అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్న ఆర్యవైశ్య భవన్ లో నిన్న దిగిన మారుతిరావు, ఈరోజు ఉదయం…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్న ఆర్యవైశ్య భవన్ లో నిన్న దిగిన మారుతిరావు, ఈరోజు ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కూతురు అమృత ఓ దళిత కుర్రాడ్ని ప్రేమించిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు మిర్యాలగూడకు చెందిన మారుతిరావు. కొంతమందికి సుపారి ఇచ్చి ప్రణయ్ ను హత్య చేయించాడు. 2018లో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ హత్య కేసుకు సంబంధించి అరెస్టైన మారుతి రావు, తర్వాత బెయిల్ పై బయటకొచ్చాడు.

బయటకొచ్చిన తర్వాత కూడా కూతురు అమృతతో సంప్రదింపులు జరిపాడు. ప్రణయ్ హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి మొత్తం రాసిస్తానని, మధ్యవర్తుల ద్వారా కబురు పంపాడు. ఈమధ్య మారుతిరావు వేధింపులు మరిన్ని ఎక్కువ కావడంతో పోలీసులు అతడ్ని పీడీ యాక్ట్ కింద మరోసారి అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా బెయిల్ పై విడుదలయ్యాడు.

రీసెంట్ గా మారుతిరావు కు చెందిన ఓ ప్రదేశంలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై కూడా పోలీసులు అతడ్ని మరోసారి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కొన్ని పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి, ఖైరతాబాద్ లోని  ఆర్యవైశ్య భవన్ లో దిగిన మారుతిరావు.. అర్థరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.