పాహిమాం లోకేశ్‌… శ‌ర‌ణు కోరిన ఎమ్మెల్యే!

ఇక‌పై ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌మ‌ని, ఎలాంటి వ్య‌తిరేక క‌థ‌నాలు రాకుండా చూసుకుంటాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో మొద‌టిసారి ఎన్నికైన ఎమ్మెల్యేపై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న భార్య‌, కుమారుడు కూడా విచ్చ‌లివిడిగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో స‌ద‌రు ఎమ్మెల్యేకు భ‌యం ప‌ట్టుకుంది. త‌న‌పై టీడీపీ పెద్ద‌లు గుర్రుగా ఉన్నార‌ని ఆ ఎమ్మెల్యేకు ఉప్పందింది.

ఈ నేప‌థ్యంలో త‌న‌ను కాపాడాలంటూ మంత్రి నారా లోకేశ్‌ను స‌ద‌రు మొద‌టి ద‌ఫా ఎమ్మెల్యే ఆశ్ర‌యించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

ఎన్నిక‌ల‌కు ముందు ఆ నాయ‌కుడిపై చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. తీరా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, కుటుంబ స‌మేతంగా దోపిడీకి పాల్ప‌డుతున్నార‌నే క‌థ‌నాలు అనుకూల ప‌త్రిక‌ల్లో రావ‌డం తెలిసిందే.

అవినీతి ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ పెద్ద‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. దోచుకునే పంథా మార‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెప్పాయి. దీంతో స‌ద‌రు ఎమ్మెల్యే యువ నాయ‌కుడితో పాటు చంద్ర‌బాబును కూడా ఆశ్ర‌యించిన‌ట్టు తెలిసింది.

ఇక‌పై ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌మ‌ని, ఎలాంటి వ్య‌తిరేక క‌థ‌నాలు రాకుండా చూసుకుంటాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా స‌ద‌రు స‌కుంబం స‌మేత ఎమ్మెల్యే దోపిడీపై టీడీపీ సీరియ‌స్‌గా వుండ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.

11 Replies to “పాహిమాం లోకేశ్‌… శ‌ర‌ణు కోరిన ఎమ్మెల్యే!”

  1. ఖర్మ…రాష్ట్రనికి నానిల బెడద తప్పెటట్లు లెదె

    అమ్మా doctor త్రిష రెడ్డి………. మీమామ నీ మొగుడు మీ అత్త బగొతం ఒ సారి చూడు

      1. మా అమ్మ సంగెతెమొ కాని ..ని..య..మ్మ…ను మాత్రం అందరు దెం..గారు.,రా లం…జా కొ..డ..కా

Comments are closed.