మూడు రోజుల క్రితమే ఆంధ్రలో ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో.. తెలంగాణలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయో అని గొప్పలు చెప్పిన హరీష్ రావు మాటలు మరిచిపోక ముందే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడింది.
ఆస్పత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని బంధువులు కాళ్లు పట్టుకుని నేలపై లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోగి కాళ్లు పట్టి లాగుతున్నా అక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోక పోవటం గమనార్హం. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వ ఆస్పత్రులలో సరైన సౌకర్యాలు లేక రోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన ఇప్పుడు సీసీ టీవీ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కురిపిస్తూ ముందు తెలంగాణలో ఆస్పత్రులను బాగుచేసి పక్క రాష్ట్రాలపై విమర్శలు చేయాలంటున్నారు. హరీష్ గారు ఒక్కసారి నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై మాట్లాడలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
లిప్ట్ వచ్చిందనే తొందరలో రోగి సహాయకులే అలా లాక్కెళ్లారని.. సిబ్బంది పట్టించుకోలేదనడం అసత్యమని ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు.