మోడీ ధుర్యోధ‌నుడు, అమిత్ షా శ‌కుని.. సినీ న‌టుడు ఫైర్!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లు కృష్ణార్జునులుతో పోల్చ‌డాన్ని ఆక్షేపించాడు త‌మిళ న‌టుడు సిద్ధార్థ్. ప‌లు సినిమాల‌తో తెలుగు వారితో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు…

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లు కృష్ణార్జునులుతో పోల్చ‌డాన్ని ఆక్షేపించాడు త‌మిళ న‌టుడు సిద్ధార్థ్. ప‌లు సినిమాల‌తో తెలుగు వారితో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు క‌లిగిన సిద్ధార్థ్ వివిధ సామాజిక అంశాల మీద స్పందిస్తూ ఉంటాడు.

చాలా కాలం నుంచినే సిద్ధూ ఇలా రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల గురించి ట్విట‌ర్ ద్వారా స్పందిస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్ల‌పై ఈ న‌టుడు ప‌లుసార్లు ఫైర్ అయ్యాడు. ఇప్పుడు మ‌రోసారి మోడీ, అమిత్ షాల‌ను తీవ్రంగా విమ‌ర్శించాడు ఈ హీరో.

పౌర‌స‌త్వ చ‌ట్టం వివాదం గురించి సిద్ధార్థ్ స్పందిస్తూ మోడీని ధుర్యోధ‌నుడితో, అమిత్ షాను శ‌కునితో పోల్చాడు. వాళ్లు కృష్ణార్జునులు కాదు, ధుర్యోధ‌నుడు-శ‌కుని అని సిద్ధార్థ్ అభిప్రాయ‌ప‌డ్డారు. పౌర‌స‌త్వం చ‌ట్టం స‌వ‌ర‌ణ‌ల‌ను వ్య‌తిరేకిస్తున్న విద్యార్థుల‌కు సిద్ధూ మ‌ద్ద‌తు ప‌లికాడు.