62 కోట్లకు చేరిన భక్తుల సంఖ్య

ప్రయాగ్ రాజ్ లో జనవరి 13న మొదలైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిన్నటివరకు 62 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది

ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. ఆ తర్వాత ఆ అంచనాల్ని సవరించి 50 కోట్ల మంది వస్తారనుకున్నారు. కానీ మహాకుంభమేళాలో స్నానమాచరించిన భక్తుల సంఖ్య ఏకంగా 62 కోట్లకు చేరింది.

ప్రయాగ్ రాజ్ లో జనవరి 13న మొదలైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిన్నటివరకు 62 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన ఈ కొద్ది రోజుల్లో కనీసం మరో 2 కోట్ల మంది భక్తులు వస్తారనేది అంచనా.

144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో 73 దేశాల నుంచి భక్తులు తరలివచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క నేపాల్ నుంచే దాదాపు 50 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టు తెలిపింది.

మరోవైపు పెరిగిన రద్దీతో ప్రయాగరాజ్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. గడిచిన ఏడాది మొత్తం రోడ్లు తవ్వి, నిర్మాణాలు చేసి, రకరకాల ఏర్పాట్లతో ఉక్కిరిబిక్కిరి చేశారని.. ఇప్పుడు కోట్లాది మంది భక్తుల రాకతో చాలా ఇబ్బందిగా ఉందని అంటున్నారు.

రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నామని అంటున్నారు ప్రయాగరాజ్ ప్రజలు. ఇంట్లోంచి అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి ఉందని, ఎక్కడా కాలుమోపే పరిస్థితి లేదంటున్నారు. బయటి ప్రజలు తమ సొంత వాహనాలతో వస్తూ, పెద్ద పెద్ద గుంపులుగా నడుస్తూ, నగరాన్ని పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, అక్షరాలా ఎక్కడా స్థలం లేదని వాపోతున్నారు.

మహాకుంభమేళా పరిసమాప్తమౌతున్న వేళ.. ప్రయాగ్ రాజ్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాము ఊపిరిపీల్చుకుంటామంటున్నారు. నిజమే.. 62 కోట్ల మంది వచ్చి ఒక ఊరు మీద పడితే ఎలా ఉంటుంది? ప్రయాగ్ రాజ్ పరిస్థితి ఇప్పుడదే!

8 Replies to “62 కోట్లకు చేరిన భక్తుల సంఖ్య”

    1. Dharmam ga vunna vallaki drama lu avasaram ledandi….meeku min sanathana dharmam knowledge ledu la vundi..bhagavath geetha chadavalekapothe nagarjuna ramadhasu cinema chudandi

  1. అప్పట్లో పెద్ద బొట్టు పెట్టుకొని హిందూ వేషం డ్రామా వేసిన జగన్ రెడ్డి అనే సామాన్య ఎంఎల్ఏ వెళ్ళడ, కుంబ్ మేళా కి ?

Comments are closed.