“నిర్భయ” నిందితుడికి సెక్యూరిటీ కావాల‌ట‌…

దేశ చ‌రిత్రలోనే అత్యంత దారుణ‌మైన అత్యాచారంగా భార‌తీయులంద‌రికీ గుర్తుండిపోయే… ఢిల్లీ నిర్భయ కేసులో  ప్రస్తుతం జైల్లో ఉన్న రేపిస్ట్‌కి భ‌ధ్రత కావాల‌ట‌. ఈ మేర‌కు అత‌ను ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న…

దేశ చ‌రిత్రలోనే అత్యంత దారుణ‌మైన అత్యాచారంగా భార‌తీయులంద‌రికీ గుర్తుండిపోయే… ఢిల్లీ నిర్భయ కేసులో  ప్రస్తుతం జైల్లో ఉన్న రేపిస్ట్‌కి భ‌ధ్రత కావాల‌ట‌. ఈ మేర‌కు అత‌ను ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విన‌య్ శ‌ర్మ… త‌న‌కు కారాగారంలో ర‌క్షణ క‌ర‌వైంద‌ని వాపోతున్నాడు. తోటి ఖైదీలు త‌న‌తో అకార‌ణంగా గొడ‌వ‌కు దిగుతున్నార‌ని, కొడుతున్నార‌ని ఆరోపిస్తున్నాడు. 

తాజాగా తోటి ఖైదీలు కొట్టిన కార‌ణంగా త‌న ఎడ‌మ చేయి, కాలు ఫ్రాక్చర్ అయ్యాయ‌ని చెప్పాడు. గ‌త ఆగ‌స్టు 15న ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌న్నాడు. ఈ ప‌రిస్థితిలో త‌న‌కు ప్రాణ‌భ‌యం ఉంది కాబ‌ట్టి… త‌న‌కు జైలులో త‌గిన ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతున్నాడు. ఈ మేర‌కు విన‌య్ శ‌ర్మ ప‌టియాలా కోర్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. 

గ‌తంలో ఇదే కేసులో ప్రధాన ముద్దాయిగా తీహార్ జైలులో ఉన్న రామ్‌సింగ్ (35) ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడు. అయితే అత‌డిని కూడా తోటి ఖైదీలు గాయ‌ప‌రిచార‌ని, అత‌ని మృతికి కార‌కుల‌య్యార‌ని అత‌ని కుటుంబ స‌భ్యులు అప్పట్లో ఆరోపించారు. ఈ నేపద్యంలో విన‌య్ శ‌ర్మ విన‌తిపై కోర్టు ఎలా స్పందింస్తుందో వేచి చూడాలి.