వైజాగ్ రాసిచ్చేసి ఇపుడు పెడబొబ్బలా.. ?

ఉత్తరాంధ్రా భూకబ్జాల మయం అయిపోతోందా. అక్కడ ప్రజలు వణుకుతున్నారా, ఇది నిజమేనా అంటే అవును నిజమే అంటున్నారు వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి. అయితే అదంతా గతం. ఇపుడు మాత్రం పచ్చగా ప్రశాంతంగా ఉంది…

ఉత్తరాంధ్రా భూకబ్జాల మయం అయిపోతోందా. అక్కడ ప్రజలు వణుకుతున్నారా, ఇది నిజమేనా అంటే అవును నిజమే అంటున్నారు వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి. అయితే అదంతా గతం. ఇపుడు మాత్రం పచ్చగా ప్రశాంతంగా ఉంది అని కూడా చెబుతున్నారు. అది చూసి ఓర్వలేని వారే గుండెలు బాదుకుంటూ నిందలు వేస్తున్నారు అని అంటున్నారు.

మరి గతంలోకి వెళ్తే అపుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే ఆయన ఆ ప్రభుత్వం మీద ఘాటుగానే విమర్శలు చేశారు బాబోయ్ విశాఖ అని తెగ కలవరపడిపోతూ ఈ రొజు పెద్దగా నోళ్ళు లేస్తున్నాయేమి. నాడు మీరు చేసిందేంటి. ఇపుడు ఎందుకు ఉత్తరాంధ్రా వాసులను తండ్రీ కొడుకులు కలసి భయపెడుతున్నారు. ఇలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు.

రంగా హంతకులకు టోటల్ వైజాగ్ ని కానుకగా రాసిచ్చింది ఎవరు అంటూ ఆయన సూటిగానే నిలదీస్తున్నారు. ఇక భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రకటనకు ముందే భూ దందాలను స్టార్ట్ చేసింది ఎవరు, వేల ఎకరాల భూములను అక్కడ అప్పనంగా కారు చౌకగా కొనిపించింది ఎవరు అని కూడా ఆయన బిగ్ క్వశ్చన్ వేశారు.

ఇక విశాఖలో గజం గజం కూడా చాప చుట్టేసిన నాటి భాగోతాలను కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. విశాఖ విషయంలో ఇపుడు గుండెలు బాదుకుంటున్నా చంద్రబాబు, లోకేష్ బాబులకు అమరావతి, భోగాపురం రియల్ దందా కధలు గుర్తుకు రావా అని ఎకసెక్కమాడారు. మొత్తానికి ఉత్తరాంధ్రా వణుకుతోంది అంటున్న టీడీపీ నేతలకే ఆయన గట్టిగా షాకిచ్చేశారు.