Advertisement

Advertisement


Home > Articles - Chanakya

కేంద్రంపై తెరాస స్ట్రాటజీ ఏమిటో?

కేంద్రంపై తెరాస స్ట్రాటజీ ఏమిటో?

మోడీకి మేము మిత్రపక్షమూ కాదు, శతృపక్షమూ కాదు..తటస్థం అని ప్రకటించారు ఎంపీ కవిత. ఓ ఎంపీగా కన్నా, తెరాస అధినేత కెసిఆర్ కుమార్తెగానే చూడాలి ఆమె మాటలను. అప్పుడే మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. చిరకాలంగా మోడీ విషయంలో కాస్త తగ్గే వ్యవహరిస్తూ వస్తోంది తెరాస. ఆ మేరకే ఆచి తూచి మాట్లాడుతూ వస్తున్నారు ఆ పార్టీ నాయకులు. అయతే కేంద్రంతో, ముఖ్యంగా మోడీ లేదా భాజపాతో సఖ్యత కోసమే ప్రయత్నిస్తూ వస్తున్నారు కేసిఆర్. అందులో భాగంగానే భాజపా ప్రముఖులకు సన్మానాలు, వెంకయ్య నాయుడితో దోస్తీ, ఇలాంటివి కొనసాగాయి. ఆ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో చేరాలని తెరాస తహతహలాడుతోందని తరుచు వ్యాఖ్యలు వినిపించాయి. కూతురు కవిత కు పదవి కోసమే కేసిఆర్ ఈ దిశగా పావులు కదుపుతున్నారని కూడా వినిపించాయి. అక్కడికి కామా పడింది. 

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?