ప్రేమ‌ను చంపుకోలేక .. ర‌వ‌ళి ఆత్మ‌హ‌త్య‌

మ‌న‌సులో ఉన్న‌దొక‌రు, మ‌నువాడింది మ‌రొక‌రు. పెళ్లి అనేది మాన‌సిక బంధ‌మ‌ని, ఇష్టం లేని జీవితం న‌ర‌క‌ప్రాయ‌మైంద‌ని, ఇలాంటి బ‌తుకు త‌న‌కు వ‌ద్ద‌ని ఓ యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలో చోటు…

మ‌న‌సులో ఉన్న‌దొక‌రు, మ‌నువాడింది మ‌రొక‌రు. పెళ్లి అనేది మాన‌సిక బంధ‌మ‌ని, ఇష్టం లేని జీవితం న‌ర‌క‌ప్రాయ‌మైంద‌ని, ఇలాంటి బ‌తుకు త‌న‌కు వ‌ద్ద‌ని ఓ యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రేమించిన వాడిని కాద‌ని, మ‌రొక‌రితో బ‌ల‌వంత‌పు పెళ్లి చేసేందుకు త‌ల్లిదండ్రులు ప్ర‌య‌త్నిస్తే, పోలీసుల‌కు ఫిర్యాదు చేసి పెళ్లి పీఠ‌ల మీద నుంచి లేచి వెళ్లిపోయిన యువ‌తి గురించి ఇటీవ‌ల తెలుసుకున్నాం. అలాగే ఆ యువ‌తి కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంది.

అలా ధైర్యం చేయ‌లేని ర‌వ‌ళి అనే యువ‌తి ఈ లోకాన్ని శాశ్వ‌తంగా వీడాల్సి వ‌చ్చింది. త‌న వాళ్ల‌కు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా  నారాయ‌ణ‌గిరికి చెందిన మెడ‌బోయిన ర‌జాక్ కూతురు ర‌వ‌ళికి భీమ‌దేవర‌ప‌ల్లి మండ‌లం గాంధీన‌గ‌ర్ నివాసి ఐల‌బోయిన రాజుతో ఈ నెల 11న పెళ్లి అయింది.

అయితే ర‌వ‌ళి ఇష్ట‌ప‌డిన యువ‌కుడు మ‌రొక‌రున్నారు. త‌న ఇష్టం గురించి కుటుంబ పెద్ద‌ల‌కు  చెప్పినా ప‌ట్టించుకోలేదు. దీంతో వారి ఇష్టాన్ని కాద‌న‌లేక త‌లొంచి పెద్ద‌లు కుదుర్చిన రాజు అనే యువ‌కుడితో మూడు ముళ్లు వేయించుకుంది. అయితే తాను మ‌న‌సుప‌డ్డ‌ యువ‌కుడిని ర‌వ‌ళి మ‌రిచిపోలేక‌పోయింది. ఇష్టం లేని జీవితం కంటే చావే మేల‌ని ఆ యువ‌తి భావించి, అనుకు న్నంత ప‌ని చేసింది. ఈ సంద‌ర్భంగా త‌ల్లికి ఓ లేఖ రాసింది.

‘అమ్మా.. నన్ను క్షమించండి. నేను సంతోషంగా ఉండాలని పెళ్లి చేశావు. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు. నేను నా భర్తతో ఉండలేకపోతున్నా. ఎందుకంటే ఆయ‌న‌పై నాకు ఇష్టం లేదు. దీంతో ప్రతీ క్షణం నరకం అనుభవిస్తున్నా’ అంటూ ఓ నవ వధువు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. 

మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ వార్ణింగ్ ఇస్తున్నాడు