అతడు, ఆమె, ప్రియుడు.. ఓ మర్డర్

హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో ఊహించని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షాకుల మీద షాకులు బయటపడుతున్నాయి. Advertisement అత్యంత కిరాతకంగా నవీన్ అనే విద్యార్థిని, హరిహరకృష్ణ హత్య చేసిన సంగతి…

హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో ఊహించని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షాకుల మీద షాకులు బయటపడుతున్నాయి.

అత్యంత కిరాతకంగా నవీన్ అనే విద్యార్థిని, హరిహరకృష్ణ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసులో అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ నిహారిక ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. అంతేకాదు, మరో వ్యక్తి ప్రమేయాన్ని కూడా పోలీసులు గుర్తించారు.

హత్య తర్వాత ఘటనా స్థలానికి నిహారిక

నవీన్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణకు, హత్య తర్వాత 1500 రూపాయలు ఆన్ లైన్లో ట్రాన్సఫర్ చేసింది నిహారిక. ఆ డబ్బులతో వరంగల్ మీదుగా వైజాగ్ వెళ్లాడు హరిహర. డబ్బులు అయిపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చాడు. మరోసారి నిహారికను కలిశాడు.

బైక్ పై నిహారికను ఘటనా స్థలానికి తీసుకెళ్లాడు హరిహరకృష్ణ. కాస్త దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని ఆమెకు చూపించాడు. అక్కడ కాసేపు గడిపి, ఆ తర్వాత ఇంటికెళ్లింది నిహారిక. అయితే హరిహరకృష్ణ, నిహారికతో పాటు.. అక్కడ మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతడి పేరు హసన్.

హత్య జరిగిన తర్వాత అంతా కలిసి హసన్ ఇంటికి వెళ్లారు. అతడి ఇంట్లోనే హరిహరకృష్ణ దుస్తులు మార్చుకున్నాడు. ఈ మొత్తం విషయాల్ని పోలీసులు కూపీలాగారు.

పట్టించిన వాట్సాప్ మెసేజ్

హత్య చేసిన తర్వాత అత్యంత పాశవికంగా నవీన్ శరీరభాగాల్ని ముక్కలు చేశాడు హరిహరకృష్ణ. పెదవులు, చేతి వేళ్లు నరకడంతో పాటు.. గుండెను కూడా చీల్చాడు. వాటన్నింటినీ ఫొటోలు తీసి నిహారికకు పంపించాడు. దానికి సమాధానంగా నిహారిక 'గుడ్ బాయ్' అంటూ మెసేజ్ చేసింది.

ఈ మెసేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిహారికను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వాట్సాప్ లో ఫొటోలు, మెసేజీల్ని డిలీట్ చేసినట్టు గుర్తించారు. అటు మరో వ్యక్తి హసన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజా అరెస్టులతో ఈ కేసు కొలిక్కివచ్చినట్టయింది.

నవీన్, హరిహరకృష్ణ, నిహారిక ఇంటర్మీడియట్ లో క్లాస్ మేట్స్. ఆ టైమ్ లో హరిహర, నిహారిక ప్రేమించుకున్నారు. విబేధాలు రావడంతో బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత నవీన్ కు దగ్గరైంది నిహారిక. ప్రేయసి దూరమౌతుందనే భయంతో, స్నేహితుడైన నవీన్ ను హత్య చేశాడు హరిహర కృష్ణ.