వెంటాడి, పరుగెత్తించి మరీ భార్యను చంపేశాడు

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను రోడ్డుపై పరుగెత్తించి, వెంటాడి మరీ హత్య చేశాడు దుర్మార్గుడు. కొనఊపిరితో విలవిల్లాడుతూ, రోడ్డుపైనే మరణించింది ఆ మహిళ. Advertisement హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి పరిథిలో…

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను రోడ్డుపై పరుగెత్తించి, వెంటాడి మరీ హత్య చేశాడు దుర్మార్గుడు. కొనఊపిరితో విలవిల్లాడుతూ, రోడ్డుపైనే మరణించింది ఆ మహిళ.

హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి పరిథిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అంబిక, నరేందర్ భార్యభర్తలు. అయితే పెళ్లయినప్పట్నుంచి ఇద్దరి మధ్య విభేధాలు మొదలయ్యాయి. వీళ్ల మధ్య అన్యోన్యత లేకపోవడానికి కారణం 2 కుటుంబాల మధ్య కలహాలే.

దీంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అంబిక శేరిలింగంపల్లిలో, నరేందర్ తాండూర్ లో ఉంటున్నాడు. విడివిడిగా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈరోజు కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఫోన్ లో ఇద్దరూ పెద్దగా వాదించుకున్నారట. దీంతో తాండూరు నుంచి శేరిలింగంపల్లి వచ్చాడు నరేందర్. వస్తూనే అంబిక తలపై పెద్ద రాయితో కొట్టాడు.

రక్తంతో అంబిక పరుగులు తీసింది. రోడ్డుపైకి వచ్చి కాపాడమంటూ అరిచింది. ఆమె వెనక నరేందర్ కూడా అనుసరించాడు. రోడ్డుపై ఆమెను వెంబడించి మరీ, తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. నరేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉంది. ఘటన జరిగినప్పుడు కొంతమంది ఆ దృశ్యాల్ని తమ కెమెరాలతో షూట్ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.