Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ వదిలేసింది గోపీచంద్ కు

రవితేజ వదిలేసింది గోపీచంద్ కు

మొత్తానికి ఆ కొత్త దర్శకుడి కోరిక నెరవేరింది. ఎన్నాళ్ల నుంచో ఒకే సబ్జెక్ట్ పట్టుకుని ఎలాగైనా పట్టాలు ఎక్కించాలని చూస్తున్నారు చక్రి అనే కొత్త డైరక్టర్. రవితేజతో ఆ సబ్జెక్ట్ వర్కవుట్ అవుతుందనుకున్నారు. రాబిన్ హుడ్ అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఏ నిర్మాత సెట్ కాలేదు. రవితేజ చేయాలనే అనుకున్నారు సిన్సియర్ గా. కానీ ఎందుకో డైరక్టర్ నో, కథనో నమ్మక దిల్ రాజు సైతం ఆ ప్రాజెక్టు వదిలేసి అనిల్ రావిపూడితో వెళ్లారు. 

ఆఖరికి ఇప్పుడు అదే కథ గోపీచంద్ దగ్గరకు చేరింది. గోపీచంద్ కు కూడా ప్రాజెక్టులు ఏవీ లేవు. కమర్షియల్ లైన్ బాగానే వుంది అని వెంటనే ఓకె అనేసినట్లు వినికిడి.   గతంలో రవితేజతో బెంగాల్ టైగర్ సినిమా నిర్మించిన రాధామోహన్ నిర్మాతగా ఓకె అయ్యారు.

చక్రి సన్నిహితులతో రాధామోహన్ కు కూడా కాస్త సన్నిహితం వుండడంతో మొత్తానికి ఈ ప్రాజెక్టు సాకారమైనట్లు తెలుస్తోంది. నిర్మాత రాధామోహన్ తన అనుభవంతో కాస్త మార్పులు చేర్పులు చేసారని, అలాగే రాబిన్ హుడ్ టైటిల్ బి సి సెంటర్లకు ఎక్కదు కనుక, మాంచి టైటిల్ కోసం చూస్తున్నారని తెలుస్తోంది.

మెహరీన్ కు చాన్స్

ఇటీవల చకచకా సినిమాలు చేస్తున్న మెహరీన్ ఈ ప్రాజెక్టుకు హీరోయిన్ గా ఎంపికయింది. నటన విషయంలో మెహరీన్ కు ఎవ్వరూ మార్కులు వేయకున్నా, గ్లామర్ విషయంలో ఫరవాలేదు అనిపించుకుంటూ వస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చాన్స్ పట్టేసింది. ఈ ఆదివారం (19న) రామానాయుడు స్టూడియోలో ఓపెనింగ్ చేసుకుంటుందీ సినిమా. నిర్మాత దిల్ రాజు, వివి వినాయక్, సురేందర్ రెడ్డి వంటి పెద్దలు ముఖ్య అతిధులుగా హాజరవుతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?