పెళ్లయిన 3 వారాలకే అనుమానాస్పద మృతి

హైదరాబాద్ లో మరో విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన 3 వారాలకే ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈమె మృతికి భర్త కారణమా.. లేక ఇది పరువు హత్య అనేది తేలాల్సి ఉంది.…

హైదరాబాద్ లో మరో విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన 3 వారాలకే ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈమె మృతికి భర్త కారణమా.. లేక ఇది పరువు హత్య అనేది తేలాల్సి ఉంది.

సనత్ నగర్ లో నివసిస్తున్న పూర్ణిమ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. 20 రోజుల కిందట పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది. పూర్ణిమ తండ్రి ఓ పారిశ్రామికవేత్త. ఆయన కంపెనీలో పనిచేస్తున్న కార్తీక్ అనే యువకుడినే పూర్ణిమ ప్రేమించింది. తండ్రిని ఎదిరింది అతడ్ని పెళ్లి చేసుకుంది.

ఇదంతా జరిగిన 20 రోజులకే పూర్ణిమ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తమ కూతురు మృతికి, ఆమె భర్త్ కార్తీక్ కారణమని ఆరోపిస్తున్నారు పూర్ణిమ తల్లిదండ్రులు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట వాళ్లు ఆందోళన చేపట్టారు.

మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న పూర్ణిమను 20 రోజులకే కార్తీక్ ఎందుకు చంపుతాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పైగా వాళ్లిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారని ఇరుగుపొరుగు వాళ్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణిమ మృతి మిస్టరీగా మారింది.