ప్రియుడ్ని దూరం పెట్టిన జాన్వి కపూర్

అంబానీ పెళ్లికి, జాన్వి కపూర్ ప్రేమకు ముడిపెడుతూ బాలీవుడ్ లో పలు కథనాలొచ్చాయి. కొన్నాళ్లుగా శిఖర్ పహారియాతో క్లోజ్ గా ఉంటోంది జాన్వి. ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.…

అంబానీ పెళ్లికి, జాన్వి కపూర్ ప్రేమకు ముడిపెడుతూ బాలీవుడ్ లో పలు కథనాలొచ్చాయి. కొన్నాళ్లుగా శిఖర్ పహారియాతో క్లోజ్ గా ఉంటోంది జాన్వి. ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనేది బహిరంగ రహస్యం.

అయితే ఈ విషయాన్ని ఇద్దర్లో ఎవ్వరూ నిర్థారించలేదు. ఓ మంచి సందర్భం చూసి తన లవ్ మేటర్ ను బయటపెట్టాలని జాన్వి కపూర్ అనుకుంటున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. ఆ మంచి సందర్భం అనంత్ అంబానీ పెళ్లి అవుతుందని చాలా మంది ఊహించారు.

అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు శిఖర్ తో కలిసొచ్చి ఫొటోలకు పోజులిస్తుందని, అలా తమ ప్రేమ విషయాన్ని వీళ్లిద్దరూ గ్రాండ్ గా ఎనౌన్స్ చేస్తారని బాలీవుడ్ మీడియా భావించింది. ఆ మేరకు జాన్వి టీమ్ నుంచి కూడా లీకులొచ్చాయి.

అయితే జాన్వి కపూర్ మాత్రం సోలోగా ఎంట్రీ ఇచ్చింది. ఓవైపు కియరా, అలియా, కత్రినా లాంటి హీరోయిన్లు భర్తలతో కలిసి ఫొటోలకు పోజులిస్తే.. జాన్వి కపూర్ మాత్రం సింగిల్ గా మెరిసింది. సో.. ఇప్పట్లో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టే ఉద్దేశం జాన్వి కపూర్ కు లేనట్టుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ కొలిక్కి వచ్చిన వెంటనే రామ్ చరణ్ సరసన నటించనుంది.

Click Here More Pics