చెన్నమనేని రమేష్…ఈ పేరు తెలియనివారు తెలంగాణలో ఉండరు. ఆయన ఒకప్పుడు బీఆర్ఎస్లో అంటే పాత టీఆర్ఎస్లో కీలక నాయకుడు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే కూడా. ఆయన ఎందుకని పాపులర్ వ్యక్తిగా మారాడంటే…ఆయన పౌరసత్వం వివాదం కారణంగా. ఆయన భారత పౌరుడు కాడని, జర్మనీ పౌరుడని ఏళ్ల తరబడి కోర్టులో కేసు నడుస్తోంది. ఆ కేసును ఈరోజు హైకోర్టు ముగించేసింది.
చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని, జర్మనీ పౌరుడని సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దీంతో చెన్నమనేని రమేష్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రమేష్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు నిర్థారించింది. పౌరసత్వం కేసులో దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రమేష్కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. రూ. 25 లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని, మరో రూ. 5 లక్షలు హైకోర్టు న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.
రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు పైన అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకుని రూ. 30 లక్షలు చెన్నమనేని రమేశ్ చెల్లించారు.
చెన్నమనేని జర్మనీ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో చెన్నమనేని రమేష్ ఎన్నికల్లో పోటీ చేశారని కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ వేములవాడ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలుపొందారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ తర్వాత ఉపఎన్నికతో కలిపి 2010 నుంచి 2018 వరకు మూడుసార్లు విజయం సాధించారు.
చట్టం ప్రకారం భారతీయ పౌరులు కాని వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు లేదా ఓటు వేసేందుకు అవకాశం లేదు. రమేష్ జర్మన్ పాస్పోర్ట్ను కలిగి ఉన్నారని, అది 2023 వరకు చెల్లుబాటులో ఉందని 2020లో కేంద్రం తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. అయితే రమేష్ తన దరఖాస్తులో వాస్తవాలను దాచిపెట్టిన కారణంగా భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు పత్రాలతో భారత ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పుడు కేంద్రం నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దీంతో రమేష్ పౌరసత్వం కథ ముగిసింది. రమేష్ తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆయన తమ్ముడు చెన్నమనేని విద్యాసాగర్రావు బీజేపీ ప్రముఖ నాయకుడు. మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. రమేష్ జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించారు. లీప్జిగ్లో ఎంఎస్సీ అగ్రికల్చర్,1987లో బెర్లిన్ హంబోల్ట్ యూనివర్సిటీ నుండి పిహెచ్.డి. పూర్తిచేశారు. రమేష్ కు మరియా (జర్మన్ పౌరురాలు)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
రమేష్ ఉద్యోగ నిమిత్తం 1990లలో జర్మనీ దేశానికి వెళ్లారు. అతనికి 1993లో జర్మన్ పౌరసత్వం రావడంతో అతని భారతీయ పాస్పోర్ట్ను అప్పగించారు. తరువాత మళ్ళీ 2008లో భారతదేశానికి తిరిగి వచ్చారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంజూరు చేసే భారతీయ పౌరసత్వం కోసం తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా రమేష్ పౌరసత్వం పొందారని నిర్థారణ అయింది. హైకోర్టు తీర్పు బీఆర్ఎస్కు మాయని మచ్చేనని చెప్పవచ్చు.
ఇంత పెద్ద నేరం చేసి MLA గా ఐదేళ్లు ఉండి, ఇన్నేళ్లకు తీర్పు రావటమే కాక , జరిమానా మాత్రమే విధించటం ఏవిధమైన శిక్షో అర్ధం కావట్లేదో.
మన తెలుగు D0 న్ గ్ @ల పార్టీ అంశే అది! అంతకంటే.. ఎక్కువ విలువలు V@ ట్ కాయ అని.. ఏం కబుర్లు చెప్పకు దొరికిపోయాక!! ఎం మన $K!ల్ $ C@మ్ D0 న్ గ ను కాగ్ నివేదికే బైటపెట్టినప్పుడు ఇదే చెప్పవా? ఏలేరు … కుంభకోణం నుండి.. మొన్నటి.. $K!ల్ $ C@మ్ నిన్న TCS కి.. 99 పైసలకు.. లీజ్ కి ఇవ్వకుండా.. ఏకంగా భూములే అమ్మేసుకోవటం అన్ని.. కుంబకోణాలే ర!
మరి.. మన బొల్లి గాడికెం విధించాలి శిక్ష?
A small correction, He was an MLA for 15 years not 5 years
మామూలు పాస్పోర్ట్ తనిఖీ కి గంట కంటే ఎక్కవ సమయం పట్టదు. మరీ ఇన్నేళ్లు విచారణ ఏమిటి?
భారత్ పౌరుడు కానీ వాడికి MLA.. మరి అబద్ధం చెప్పిన్నదుకు జైలు శిక్ష లేదా?
ఇదే పని మామూలు మనిషీ చేస్తే, వెంటనే జైలు లో పెడతారు కదా..
Ante Indian citizen kaanodu 10 years MLA ayipovaccha. em desam ra bhai.
Chinnanna BJP pramukhudu. Jarimana veyadamae pedda vishayam.
Ante court dunnapothu nidra nidrapoindi. Jaragalsnia nashtam jarigindi. Vaadu 3 saarlu MLA ayyi padavulu anubhavinchadu.
Indian courts tughlaq and falthu courts..thu veella bathuku. Avi asalu courts leka broker yavvaralu chese samsthala?
That means without being indian citizen you can be MLA for full term aa. Where is desam going?
ఇది కాదు? అసలు ప్రజాస్వామ్యం. వస్త్ర విహీనం చేసి nadi రోడ్డు లో nilavettaru.
15 ఏళ్ళు mla గా చేసినందుకు తీసుకున్న జీతాన్ని కక్కించారా. ప్రస్థానం 2009 tdp నుంచి అనమాట ఏంటో ఈ దొంగ nri లందరు tdp నుంచి career start chestaaru