Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

మహేష్ బ్యానర్ వెనుక..

మహేష్ బ్యానర్ వెనుక..

కొడుకు గౌతమ్ పేరిట ఓ ప్రొడక్షన్ హవుస్ ప్రారంభించాలని సూపర్ స్టార్ మహేష్ బాబు, ముఖ్యంగా ఆయన భార్య నమ్రత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి పద్మాలయా బ్యానర్ వుండనే వుంది వారికి. కానీ దాన్ని ఎవరూ వాడడం లేదు. ఇప్పుడు కొత్త బ్యానర్ పెట్టడం వెనుక నమ్రత ఆలోచన వేరుగా వున్నట్లు తెలుస్తోంది. 

మహేష్ బాబుకు ఓ మంచి అలవాటు వుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఏడాదికో, రెండేళ్లలో సోదరి మంజులకు, సోదరుడు రమేష్ బాబుకు తన డేట్లు కేటాయిస్తారు. ఏదైనా ప్రాజెక్టు వచ్చినపుడు, ఆ నిర్మాతలు, ఆ ఇద్దరి నుంచి వాటిని తీసుకుంటారు. అందుకు బదులుగా వారికి ఏ మేరకు ఇస్తారో వారికే తెలియాలి. కానీ సమర్పించు అన్న క్రెడిట్ లైన్ ఇస్తారు. 

ఎందుకంటే ఆ విధంగా వారికి ఇచ్చిన మొత్తాన్ని లెక్కల్లో సెట్ చేసుకుంటారు. ఇప్పుడు అదే తీరుగా కొడుకు గౌతమ్ కు కూడా ఏడాదికో, రెండేళ్లకో ఓ ఇన్ కమ్ సోర్స్ ఏర్పాటు చేయాలన్నది నమ్రత ఆలోచన అని తెలుస్తోంది. మహేష్ డిమాండ్ ను బట్టి, అవసరమైతే డేట్ లు తీసుకుని కనీసం రెండు కోట్లయినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ. అదీ కాక భవిష్యత్ లో తన సినిమా తాను తీసుకోవాల్సిన అవసరం వస్తే అప్పటి కప్పుడు బ్యానర్ పెడితే అంత బాగోదు. 

అందుకే ఓ బ్యానర్ అంటూ పెట్టి వుంచితే, ఎప్పుడైనా, ఎందుకైనా పనికి వస్తుంది. అయితే సినిమా నిర్మాణం ఇప్పుడు అంత బాగాలేదు. పైగా మహేష్ కు 15 నుంచి 18 కోట్ల పారితోషికం ఏడాది నుంచి రెండేళ్ల ముందే ఇచ్చి, సినిమా కోసం వేచి చూస్తున్న నిర్మాతలు ఎందరో వున్నారు. అందువల్ల ఇప్పుడు సినిమా నిర్మాణం చేపట్టాలి అని అనుకుంటే మాత్రం ఆ నిర్ణయం సరికాదనే చెప్పాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?