ఫస్ట్ టైం నాకోసం తిరుమల మెట్లు ఎక్కాను

ఓ బేబీ సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకుంది సమంత. కాలినడకన వెళ్లి మరీ దర్శనం చేసుకుంది. దీంతో సమంతకు కూడా రిలీజ్ కు ముందు తిరుమల వెళ్లే సెంటిమెంట్ పట్టుకుందని కథనాలు పుట్టుకొచ్చాయి.…

ఓ బేబీ సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకుంది సమంత. కాలినడకన వెళ్లి మరీ దర్శనం చేసుకుంది. దీంతో సమంతకు కూడా రిలీజ్ కు ముందు తిరుమల వెళ్లే సెంటిమెంట్ పట్టుకుందని కథనాలు పుట్టుకొచ్చాయి. దీనిపై సమంత రియాక్ట్ అయింది.

“నా ప్రతి సినిమాకు తిరుమల వెళ్లను. నిజానికి నా కోసం ఎప్పుడూ నేను తిరుమల వెళ్లలేదు. చైతన్య సినిమాల కోసం వెళ్లి మొక్కేదాన్ని. ఫస్ట్ టైం నా సినిమా కోసం ఈసారి తిరుమల వెళ్లాను. ఇకపై కూడా ఇలానే కొనసాగిస్తానని చెప్పలేను. ఏమో.. కుదిరితే వెళ్తాను, లేకపోతే లేదు.”

ఓ బేబీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సమంత, ఇలా తిరుమల వెళ్లడం అనేది తనకు సెంటిమెంట్ కాదని స్పష్టంచేసింది. కానీ నాగచైతన్య సినిమాల కోసం మాత్రం తప్పకుండా తిరుమల వెళ్తానని ప్రకటించింది. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. రావురమేష్ తో చేసిన ఓ సీన్ లో నటించడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందని ప్రకటించింది.

“సినిమాలో ఓ సీన్ ఉంది. అప్పుడే చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాను. నేను రావు రమేష్ కు తల్లిగా నటించాను. ఓ సీన్ లో రావు రమేష్ కు తల్లిగా నటించాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను. ఎంత ఎమోషనల్ సీన్ అయినా ముందుగా ప్రాక్టీస్ చేయను. సెట్స్ పైకి వెళ్తే అదే వచ్చేస్తుందనే ధైర్యం ఉండేది. ఈ సీన్ కు మాత్రం అందర్నీ ఇబ్బంది పెట్టేశాను. చాలా కష్టపడ్డాను. ఆ ఒక్క సీన్ కోసం దాదాపు రోజంతా పట్టింది.”

భవిష్యత్తులో యాక్టింగ్ కెరీర్ ను కొనసాగిస్తూనే నిర్మాతగా మారుతానంటోంది సమంత. అయితే మాస్ మసాలా సినిమాలు తీయనని, మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాల్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తానని తెలిపింది. ఎన్ని ట్రైచేసినా డైరక్షన్ మాత్రం ప్రయత్నించనని కరాఖండిగా చెప్పేసింది సమంత.

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?