కొత్త ఏడాది వస్తూనే అప శకునం పలికిన విశాఖ అక్టోపస్?

ఆయన విశాఖ ఆక్టోపస్. ఆయనకు జరిగేది, జరగబోయేదీ అన్నీ ఇట్టే తెలిసిపోతూంటాయి. ఎక్కడో ఢిల్లీలో ఉన్న మోడీ సర్కార్  నుంచి ఏపీలోని జగన్ ప్రభుత్వం వరకూ అన్ని రహస్యాలు ఆయనకే తెలుస్తాయి.   Advertisement ఆయనను…

ఆయన విశాఖ ఆక్టోపస్. ఆయనకు జరిగేది, జరగబోయేదీ అన్నీ ఇట్టే తెలిసిపోతూంటాయి. ఎక్కడో ఢిల్లీలో ఉన్న మోడీ సర్కార్  నుంచి ఏపీలోని జగన్ ప్రభుత్వం వరకూ అన్ని రహస్యాలు ఆయనకే తెలుస్తాయి.  

ఆయనను టీడీపీ అనుకూల మీడియా మైక్ ఇచ్చి మాట్లాడిస్తే చాలు జగన్ జాతకం మొత్తం తన దగ్గరే ఉందన్నట్లుగా చాలానే చెబుతారు. చంద్రబాబు సహా తమ్ముళ్లంతా పరవశించిపోయే ముచ్చట్లు ఎన్నో చెబుతారు.

మాజీ ఎంపీ సబ్బం హరి తాజాగా టీడీపీ అనుకూల మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైసీపీ నేతలకు చిర్రెత్తించేలాగానే ఉన్నాయి మరి. ఈడీ కేసులు జగన్ కి పెను ముప్పుని తెస్తాయని, ఆయన జమిలి ఎన్నికల నాటికి సీఎం గా ఉంటారో ఉండరో అన్నట్లుగా హరి చేసిన కామెంట్స్ రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి.

ఇన్నాళ్ళూ సీబీఐ కేసుల్లో జగన్ అరెస్ట్ అవుతారని చెప్పిన జోస్యాలు పక్కన పెట్టి ఇపుడు ఈడీ కేసులే జగన్ కి ఇరకాటం అంటూ సబ్బం హరి మాట్లాడుతున్నారు. ఈడీ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని, అందువల్ల ఏ విధంగానూ ఎవరూ ప్రభావితం చేయలేరని కూడా అంటున్నారు. 

మొత్తానికి కొత్త ఏడాది వస్తూనే వైసీపీకి అప శకునం పలుకులతో మంటెక్కించిన సబ్బం హరి తానున్న పసుపు పార్టీకి మాత్రం ధీమా పెంచాలనుకుంటున్నారు. మరి విశాఖ ఆక్టోపస్ జోస్యాలు అంటే అవన్నీ గాలి మాటలేనని వైసీపీ నేతలు అంటున్నారు.

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ