Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎవరూ దొరక్క ఇలా కానిచ్చేస్తున్నాడట!

ఎవరూ దొరక్క ఇలా కానిచ్చేస్తున్నాడట!

పైకి చెప్పకపోయినా ఖైదీ నంబర్-150 తర్వాత చాలామంది హీరోల్ని ప్రయత్నించాడు దర్శకుడు వినాయక్. కాల్షీట్లు ఇస్తామంటే అవసరమైతే ఒక ఏడాది వెయిట్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. నిజానికి ఇలా వెయిట్ చేయడం వినాయక్ కు కొత్తేంకాదు. గతంలో కూడా ఇతడి కెరీర్ లో గ్యాప్స్ ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం గ్యాప్ తీసుకున్నా వినాయక్ తో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. అందుకే సాయిధరమ్ తేజతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ సీనియర్ దర్శకుడు.

నిజానికి సాయిధరమ్ తేజ్ పేరు కొన్ని నెలలుగా వినిపిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు వినాయక్. ఆ గ్యాప్ లో పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల కోసం ప్రయత్నించాడు. కానీ వాళ్లంతా ఇప్పటికే ఇతర కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయారు. మరో ఏడాది వెయిట్ చేసినా వాళ్లతో సినిమా చేయడం కష్టమే. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తేజూతో సినిమాకు కమిట్ అయ్యాడట వినాయక్.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కెరీర్ గాడితప్పింది. విన్నర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. రిలీజ్ కు రెడీ అయిన నక్షత్రం, సెట్స్ పై ఉన్న జవాన్ సినిమాలపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవ్. ఇలాంటి టైమ్ లో వినాయక్ తో మూవీ పడింది. దుర్గ అనే టైటిల్ తో ఆగస్ట్ 9న ఈ సినిమా ప్రారంభం కానుంది. తేజు సరసన లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?