మరో ఆఫర్ తో అదరగొట్టిన జియో

బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పల పెడుతోంది జియో. ఇప్పటికే అతితక్కువ రీచార్జీలతో అత్యధిక ప్రయోజనాలు అందిస్తున్న జియో.. తాజాగా మరో ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు రీచార్జీలతోనే క్యాష్…

బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పల పెడుతోంది జియో. ఇప్పటికే అతితక్కువ రీచార్జీలతో అత్యధిక ప్రయోజనాలు అందిస్తున్న జియో.. తాజాగా మరో ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు రీచార్జీలతోనే క్యాష్ బ్యాక్ అందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు మొబైల్ కొనుగోళ్లకు కూడా ఈ ఆఫర్లు వర్తింపజేసింది.

ఇందులో భాగంగా 22 మొబైల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది జియో. ఒప్పందం ప్రకారం.. వినియోగదారు ఎవరైనా సదరు 22 కంపెనీలకు చెందిన ఏ మొబైల్ కొనుక్కున్నప్పటికీ.. అందులో జియో సిమ్ వేసుకుంటే 2200 రూపాయల్ని క్యాష్ బ్యాక్ గా అందిస్తోంది. ఇవి 44 క్యాష్ బ్యాక్ ఓచర్ల రూపంలో మైజియో యాప్ లోకి చేరుతాయి. రీచార్జ్ చేయించుకున్న ప్రతిసారి క్యాష్ బ్యాక్ వచ్చేలా ఈ ప్లాన్ రూపొందించారు.

ఈ ఆఫర్ లో రెండు మెలికలు పెట్టింది జియో. ఒకటి మార్చి 31లోపు మాత్రమే మొబైల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది రూ.198 లేదా రూ.299 రీచార్జ్ పై మాత్రమే క్యాష్ బ్యాక్ ఆఫర్ పెట్టింది. కానీ ఎలా చూసుకున్నా ఈ ఆఫర్ లాభసాటిదే. ఉదాహరణకు మీరు 299 రీచార్జే చేయించుకోవాలనుకుంటే.. మీరు రీచార్జ్ చేసుకున్న ప్రతిసారి 50రూపాయలు తగ్గుతుందన్నమాట. అలా 44 సార్లు మీరు రీచార్జ్ చేసుకోవచ్చు. 

ప్రస్తుతం ఈ ఆఫర్ కు సంబంధించి శాంసంగ్, షియామీ, నోకియా, మోటారోలా, బ్లాక్ బెర్రీ, ఆసెస్, పానసోనిక్, ఎల్జీ లాంటి 22 మొబైల్ కంపెనీలతో జియో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న డేటా ఆఫర్లు యథాతథంగా ఉంటాయని కూడా ప్రకటించింది.