Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్ మనసుపడ్డ సినిమా సాయి ధరమ్ చేతుల్లోకి..!

చరణ్ మనసుపడ్డ సినిమా సాయి ధరమ్ చేతుల్లోకి..!

'మిస్టర్ మిసెస్ రామాచారి' అనే కన్నడ సినిమా తనకు బాగా నచ్చిందని.. దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కూడా ఆసక్తి ఉందని కొంతకాలం కిందట ప్రకటించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ. 'బ్రూస్ లీ' సినిమాకు ముందే ఈ విషయాన్ని ప్రకటించాడు చెర్రీ. అయితే ఇకపై రీమేక్ లు చేయకూడదని అనుకుంటున్నానని.. అందుకే ఆ సినిమా  నచ్చినా దాన్ని రీమేక్ చేయడంలేదని చెర్రీ చెప్పుకొచ్చాడు. అప్పట్లో 'జంజీర్' సినిమాతో చేదు అనుభవం మిగలడంతో చెర్రీ ఆ ప్రకటన చేశాడు.

జంజీర్ చేదు అనుభవం తనను మళ్లీ రీమేక్ లు చేయాలనే ఆసక్తిని చంపేసిందని అప్పట్లో చెర్రీ చెప్పాడు. దీంతో నే రామాచారి సినిమాను రీమేక్ చేయబోవడంలేదని.. తన రీమేక్ ఫోబియాను బయటపెట్టుకున్నాడు రామ్ చరణ్. అయితే ఇప్పుడు చెర్రీకి ఆ ఫోబియా పోయింది. తనీ ఒరువన్ రీమేక్ కు సై అనడం ద్వారా తన పాత లెక్కలను చెర్రీ పక్కన పెట్టినట్టు అయ్యింది. తను మళ్లీ రీమేక్ లు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయ్యింది.

కానీ ఇప్పుడు చెర్రీకి రామాచారి సబ్జెక్ట్ మాత్రం అందుబాటులో లేదు. ఆ సినిమాను సాయి ధరమ్ తేజ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాన్ని రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట ఈ కుర్ర హీరో. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే చరణ్ మనసు పారవేసుకున్న సినిమాను రీమేక్ చేస్తుండటం విశేషమే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?