతకం ఏంటో పంచాంగం గుట్టు విప్పుతుంది.
ఇదిలా వుంటే విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామీజీ ఈ ఏడాది పంచాంగం చెబుతూ ఉత్కంఠభరితమైన విషయాన్ని కూడా చెప్పారు. ఈ ఏడాది ఒక పెద్ద నాయకుడికి గండం ఉంటుందని ఆయన చెప్పడం విశేషం.
ఆ పెద్ద నాయకుడు ఎవరు, ఆయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారా లేక దేశానికి సంబంధించిన జాతీయ నేత అన్నది మాత్రం స్వామీజీ చెప్పలేదు. కానీ ఆ అగ్ర నాయకుడికి జాతకరిత్యా ముప్పు పొంచి ఉందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ జాతకం ఈ ఏడాది చాలా బాగుందని స్వామీజీ చెప్పారు. ఆర్ధికంగానే కాదు అన్ని విధాలుగా రాష్ట్రం ఈ ఏడాది పటిష్టంగా ముందుకు అడుగులు వేస్తుందని స్వాంజీ పేర్కొన్నారు.
పచ్చని పంటలతో రైతాంగం కూడా ఆనందంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని కూడా ఆయన వివరించారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు