రాప్తాడు ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అనంత‌పురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని చంపి టీడీపీ అధికారంలోకి రావాల‌ని భారీ కుట్ర‌ప‌న్నుతోంద‌ని ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.…

అనంత‌పురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని చంపి టీడీపీ అధికారంలోకి రావాల‌ని భారీ కుట్ర‌ప‌న్నుతోంద‌ని ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తోపుదుర్తి తాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.

ఇటీవ‌ల మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబ‌టి రాంబాబు, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను చంపేందుకు రూ.50 ల‌క్ష‌లు సుపారీ ఇస్తాన‌ని తెలంగాణ‌కు చెందిన మ‌ల్లాది వాసు (ఖ‌మ్మం మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌) బ‌హిరంగంగా క‌మ్మ కుల స‌మావేశంలో ఆఫ‌ర్ ఇవ్వ‌డం తీవ్ర దుమారం రేపింది. ఆ త‌ర్వాత అత‌ను క్ష‌మాప‌ణ చెప్పాడు. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ భ‌ద్ర‌త‌పై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి అనుమానం, ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌ల్లాది వాసు ఓ అనామ‌కుడ‌న్నారు. అలాంటి వ్య‌క్తి మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబ‌టి రాంబాబు, వ‌ల్ల‌భ‌నేని వంశీలను హ‌త్య చేస్తే రూ.50 ల‌క్ష‌లు ఇస్తానంటాడా? అని ప్ర‌శ్నించారు. అత‌ని వెనుక అదృశ్య శ‌క్తులున్నాయ‌ని ప్ర‌కాశ్‌రెడ్డి ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. మ‌ల్లాది వాసు సుపారీ వ్యాఖ్య‌ల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న బామ్మ‌ర్ది నంద‌మూరి బాలకృష్ణ ఎందుకు ఖండించ‌లేద‌ని తోపుదుర్తి ప్ర‌శ్నించారు.

త‌మ వాళ్ల జోలికొస్తూ చూస్తూ ఊరుకోమ‌ని ఆయ‌న గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌మ పార్టీ ఎమ్మెల్యే కాద‌న్నారు. సైకిల్ గుర్తుపై గెలిచిన ఏ ఒక్క‌ర్నీ వైసీపీలో చేర్చుకోలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

నారా భువ‌నేశ్వ‌రిపై దూష‌ణ‌ల ప‌ర్వం అనేక అవాంఛ‌నీయ ప‌రిణామాల‌కు దారి తీసింది. ఆ గొడ‌వ స‌మ‌సిపోయింద‌ని అనుకుంటున్న త‌రుణంలో తోపుదుర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.