ఇటు భర్త, అటు ప్రియుడు.. హంతకుడు ఎవరు?

హైదరాబాద్ చంపాపేట్ లో జరిగిన స్వప్న హత్య మిస్టరీని గంటల వ్యవథిలో పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు కారణం వివాహేతర సంబంధమని గుర్తించిన పోలీసులు.. స్వప్నను హత్య చేసింది ఆమె భర్తేనని ప్రకటించారు. అంతకంటే…

హైదరాబాద్ చంపాపేట్ లో జరిగిన స్వప్న హత్య మిస్టరీని గంటల వ్యవథిలో పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు కారణం వివాహేతర సంబంధమని గుర్తించిన పోలీసులు.. స్వప్నను హత్య చేసింది ఆమె భర్తేనని ప్రకటించారు. అంతకంటే ముందు ఈ కేసు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

చంపాపేట్ లో ఓ అద్దె ఇంట్లో దిగింది మహబూహ్ నగర్ కు చెందిన స్వప్న. నెల రోజుల కిందట మహేశ్వరంకు చెందిన ప్రేమ్ కుమార్ ను ఈమె పెళ్లాడింది. ఇద్దరూ కలిసి చంపాపేట్ లో ఉంటున్నారు. అయితే పెళ్లికి ముందే సతీష్ అనే మరో వ్యక్తితో ప్రేమలో ఉంది స్వప్న. పెళ్లి తర్వాత కూడా ఆమె తన సంబంధాన్ని కొనసాగించింది.

ఈ క్రమంలో శనివారం భర్త ప్రేమ్ కుమార్ బయటకెళ్లిన తర్వాత, ప్రియుడు సతీష్ ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే కొద్దిసేపటికే ప్రేమ్ కుమార్ మళ్లీ ఇంటికొచ్చాడు. ఇంట్లో స్వప్న-సతీష్ ను చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఇంట్లో ఉన్న కత్తితో స్వప్న గొంతు కోసి హత్య చేశాడు.

అదే టైమ్ లో తను ఉంటున్న రెండో అంతస్తు నుంచి ప్రేమ్ కుమార్ కింద పడ్డాడు. అతడ్ని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే అతడు కోమాలోకి వెళ్లాడు. మరోవైపు సతీష్ పరారయ్యాడు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు కష్టంగా మారింది. స్వప్నను హత్య చేసింది భర్తా.. లేక ప్రియుడా అనే విషయం తేల్చుకోలేకపోయారు. పైగా ప్రేమ్ కుమార్ ఎలా కింద పడ్డాడనే విషయంపై కూడా ఎలాంటి క్లూ లేదు.

ఎట్టకేలకు ప్రేమ్ కుమార్ కోమా నుంచి బయటకొచ్చాడు. తనే స్వప్నను హత్య చేసినట్టు చెప్పాడు. అతడి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. మరోవైపు పరారీలో ఉన్న సతీష్ కోసం 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అతడు దొరికిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని అంశాలు బయటకొచ్చే అవకాశం ఉంది.