ఎమ్బీయస్‍: క్రీస్తు విచారణ

ఎక్కడైనా జీసస్ ప్రజల పాపక్షాళనకై తను బలిదానం చేసుకుంటున్నట్లు క్లెయిమ్ చేసినట్లు రాశారా?

ఏసు క్రీస్తు మన పాపాలకై శిలువ ఎక్కాడనే ప్రబోధాన్ని ప్రశ్నిస్తూ ‘‘ఎమ్బీయస్‍: క్రీస్తు శిలువ ఎక్కాడా? ఎక్కించారా?’’ అనే వ్యాసాన్ని రాశాను. బైబిల్‌లో వున్న దాని ప్రకారం క్రీస్తు తాను మెస్సయ్యనని చెప్పుకోవడంతో యూదు పూజారులు ఫిర్యాదు చేయడంతో ఆయన్ని విచారణ చేసి, శిలువ శిక్ష విధించారు. ఈ ఫిర్యాదు పూర్వాపరాలు తెలియాలంటే కాస్త నేపథ్యం తెలియాలి. జూడాయిజం (యూదు మతం), క్రైస్తవం, ఇస్లాం – మూడిటికి మూలం ఓల్డ్ టెస్ట్‌మంట్ (పాత నిబంధన గ్రంథం – యికపై దీన్ని హీబ్రూ బైబిల్ అంటాను). దానిలో మెస్సయ్య (ఉద్ధారకుడు, అభిషిక్తుడు, క్రీస్తు) భవిష్యత్తులో ఉద్భవించబోతాడని రాసి వుంది. కొంతకాలానికి జీసస్ (నాజరత్ వాసి, జోసెఫ్ కుమారుడు) పుట్టి ఆ మెస్సయ్యను, ఆ క్రీస్తుని నేనే అని చెప్పుకున్నాడు. కొందరు దాన్ని నమ్మారు. దాంతో అప్పటి యూదులు భగ్గుమన్నారు. ఇది మతానికి అపచారం, దైవద్రోహం అన్నారు.

మనకు అర్థం కావాలంటే విష్ణువు అవతారాల్లో కల్కి అవతారం యింకా రాలేదని మనం నమ్ముతున్నాం. కానీ ఒకాయన తనే కల్కినని అని చెప్పుకుని తిరుగుతున్నాడు. అసలు పేరు వదిలేసి కల్కి భగవాన్ అని పెట్టుకున్నాడు. నమ్మేవాళ్లు నమ్ముతున్నారు. ఆయన్ని పూజిస్తున్నారు. నమ్మనివాళ్లు ఆయన జోలికి పోవటం లేదు. పుట్టపర్తి సత్యసాయిబాబా, అసలు పేరు వదిలేసి, తను షిర్ది సాయిబాబా తర్వాతి అవతారాన్నని చెప్పుకున్నారు. నమ్మినవాళ్లు నమ్మి భక్తులయ్యారు, నమ్మనివాళ్లు నమ్మలేదు. ఇది ఆధునిక యుగం కాబట్టి నమ్మనివాళ్లు మన కెందుకులే అని ఊరుకుంటున్నారు. 2వేల ఏళ్ల క్రితం నాటి అంధయుగంలో మతమౌఢ్యం ఎక్కువ కాబట్టి, యిలా క్లెయిమ్ చేయడం దైవదూషణ క్రింద వస్తుందని అప్పటి యూదు పూజారులు గొడవ చేసి దైవపుత్రుడినని, ఉద్ధారకుణ్నని, క్రీస్తునని చెప్పుకున్న జీసస్‌కు శిక్ష పడేట్లు చేశారు.

చరిత్ర ప్రకారం దాని తర్వాత కంటికి కనబడే అద్భుతాలేమీ జరిగిపోలేదు, విప్లవాలు రాలేదు. కానీ జీసస్ శిష్యులు అతని బోధనలను వ్యాప్తి చేస్తూ, అతని జీవితాన్ని కథలు కథలుగా చెప్తూ అతని మరణం తర్వాత పునరుత్థానం చెందాడని, అద్భుతాలను ప్రదర్శించాడని ప్రచారం చేస్తూ పుస్తకాలు రాశారు, దూరప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజల్లో విశ్వాసం కలిగించారు. క్రమేపీ క్రైస్తవం వ్యాప్తి చెందింది. హీబ్రూ బైబిల్ లోని దేవుళ్ల కంటె జీసస్‌కే ఎక్కువ ప్రాచుర్యం కలిగింది. అతనే దైవపుత్రుడు, క్రీస్తు అంటూనే దాదాపు దేవుడి స్థాయిని అందుకున్నాడు. అతని శిక్షాచిహ్నమైన శిలువ పవిత్ర చిహ్నంగా, పాపాలను హరించే సాధనంగా గుర్తింపబడింది. క్రమేపీ యూదుమతం వెనకబడింది. ప్రపంచ జనాభాలో యీనాడు క్రైస్తవం 31%, ఇస్లాం 24%, హిందూమతం 15%, బౌద్ధం 7% కాగా యూదులు 0.2% మాత్రమే. నేను క్రీస్తు అని రాస్తున్నా, క్రైస్తవం ప్రకారమే అతను క్రీస్తు, యూదుల ప్రకారం అతను జీసస్ మాత్రమే.

అయితే క్రైస్తవం ఓ పట్టాన వ్యాపించలేదు. దానికి కొన్ని శతాబ్దాలు పట్టాయి. దాన్ని అణచడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ జీసస్ శిష్యప్రశిష్యుల కారణంగా, వారి రాతల కారణంగా జనాలు మతాన్ని ఆమోదించి, అనుసరించారు. వారు కోయినే గ్రీక్ భాషలో రాసిన 27 పుస్తకాలు (260 అధ్యాయాలు, 7957 సూక్తులు) తోనే న్యూ టెస్ట్‌మెంట్ (కొత్త నిబంధన గ్రంథం, క్రైస్తవ బైబిల్ అంటున్నాను. క్రైస్తవులు హీబ్రూ బైబిల్‌తో పాటు దీన్నీ అనుసరిస్తారు. హీబ్రూలు అంటే యూదులు దీన్ని తిరస్కరిస్తారు) ఏర్పడింది. అ పుస్తకాలు రచయితల పేర వెలువడ్డాయి. చర్చి గోడలపై కానీ, కొటేషన్స్‌లో కానీ ఏదైనా సూక్తి వుండి క్రింద మాత్యూ 12:24 అని వుందనుకోండి. మాత్యూ అనే ఆయన రాసిన పుస్తకంలో అధ్యాయం సంఖ్య12, సూక్తి సంఖ్య 24 అన్నమాట. బైబిల్ న్యూ టెస్ట్‌మెంట్ భాగాన్ని 7 నుంచి 16 మంది వరకు రాశారని చెప్తారు. ఈ రచయితల్లో తరచుగా వినబడే పేర్లు – మాత్యూ (ఇంగ్లీషు పేర్లే వాడుతున్నాను), మార్క్, లూక్, జాన్, జేమ్స్, పీటర్, జూడ్.

వీటిలో చాలా భాగం క్రీస్తు మరణించిన 50 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు రాయబడ్డాయి. కానీ క్రీ.శ. 3 వ శతాబ్దం వరకూ కొత్తవి చేరుస్తూ పోయారు. వీటిల్లో నలుగురు (మాత్యూ, మార్క్, లూక్, జాన్) రాసిన నాలుగు గాస్పెల్స్ (తెలుగులో సువార్తలు) క్రీస్తు జీవితం, మరణం, పునరుత్థానం గురించి చెప్పాయి. దీనివలన కొంత పునరుక్తి కనబడుతుంది. కానీ వీటిలో స్వల్పభేదాలు కూడా వున్నాయి. నేనిక్కడ క్రీస్తు జననం గురించి, 33 ఏళ్ల జీవితం గురించి రాయటం లేదు. చరమఘట్టమైన విచారణ గురించే చెప్తాను. పునరుత్థానం గురించి కూడా చెప్పటం లేదు. ఎందుకంటే క్రీస్తు ‘ప్రపంచ ప్రజల పాపక్షాళనకై నన్ను నేను బలి యిచ్చుకుంటున్నాను’ అని ప్రకటించి బలిపీఠం ఎక్కినట్లు శిలువ ఎక్కాడా? లేక అతని ప్రమేయం లేకుండానే శిలువ ఎక్కవలసి వచ్చిందా? అన్నదే ప్రస్తుతం చర్చిస్తున్నాం.

ఒక రాత్రి వేళ రోమన్ సైనికులు జీసస్‌ను బందీగా పట్టుకుని కైయాఫాస్ అనే యూదు ప్రధాన పూజారి వద్దకు తీసుకుని పోయారు. అతను విచారణ ప్రారంభించాడు. ముందుగా ఏర్పాటు చేసిన దొంగ సాక్షులిద్దరు ముందుకు వచ్చారు. ‘‘దేవుడి ఆలయాన్ని కూల్చివేసి, మూడు రోజుల్లో తిరిగి కట్టగలనని యితడు అన్నాడు.’’ అని చెప్పారు. ‘‘నిజమేనా?’’ అని పూజారి అడిగిన దానికి జవాబుగా జీసస్ మౌనంగా వున్నాడు. అప్పుడు పూజారి ‘‘నిన్ను దేవుడి పేరు మీద అడుగుతున్నాను. నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?’’ అని అడిగాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన దేమిటంటే హీబ్రూ బైబిల్‌లో రాబోయే క్రీస్తు ఫలానా విధంగా వుంటాడు, అతని జీవితం ఫలానా విధంగా నడుస్తుంది అని రాసి వుంది. నా జీవితం అలాగే గడిచింది, అందుకే నేను క్రీస్తుని అంటాడు జీసస్. అబ్బే, అదంతా నువ్వు కిట్టించినది అన్నారు యూదు పూజారులు.

కృష్ణుడు వుండే కాలంలో పౌండ్రక వాసుదేవుడని ఉండేవాడు. కృష్ణుడి లాగానే వేషం వేసుకుని నేను అసలైన వాసుదేవుణ్ని అని చెప్పుకునే వాడు. కృష్ణుడే అతని వద్దకు వెళ్లి సంహరించాడు. ఇప్పుడీ జీసస్ పౌండ్రక వాసుదేవుడి లాటి వాడని యూదుల భావన. వారి ప్రకారం క్రీస్తు యింకా రాలేదు. జీసస్ తనే క్రీస్తునని చెప్పుకుంటున్నాడని తెలియడంతో కైయాఫాస్ ఆ ప్రశ్న వేశాడు. వెంటనే జీసస్ ‘‘ఆ మాట మీరే చెప్పారు. ఇకపై మీరు దేవకుమారుణ్ని దేవుడి పక్కన కుడి చేతివైపు ఆసీనుడై, స్వర్గలోకపు మేఘాలపై రావడం చూడబోతారు.’’ అన్నాడు, ఆ దేవకుమారుడు తనే అనే అర్థంలో! అది వినగానే ప్రధాన పూజారి ‘‘వేరే సాక్ష్యం ఎందుకు? అతను దైవనింద (బ్లాస్‌ఫెమీ) చేశాడు. మీ అందరూ విన్నారు. ఏమిటి మీ తీర్పు?’’ అన్నాడు. చుట్టూ వున్న పూజారులు, ఊరి పెద్దలు ‘‘మరణశిక్షే’’ అన్నారు. జీసస్‌ను చెంపదెబ్బలు కొట్టారు. ముఖాన్న ఉమ్మి వేశారు.

తెల్లవారగానే వీళ్లందరూ జీసస్‌ను కట్టివేసి పైలేట్ అనే గవర్నరు వద్దకు తీసుకుపోయారు. అప్పట్లో రోమన్ చక్రవర్తిగా వున్న టైబేరియస్ పాలనలో జుడియా ప్రాంతానికి పైలేట్ గవర్నరుగా వున్నాడు. పైలేట్ కూడా జీసస్‌ని ‘‘నువ్వు యూదులకు రాజువా?’’ అని అడిగాడు. ‘‘మీరే అన్నారు.’’ అన్నాడు జీసస్. పూజారులందరూ ఆరోపణలు చేసినా జీసస్ కిమ్మనకపోవడం చూసి పైలేట్‌కు ఆశ్చర్యం వేసింది. ఈ వ్యక్తి పూజార్ల అసూయకు గురైన అమాయకుడేమో వదిలేద్దామా అనే ఆలోచన వచ్చింది. అవి పండగ రోజులు కాబట్టి ప్రజలు కోరిన ఒక నేరస్తుణ్ని క్షమించి విడిచిపుచ్చే ఆచారాన్ని అనుసరించి ‘‘ఎవర్ని వదిలేయమంటారు? క్రీస్తునని చెప్పుకునే జీసస్‌నా? లేక బరబ్బాస్‌నా?’’ అని జనసమూహాన్ని అడిగాడు. పూజారుల సలహా మేరకు ప్రజలు కరడుగట్టిన నేరస్తుడైన బరబ్బాస్‌ని విడిచిపెట్టి జీసస్‌ని శిలువ వేయమని కోరారు.

‘‘అతను చేసిన నేరమేమిటి?’’ అని పైలేట్ అడగ్గా ప్రజలు సింపుల్‌గా ‘‘శిలువ వేయండి.’’ అని అరిచారు. ప్రజల మూడ్‌ను గమనించిన పైలేట్ నీళ్లు తెప్పించి ‘‘ఈ రక్తపాతంతో నాకు సంబంధం లేదు.’’ అంటూ చేతులు కడుక్కున్నాడు. ‘‘ఆ పాపం మాపై, మా సంతానంపై పడుగాక’’ అని ప్రజలు అరిచారు. పైలేట్ జీసస్‌ని కొరడాలతో కొట్టించి, శిలువ వేయడానికి సైనికులకు అప్పగించాడు. ఇది మేత్యూ రాసినది. మార్క్ రాసిన పుస్తకంలో కూడా యిలాగే వుంది. లూక్ రాసిన పుస్తకంలో పూజారులు పైలేట్ దగ్గర చేసిన ఆరోపణల్లో ‘‘ఇతను తనే రాజునని చెప్పుకూంటూ, రోమన్ చక్రవర్తికి పన్నులు చెల్లించవద్దని చెప్తున్నాడు. ప్రజలను దారి మళ్లిస్తున్నాడు.’’ అని కూడా చేర్చారు. ‘‘ఇతను చేస్తున్న దానిలో నాకేమీ నేరం కనబడటం లేదే’’ అని పైలేట్ అంటే వాళ్లు ‘‘దేశంలో గేలలీ ప్రాంతం నుంచి జుడియా వరకు పలు ప్రాంతాల్లో యితను తిరుగుబాటు భావాలు రేకెత్తిస్తున్నాడు.’’ అన్నాడు.

అది వినగానే పైలేట్ ‘ఓహ్, యితను గేలలీ ప్రాంతం వాడా? (నాజరెత్ ఆ ప్రాంతంలోనే వుంది) అలా అయితే ఆ ప్రాంతపు గవర్నరు హేరద్ వద్దకు పంపిస్తాను.’ అంటూ అప్పుడు జెరూసలెంకు వచ్చి వున్న అతని వద్దకు పంపాడు. హేరద్‌కు చాలాకాలంగా జీసస్‌ని కలవాలని వుంది. అందుకని అతన్ని చాలా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాలని చూశాడు. కానీ జీసస్ దేనికీ బదులు చెప్పలేదు. హేరద్ సైనికులు జీసస్‌ని వెక్కిరించసాగారు. దాంతో అతను పైలేట్ వద్దకు తిప్పి పంపేశాడు. పైలేట్ పూజారులతో ‘‘మరణశిక్ష విధించాల్సినంత నేరస్తుడిగా నాకు తోచడం లేదు. మందలించి పంపేస్తా.’’ అంటూ ప్రజలకు ఛాయిస్ యిస్తే వాళ్లు బరబ్బాస్‌ను వదిలేయమన్నారు. జాన్ రాసిన పుస్తకంలో మరింత విపులంగా వుంది. యూదు ప్రధాన పూజారి ‘‘నువ్వు చేసిన ప్రబోధాలేమిటి?’’ అని అడిగినప్పుడు జీసస్ ‘‘నేను యూదు ప్రార్థనాలయాలైన సినగాగ్‌లలో, గుళ్లలో యూదులందరి ముందు మాట్లాడాను. ఏదీ రహస్యంగా మాట్లాడలేదు. ఆ శ్రోతలనే అడగండి.’’ అన్నాడు.

పైలేట్ వద్దకు తీసుకెళ్లినపుడు అతను ప్రధాన పూజారితో ‘‘మీ మతాన్ని అవమానపరిచాడు కాబట్టి మీ మతచట్టాల ప్రకారం మీరే శిక్షించుకోండి.’’ అన్నాడు. ‘‘అతనికి మరణశిక్ష వేసే అధికారం చట్టం మాకివ్వలేదు.’’ అన్నాడు పూజారి. దాంతో పైలేట్ విచారణ మొదలుపెట్టి ‘‘నువ్వు యూదులకు రాజువా?’’ అని అడిగినప్పుడు జీసస్ ‘‘నా రాజ్యం యీ ప్రపంచానికి చెందినదైతే నాకు సైనికులుండేవారు, యీ పూజారులతో పోట్లాడేవారు. నా రాజ్యం పరలోకానికి చెందినది.’’ అన్నాడు. పైలేట్ పూజారులతో ‘‘ఇతను నేరస్తుడని తోస్తే, మీరే యితన్ని శిలువ వేసుకోండి. నాకైతే నేరమేమీ కనబడటం లేదు.’’ అన్నాడు. ‘‘అతను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కాబట్టి మా నియమాల ప్రకారం అతనికి మరణశిక్ష పడాలి. కానీ దాన్ని అమలు చేసే అధికారం మీకే వుంది.’’ అన్నారు వాళ్లు. ‘‘నీ స్వస్థలమేది?’’ అని పైలేట్ అడిగిన ప్రశ్నకు జీసస్ సమాధానం యివ్వలేదు.

దాంతో అతనికి కోపం వచ్చి ‘‘నాతో మాట్లాడవా? నిన్ను శిక్షించడానికైనా, రక్షించడానికైనా నాకు అధికారం వుందని ఎఱగవా?’’ అన్నాడు. జీసస్ ‘‘పైవాడు యిస్తే తప్ప నన్ను శిక్షించే అధికారం నీకు లేదు. నన్ను పట్టిచ్చిన వారే ఎక్కువ పాపాత్ములు.’’ అన్నాడు. ఇది విన్నాక పైలేట్ అతన్ని వదిలేద్దా మనుకున్నాడు. కానీ యూదులు ‘‘తనని తాను రాజుగా చెప్పుకున్న ప్రతీవాడు చక్రవర్తికి విరోధే. నువ్వు యితన్ని వదిలేస్తే చక్రవర్తికి ద్రోహం చేసినట్లే.’’ అన్నారు. ‘‘మరి మీ రాజుని శిలువ వేయమంటారా?’’ అన్నాడు పైలేట్ యూదులతో. ‘‘మాకు టైబేరియస్ తప్ప వేరే పాలకుడు లేడు.’’ అన్నారు వాళ్లు. దాంతో అతను శిలువ వేయడానికి అప్పగించేశాడు. నలుగురు రాసిన పుస్తకాల్లో వున్న పాఠభేదాలతో సహా బైబిల్‌లో వున్నదంతా వివరించాను.

వీటిలో ఎక్కడైనా జీసస్ ప్రజల పాపక్షాళనకై తను బలిదానం చేసుకుంటున్నట్లు క్లెయిమ్ చేసినట్లు రాశారా? నేను దేవుని కుమారుణ్ని, యూదులకు రాజుని (ఆధ్యాత్మికంగానే అనుకోవాలి) అని నమ్ముకుని అదే మాట అందరి ఎదుట ధైర్యంగా చెప్పాడు. దానికి శిక్ష వేస్తే అనుభవించాడు. శిలువపై వుండగా మాట్లాడిన మాటలు గత వ్యాసంలోనే రాశాను. లూక్ రాసిన పుస్తకంలో క్రీస్తు శిలువ వేసే స్థలానికి వెళుతూండగా అనేక మంది మహిళలు విలపించారని ఉంది. అప్పుడు క్రీస్తు ‘‘నా కోసం కాదు, మీ కోసం, మీ సంతానం కోసం ఏడవండి. పిల్లలు లేనివారు అదృష్టవంతులనుకునే కష్టదినాలు వస్తున్నాయి. అప్పుడు పర్వతాలు మీద పడితే బాగుండునని మీరనుకుంటారు.’’ అని అన్నాడు. ఇలాటి మాటలు చెప్పాడు తప్ప, ‘మీ పాపాల కోసమేనర్రా నేను శిలువ నెక్కుతున్నది, దానికై సంతోషించండి.’ అని అనలేదు.

మరి మన పాపాలకై జీసస్ శిలువ నెక్కాడన్న మాట ఎక్కణ్నుంచి వచ్చింది? క్రైస్తవ ప్రచారం ఊపందుకున్న రోజుల్లో సుమారు 150 ఏళ్లల్లో చేర్చిన పుస్తకాల్లో జీసస్ యిమేజి పెంచడానికి యీ పాయింటు చేర్చారని అనుకోవాలి. పాపాల కోసం బలిదానం చేయడం వలన క్రీస్తు దేవుడి సరసన ఆసీనుడయ్యాడని రాశారు. పాపాల ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే, కడరాత్రి భోజనం (లాస్ట్ సప్పర్) టైములో జీసస్ రొట్టె విరిచి యిస్తూ ‘‘ఇది నా శరీరం, తీసుకుని తినండి.’’ అన్నాడు. ఒక మద్యపాత్ర తీసుకుని ‘‘ఇది అనేక మంది పాపప్రక్షాళనకై దేవునితో చేసుకున్న ఒప్పందం ప్రకారం చిందిస్తున్న నా రక్తం.’’ అన్నాడు. (“This is my body, which is given for you. This is my blood of the covenant, which is poured out for many for the forgiveness of sins”) అన్నాడు. ఒక గదిలో పన్నెండు మంది శిష్యుల ఎదుట చెప్పిన యీ ముక్క జీసస్ బహిరంగంగా తన విచారణ సందర్భంగా కానీ, వధ్యస్థలానికి వెళ్లే దారిలో కానీ, శిలువ ఎక్కిన తర్వాత కానీ చెప్పకపోవడం ఆశ్చర్యంగా లేదూ!?

ఇది అప్పటి వరకు వున్న పాపుల గురించా, రాబోయే పాపుల గురించా? పాపప్రక్షాళనకు, శిలువ శిక్ష పొందడానికి గల సంబంధమేమిటి? అనే సందేహాలను తొలి వ్యాసంలోనే వ్యక్తపరిచాను. చేసిన పాపాలను ఒప్పుకుంటే యిప్పటి తరం వారి పాపాలు కూడా ప్రక్షాళన అవుతాయని ఓ పాఠకుడు రాశారు. ఆ విషయాలు బైబిల్‌లో వున్నాయా? అని అడిగితే అన్నీ పుస్తకాల్లో వుండవు. దాన్ని యింటర్‌ప్రెట్ చేసేవాళ్ల దగ్గరకి అడగాలి అని కొందరు పాఠకులు అన్నారు. ఇంటర్‌ప్రెటేషన్‌ కేముంది? రావణుడు రాముడి చేతిలో తన ముక్తి కోసమే సీతను ఎత్తుకు వచ్చాడని కొందరు చెప్తారు. ఆ సంగతి వాల్మీకి రాయలేదు. సీతను పెళ్లాడమని బలవంత పెట్టాడని, చేసుకోకపోతే చంపేస్తాననీ బెదిరించాడని రాశాడు. అందువలన వ్యాఖ్యానాల జోలికి వెళ్లకుండా బైబిల్‌లో వున్నదాని ఆధారంగానే యీ వ్యాసం రాశాను. దీనిలో పొరపాట్లు వుంటే చెప్పగోర్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2025)

mbsprasad@gmail.com

62 Replies to “ఎమ్బీయస్‍: క్రీస్తు విచారణ”

  1. ప్లే బాయ్ వర్క్ వుంది నెంబర్ gulte కామెంట్ లో వుంది చూసి కాల్ మీ

  2. If you say I am writing  only based on bible.. we must belive all the miracles Jesus had performed. If Jesus has performed so many healings with what power he could do it ? 

    so if it’s only based on bible shall we conclude he did miracles because of Godly powers?

    1. I am not contesting any miracles of Jesus Christ. I am discussing only the purpose of crucifixion. 

      All the holy books talk of miracles and it is up to the individual to believe them or not. Even Saibaba, and Satyasai who lived among us in recent times were supposed to have performed miracles.  

      1. వాళ్ళు zihadee magicians namminodu zeddi వెధవ…కలియుగ జీవం లో దైవం ఉండదు…last god is గోవింద అంతే 

      2. మత్తయి 13:10-17

        • శిష్యులు యేసును ఎందుకు ఉపమానాల్లో మాట్లాడతారో అడిగారు. యేసు జవాబుగా, “స్వర్గ రాజ్య రహస్యాలు” వారికి (శిష్యులకు) అనుగ్రహించబడ్డాయి, కానీ ఇతరులకు కావు అని చెప్పారు. (యెషయా 6:9-10ను ఉదహరించి) అవిశ్వాసులు విన్నప్పటికీ అర్థం చేసుకోరు, చూసినప్పటికీ గ్రహించరు, ఎందుకంటే వారి హృదయాలు కఠినమైనవి అని వివరించారు.

        2. మార్కు 4:11-12

        • యేసు శిష్యులతో, “మీకు దేవుని రాజ్య రహస్యం అనుగ్రహింపబడింది, కానీ బయటి వారికి అన్నీ ఉపమానాల రూపంలో ఇవ్వబడతాయి” అని చెప్పారు. ఇది ఆయనను అనుసరించేవారు మరియు ఆయన సందేశాన్ని తిరస్కరించేవారి మధ్య తేడాను చూపిస్తుంది.

        3. యోహాను 14:15-17, 26

        • యేసు శిష్యులకు పరిశుద్ధ ఆత్మను (“సహాయకుడు” లేదా “సత్యాత్మ”) ఇస్తానని వాగ్దానం చేశారు, ఆయన వారికి సత్యాన్ని బోధిస్తాడు. కానీ ఈ లోకం (అవిశ్వాసులు) ఆయనను అంగీకరించదు, ఎందుకంటే వారు ఆయనను చూడరు లేదా గుర్తించరు.

        4. 1 కొరింథీయులు 2:14

        • పౌలు వ్రాస్తూ, “జాతి మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు, ఎందుకంటే అవి అతనికి మూర్ఖత్వంగా కనిపిస్తాయి. అతను వాటిని అర్థం చేసుకోలేడు, ఎందుకంటే అవి ఆత్మికంగా గ్రహించదగినవి” అని చెప్పారు. ఇది ఆధ్యాత్మిక సత్యం విశ్వాసం ద్వారా మాత్రమే బహిర్గతమవుతుందని తెలియజేస్తుంది.

        వివరణ:

        యేసు బోధలు దైవిక జ్ఞానం విశ్వాసులకు, దేవుని కృపకు లొంగి ఉండేవారికి మాత్రమే బహిర్గతమవుతుందని చూపిస్తాయి. అవిశ్వాసులు, క్రీస్తును తిరస్కరించడం వల్ల, ఆధ్యాత్మికంగా అంధులుగా మిగిలిపోతారు (2 కొరింథీయులు 4:4). ఇది దేవుని న్యాయాన్ని మరియు మనుష్యుని హృదయ స్థితిని ప్రతిబింబిస్తుంది (యోహాను 3:19-21).

  3. యోహాను సువార్త 1:29

    మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

  4. “బైబిల్‌లో వున్నదాని ఆధారంగానే యీ వ్యాసం రాశాను.”

    ఏ భాష బైబిలు, ఏ సంవత్సరంలో ఎవరు ఏ భాషలో రాసిన బైబిలు? మొట్టమొదటి బైబిలు? బైబిలు కాకుండా పైలెట్ రాష్ట్ర తాలూకా అధికారిక దస్తావేజులు అంటే కోర్టు కేసు ట్రయల్ వంటివి ప్రభుత్వం తరపు నుండి ఏమైనా ఆధారాలు అందుబాటులో ఉన్నాయా?  వివరాలు తెలుపగలరు

    1. పైలేట్ దస్తావేజులు అందుబాటులో వున్నాయో లేదో నాకు తెలియదు. ఇక బైబిలు పుస్తకాల వివరాలు యివ్వగలను కానీ వాటితో మీకు పని ఏముంది? దీనిలో తప్పుందని మీరు ఎత్తి చూపితే, అప్పుడు నేను చదివిన వాటిలో యిలా వుంది అంటూ వాదించడానికి వాటి వివరాలివ్వాలి. అయినా మీరడిగారు కాబట్టి చెప్తున్నాను – 1) రీడర్స్ డైజస్ట్ వారి 1995 ఎడిషన్ బైబిల్ 2) గుడ్ న్యూస్ బైబిల్, టుడేస్ ఇంగ్లీష్ వెర్షన్ 1981 బైబిల్ సొసైటీ, బెంగుళూరు వారి ప్రచురణ  3) పవిత్ర గ్రంథము క్యాతలిక్ అనువాదము 1998 ఆంధ్ర కాథలిక్ బిబ్లికల్ కమిషన్ వారి ప్రచురణ

      1. అయ్యా… మీరు అన్యధా భావించవద్దు… మీరు మహానుభావులు… సాధారణంగా మహా మహులు ఏవైనా రాసినప్పుడు ref లు quote చేస్తుంటారు (మాత్యూ 12:24 లాగ). మీరిచ్చిన ref lu భారతీయ అనువాదాలు. వాటికి మూల ఆధారం(రాలు) వీలైతే ఇవ్వగలరు. 

        మన పురాణాలకు బోలెడు వెర్షన్లు ఉన్నాయి. ఏది ప్రామాణికం అన్నదే ప్రశ్న..

        ఇక పైలెట్ దస్తావేజులు ఎందుకంటే ఒక వైపునుండి మాత్రమే విషయాలు చూసే కంటే రెండు వైపుల నుండి చూస్తే అసలు విషయం బోధపడుతుంది. 

        1. మహామహులు అని మీరన్నది ఎకడమీషియన్స్ గురించి. నేను సాధారణ పాఠకుడి కోసం రాస్తున్నాను.  ఇవన్నీ రాస్తే బోరు కొడుతుంది.  రీడర్స్ డైజస్ట్ ది భారతీయ అనువాదం అని ఎలా అంటారు స్వామీ? గుడ్ న్యూస్ బైబిల్ కూడా అమెరికా బైబిల్ సొసైటీ వారు చేసినది. వారి అనుమతితో ఇండియాలో వీరు వేశారు. ఇక తెలుగు అనువాదం కూడా వాళ్ల చిత్తం వచ్చినట్లు వేయడానికి ఇంటర్నేషనల్ కాథలిక్ సొసైటీ ఒప్పుకోదు. వీటికి మూలం లాటిన్‌దా, గ్రీక్‌దా, మరో భాషదా? అనే చర్చలోకి నేను వెళ్లలేదు. మీరు వెళ్లదలచుకుంటే నిరభ్యంతరంగా వెళ్లండి. 

          1. అయ్యా చిత్తం… సాధారణ పాఠకుడిగానే అడిగాను.

            భారత దేశంలో వెలువడిన పుస్తకాలు భారతీయ అనువాదం అనే అనుకొంటాను.

            వాటి మూలాలు తెలుపకుండా కాకుండా…”అట” అని తగిలించకుండా రాశారు కదా… మీరే ఇవ్వండి మూలాలు

        2. పురాణాలకి బోలెడు వర్షన్స్ లేవు.. ఒక విషయానికి ఒక్కో పురాణం లో ఒక్కో వర్షన్ ఉంది.. వాల్మీకి రామాయణం లో చెట్లతో, రాళ్ళతో వారధి కట్టారని ఉంటే, పద్మపురాణం లో ఇంకోలా ఉంది.. 11 సార్లు రామావతారం జరిగింది కాబట్టీ అన్ని రకాల కథలు ఉన్నాయని కాకా భుషుండి గరుత్మంతుడికి చెప్తాడు.

          ఒక్కో పురాణానికీ ఒక్కటే వర్షన్

      2. there is no standard version of bible.there are 14800 differences between the oldest version housed in british museum and the “standard” king james version, just like we have 300 different ramayanas.

        all religious books are manmade and discussions are useless.

        1. Ok ఐతే puri flag కైలాష్ పర్వతం జ్వాలాముఖి జ్వాలా, బదరీనాథ్ ఆలయ దీపం కృష్ణ బిలం లాంటి science కి అందని miracles sheep pig మధం లో ఉన్నాయా 

  5. God A: Father, forgive my killers for they don’t know what they’re doing.

    God B: Mourning is worthless for your loss. Because change is the law of universe.

    God C: There’s no God but me. Kill or die for me and get hot chicks and wine rivers in my heaven.

  6. ఒకే వ్యక్తి గురించి 

    12 మంది 12 రకాలుగా చెప్పారు అన్న మాట , అతను అలా చెప్పాడు అని.

    12 మంది పక్కనే ఉన్నారు.

    అయినా

    ఒకరు విన్నాము అని చెప్పిన విషయం , వేరే వాళ్ళు వినలేదు.

    1. మీరు వ్యాసం సరిగ్గా చదవాలి. లాస్ట్ సప్పర్‌లో మాటల గురించి వేర్వేరు వెర్షన్లు లేవు. విచారణ సందర్భంగా జరిగిన దాని గురించే పాఠభేదాలున్నాయి. 

      1. According to the New Testament, only one of Jesus’ twelve disciples, John, the “disciple whom Jesus loved”, is recorded as being present at the crucifixion. The other disciples, along with Judas, had abandoned Jesus and were in hiding. 

        Elaboration:

        The Gospels of Matthew, Mark, and Luke mention the presence of women and some of Jesus’ acquaintances at the cross, but they do not explicitly name any disciples besides John. 

        John’s Gospel specifically mentions John, the son of Zebedee, as being present and taking care of Jesus’ mother, Mary. 

        The other disciples had fled in fear of the authorities and the impending execution. 

        Judas, one of the twelve disciples, committed suicide after betraying Jesus. 

        1. it means, all the people who wrote their versions are not there at the crucifixion . The disciple who is present,  is actually taking care of Mary. all versions of the bible are not authentic and only hearsay. added versions later on days, almost 50 to 100 years range. the teachings and miracle   may be exaggerating to small incidents

        2. Most of the disciples went into hiding but soon after they got to know about the resuurection they came out from their hiding and started preaching about Jesus.

  7. I’ve utmost respect for Christians for their immense contribution for advancement of mankind medically & technologically. But Christians preaching secularism to Hindus is like a Senile prostitute preaching Celibacy. You guys literally wiped out countless natives & their cultures across the Globe. Sit down.

  8. యెషయా 53వ అధ్యాయం

    యెషయా 53:5

    “కాని మన తిరుగుబాట్లకొరకై ఆయన బాధించబడెను,

     మన దోషములకొరకై ఆయన చూరుకుండెను;

     మనకు శాంతి కలుగునట్లు ఆయన శిక్ష పొందెను,

     ఆయన గాయములవలన మనము స్వస్థత పొందితిమి.”

    యెషయా 53:7

    “అతడు బాధపడుచు శ్రమపొందుచు నోరు తెరవలేదు;

     గొంతు కోసుటకు నడిపించబడిన గొర్రెపిల్ల వలె…”

    మత్తయి 20:28; ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా “విమోచన క్రయధనముగా” తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. మత్తయి 26:28 ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. యోహాను 10. యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. “””                                                                                       “””మత్తయి 11:25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.”””  

    1. మీకు అసలు ఈ టాపిక్కే అర్ధం కాలేదు . ..

      మీ పాపాల కోసం నేను చనిపోతున్నాను అని యేసు ఎక్కడ చెప్పాడు అన్నది ప్రశ్న ?

      వేరే వాళ్ళు చెప్పినది లెక్క లోకి తీసుకోబడదు

      1. ఈ రచయిత తన రచనలలో యేసు యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని పూర్తిగా తొలగించాడని స్పష్టమవుతోంది. అతను ఇకపై బైబిల్ లో వర్ణించబడిన యేసు గురించి మాట్లాడటం లేదు. బైబిల్ ప్రధానంగా మన ఆధ్యాత్మిక మోక్షం కోసమే అనుగ్రహించబడిందని గుర్తుంచుకోవాలి.

        కొన్ని ముఖ్యమైన వాక్యాలు ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి:

        “ఇది అనేకుల పాపులకు పరిహారము కలిగించుటకు పోయిన నా రక్తముతో కూడిన క్రొత్త నిబంధన” (మత్తయి 26:28)

        “ఈ పాత్ర నా రక్తముతో కూడిన క్రొత్త నిబంధన, అది మీ కొరకు చిందించబడుచున్నది” (లూకా 22:20)

        ముఖ్యాంశం ఏమిటంటే:

        • కేవలం యేసు మీద విశ్వాసమే మన పాపాలకు క్షమాపణ పొందడానికి మార్గం
        • పాపాల నుండి క్షమాపణ పొందడం క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాథమికమైన అంశం
        • కాంతిలో నడవడం (ఆధ్యాత్మిక జీవితం) మన అత్యున్నత ప్రాధాన్యత

        యేసు సిలువ మీద మరణించే ముందే  పాపాలు క్షమించాడు. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే – “”విశ్వాసమే అన్నింటికన్నా ముఖ్యమైనది.””

        ఒక ఉదాహరణతో వివరిస్తే:

        మనం ఆహారం తింటాము. అది ఎలా జీర్ణమవుతుందో మనకు తెలియదు. కానీ అంతిమంగా మనకు శక్తి లభిస్తుంది. అదే విధంగా, ఆధ్యాత్మిక జీర్ణక్రియ (మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు) జరుగుతుంది. కానీ మీరు యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచితే, అది  పాపములను పూర్తిగా క్షమించడానికి సంపూర్ణమైన శక్తిని కలిగి ఉంటుంది! ఇది యేసు క్రీస్తు స్వయంగా చెప్పిన సత్యం.

        మీరు మనుష్యకుమారుడు భూమిమీద పాపములను క్షమించుటకు అధికారము కలిగియున్నాడని తెలిసికొనుటకు (లూకా 5:24)

        1. ఆమె పాపములు అనేకములు క్షమింపబడినవి, ఆమె అధిక ప్రేమ చూపెట్టుచున్నది”( లూకా 7:47), యేసుకే పాపాలను క్షమించే సంపూర్ణ అధికారం ఉంది (మార్కు 2:7)

        “నన్ను విశ్వసించువాడు నిత్యజీవము పొందును” (యోహాను 6:47)

        యేసు క్రీస్తు మీద విశ్వాసమే మన రక్షణకు ఏకైక ఆధారం.

  9. యేసు క్రీస్తు తాను సిలువపై మరణిస్తున్నప్పుడు “నేను మీ పాపాల కోసం చనిపోతున్నాను” అని ప్రజలకు ప్రత్యక్షంగా ప్రకటించలేదు. ఇందుకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి:

    1. యేసు జీవితం మొత్తమూ దాని ఉద్దేశాన్ని సూచించింది: యేసు తన ఉపదేశాలలో, ఉదాహరణలలో (పారబుల్స్ లో) మన పాపాల క్షమించబడటానికి తన రావడాన్ని ఎన్నిసార్లు వివరించాడు. ఉదా: యోహాను 10:11 లో “నేను మంచిచెయ్యే గొఱ్ఱెల కాపరి, గొఱ్ఱెల కొరకు నా ప్రాణమిచ్చును” అన్నాడు.

    2. ఆయన కార్యం గంభీరమైనది, ఆంతర్యమైనది: యేసు బాధపడటం, మరణించడం — ఇవి కేవలం మానవ దృష్టికోణంలో ఒక రాజకీయ ఘటనే కాదు. ఇది దేవుని పరిపూర్ణ ప్రణాళిక. ఆయన త్యాగం అర్థం చేసుకోవడం కోసం పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అందుకే యేసు ప్రతి విషయాన్ని ప్రజలకు నేరుగా స్పష్టం చేయలేదు.

    3. ప్రోఫెసీలు నెరవేరాల్సి ఉంది: పాత నిబంధన ప్రవక్తలు ముందే చెబినట్లుగా మౌనంగా, బాధను మోయడం ఆయన విధి. ఉదా: యెషయా ప్రవక్త 53వ అధ్యాయం చదివితే, “ఆయన నోరు తెరవలేదు” అని వ్రాయబడి ఉంది.

    4. తరువాత శిష్యులు ప్రకటించాలి: యేసు తన మరణం మరియు పునరుత్థానాన్ని తరువాత దూతలు (apostles) ప్రపంచానికి ప్రచారం చేయాలని ఉద్దేశించాడు. అందుకే పునరుత్థానం తరువాత ఆయన శిష్యులకు స్పష్టంగా వివరించాడు: “మీ పాపాల నిమిత్తం నేను చనిపోయాను.”

    అందువల్ల, సిలువ సమయంలో యేసు నేరుగా ఆ విషయాన్ని చెప్పకపోయినా, ఆయన జీవితం, మరణం, పునరుత్థానం ద్వారా మన పాపమునకు పరిహారమైందని స్పష్టమైన సందేశం మనకు చేరింది.

    1. మరి అన్యుల్ని aviswaasulni చం…పమని ఎలా రాస్తారు…నేను నమ్మను నేనే కాదు world లో 600కోట్ల మంది నమ్మరు..అందర్నీ చం…పగలరా గొఱ్ఱె సన్నాసులు…అసలు హత్యలు మానభంగాలు encourage చేసేది మతమా??

      1. బైబిల్ సందర్భం తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసు చెప్పినది, ‘సహోదరుని పట్ల ద్వేషం ఉన్నవాడు నరహంతకుడు’ (1 యోహాను 3:15)—అంటే, ద్వేషం మన హృదయాన్ని చంపే పాపం. కానీ దేవుడు అన్ని మతాల్లో ప్రేమ, క్షమాపణే గొప్ప సత్యాలు.

        బైబిల్: ‘శత్రువులను ప్రేమించండి’ (మత్తయి 5:44).

        ఖురాన్: ‘నిరపరాధిని చంపడం మానవత్తుని చంపడమే’ (5:32).

        గీత: ‘అహింస పరమ ధర్మం’ (10.5).

        కొందరు మతం పేరుతో అన్యాయం చేస్తే, అది మతం కాదు—మనుషుల పొరపాటు. ఈ గ్రంథాలు అన్నీ శాంతి, న్యాయం నేర్పుతాయి.

        1. మీరు పొర badaaru…3 books total బాగా చదవండి…bible kuran tells to KI….LL NON BELIEVERS…BUT NOT గీత…ఇంకా డౌట్ ఉంటే రండి చూపిస్తా ….

          1. మీరు చెప్పేది పూర్తిగా తప్పు. నిజమైన క్రైస్తవులు, యేసు మరియు శిష్యుల బోధనలను మాత్రమే అనుసరిస్తారు.

            1. యేసు బోధనలు శాంతి మరియు ప్రేమను నేర్పుతాయి:
            • “శత్రువులను ప్రేమించండి, మిమ్మును ద్వేషించేవారికి మేలు చేయండి” (మత్తయి 5:44).
            • “ఖడ్గమును పట్టువాడు ఖడ్గంతోనే నశిస్తాడు” (మత్తయి 26:52).
            1. శిష్యులు కూడా హింసను నిరాకరించారు:
            • “మనుషులు మనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోకుండా, దేవునికి వదిలేయండి” (రోమీయులు 12:17-19).
            1. సవాలు (Challenge):
            • యేసు లేదా శిష్యుల బోధనలలో (Gospels లేదా New Testamentలో) ఒక్క చోట కూడా “మీ సోదరులను చంపండి” అని ఉందా?
            • లేకపోతే, మీరు బైబిల్ గురించి తప్పుడు అభిప్రాయాలు పెట్టడం న్యాయమా? ఉంటే, నేను ఇప్పటికే బైబిల్ వదిలేస్తాను! (కానీ మీరు అలాంటి వాక్యం కనుగొనలేరు, ఎందుకంటే అది అక్కడే లేదు).
            1. పాత నిబంధన (Old Testament) గురించి:

            అది యూదుల చరిత్ర, క్రైస్తవ ధర్మం కాదు. ఒకవేళ మీరు పాత నిబంధన యుద్ధాలను ఉదాహరిస్తే, నేను కూడా గీతలోని యుద్ధ వాక్యాలు (భగవద్గీత 2:37) చూపించగలను. కానీ మనం శాంతి బోధలను మాత్రమే పాటిద్దాం.

          2. మీరు చెప్పేది పూర్తిగా తప్పు. నిజమైన క్రైస్తవులు యేసు మరియు శిష్యుల బోధనలను మాత్రమే అనుసరిస్తారు. యేసు బోధనలు శాంతి మరియు ప్రేమను నేర్పుతాయి:

            • “శత్రువులను ప్రేమించండి, మిమ్మును ద్వేషించేవారికి మేలు చేయండి” (మత్తయి 5:44).
            • “ఖడ్గమును పట్టువాడు ఖడ్గంతోనే నశిస్తాడు” (మత్తయి 26:52).శిష్యులు కూడా హింసను నిరాకరించారు “మనుషులు మనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోకుండా, దేవునికి వదిలేయండి” (రోమీయులు 12:17-19). యేసు లేదా శిష్యుల బోధనలలో (Gospels లేదా New Testamentలో) ఒక్క చోట కూడా “మీ సోదరులను చంపండి” అని ఉందా?                                                                  పాత నిబంధన (Old Testament) గురించి: క్రైస్తవ ధర్మం కాదు. ఒకవేళ మీరు పాత నిబంధన యుద్ధాలను ఉదాహరిస్తే, నేను కూడా గీతలోని యుద్ధ వాక్యాలు (భగవద్గీత 2:37) చూపించగలను. కానీ మనం శాంతి బోధలను మాత్రమే పాటిద్దాం.
  10. జగన్ గారు తన జాతి కోసం కష్టాలు పడుతున్నానని ఎక్కడా చెప్పలేదు కానీ పొన్నవోలు లండన్ లో ఎన్నారైల వద్ద ఆ మాట చెప్పారు .సో ఒక్కొక్క సారి అసలు వ్యక్తి తన గురించి తాను చెప్పకున్నా పక్కవారు చెబుతారు. జీసస్ కూడా అంతే అనుకోవాలి. ఇతరుల పాప ప్రక్షాళన చేయడానికె ఆయన ఆత్మ బలిదానం చేశారని నమ్మితే వచ్చే నష్టం ఏమిటి?

    1. మీది అమాయకత్వమా లేక ఇంకేమన్నానా నాకు అర్ధం కావడం లేదు

      ఇతరుల పాప ప్రక్షాళన చేయడానికె ఆయన ఆత్మ బలిదానం చేశారని నమ్మితే వచ్చే నష్టం ఏమిటి? అని ఆడుగుతున్నారు… అసలు జరగని దానిని ఎందుకు నమ్మాలి ?

      జీసస్ చెప్పకుండా . ..వేరే వాళ్ళు ఎందుకు చెప్పారంటే, జీసస్ పేరుతో వ్యాపారం చెయ్యడానికి .

      క్రిస్తవ్యము అంతా వ్యాపార ధోరణిలో నే జరుగుతుంది . మత వ్యాప్తి కోసం సేల్స్ మెన్ లాగ ఇంటింటికి తిరిగి మత మార్పిడి చెయ్యడం .

      1. నేను శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికినవేలితో ఎత్తాడని నమ్ముతాను, మీకేమయినా నష్టమా? క్రీస్తుని కూడా నమ్మేవాళ్ళు నమ్ముతారు, మీకేంటి నష్టం?అల్లుడు పరాయి జాతి వాడని ప్రా.. ణా..లు తీసేసే మనుషులుతోనే నష్టం. ముందు వాళ్ళ గురించి ఆలోచించండి.

  11. ఈ వ్యాసంలో రాసిన విషయం లో నాకేమీ తప్పు / కాంట్రోవర్సియల్ కనిపించడం లేదు కానీ, ఇంతకుముందు రాసిన ‘క్రీస్తు శిలువ ఎక్కాడా..? …” వ్యాసం మాత్రం అపసవ్యం గానే అనిపించింది (“ఈ ప్రపంచం లోని పాపుల పాపాలన్నీ క్షాళన చెయ్యి..” అని క్రీస్తు అడిగాడా? దానికి ప్రూఫ్ ఉందా..??” అన్నది అర్ధం లేనిది – 2000 ఏళ్ళ కు పైబడిన విషయం అది .. ఇలాంటివన్నీ డాక్యుమెంట్ చేయబడి ఉన్నాయా అని ప్రశ్నించడం సరి కాదు, IMO)

    వీటి కంటే ఇంకా ముఖ్యమైన విషయం గూర్చి మీరు పరిశోధనాత్మక వ్యాసం రాస్తే నాబోటి పామరులకు ఉపయోగపడుతుందేమో..! అసలు జీసస్ క్రీస్తు అనబడే వ్యక్తి ఉన్నాడా? వీళ్ళందరూ చెబుతున్న సమయంలో ఉండేవాడా? అది నిజమైతే మరి ఆయన చనిపోయాడు అని చెబుతున్న సమయం తర్వాత సుమారు 150 / 200 ఏళ్ళ దాకా ఆయన గురించిన ప్రస్తావన ఎక్కడా ఎందుకు లేదు? తిరిగి ప్రజలకు తెలిసింది రోమన్ చర్చి ‘కావాలనుకున్న’ తర్వాతే కదా?? (అసలు క్రీస్తు మధ్య-ప్రాచ్య ప్రదేశం వాడైతే, ఆయన రూపురేఖలు ఒక పాశ్చాత్యుడి లాగా ఉండడమే నవ్వు తెప్పించే విషయం!)

    ఈ విషయాలమీద మీరు రాస్తే చదవాలని ఉంది.థాంక్ యు.

  12. ఆధ్యాత్మికత ఒక నిర్మల మానసిక స్థితి. ఆ స్థితిని అనుభవిస్తూ దానిని వివరించటానికి ప్రయత్నించిన మహాపురుషులలో పేరెన్నిక గల వారిలో ముఖ్యులు శ్రీకృష్ణుడు, బుద్దుడు, ఏసు క్రీస్తు.

    నిర్మలం అంటే మలము లేని స్థితి. అది లేని స్థితి మానవ జాతిలో కోట్ల కొలది జనులలో ఏ ఒక్కరికో కలుగుతుంది. మిగతా అందరికీ అర్ధమయ్యేలా ఆ స్థితిని గురించి వివరించాలి అనే ప్రయత్నంలో ముందుగా ఈ మలం అనేదాన్ని గురించి ఎవరి రీతిలో వారు బోధించారు. శ్రీకృష్ణుడి నుంచి, రమణ మహర్షి వరకు ఆ మలాన్ని అహంభావంతో పోల్చితే, బుద్ధుడు దాన్ని బాధతో పోల్చాడు, క్రీస్తు అనుయాయులు దాన్ని పాపంగా భావించారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరి గమ్యం ఆ మలాన్ని నిర్మూలించి నిర్మల స్థితిని చేరడమే!

    ఎవరేమన్నా మతానికి, రాజకీయానికి విడదీయలేని సంబంధం ఈనాటిది కాదు. ఏ మతమైనా అంతగా వ్యాప్తి చెందింది అంటే ఆ మతం అంతగా రాజకీయంతో పెనవేసుకుపోయిందని మనము చరిత్ర ద్వారా సులభంగా గ్రహించవచ్చు. దీని గురించి వాదోపవాదాల్లో మునిగి తేలుతూ, వైషమ్యాలూ, విద్వేషాలూ పెంచుకోవడం అవివేకం. ఆ నిర్మల మనఃస్థితిలో లేని వారందరం అజ్ఞానాన్ని అంగీకరిస్తే ఏ గొడవా లేదు!

    • ఐశ్వర్యం కోసం కాదు – పేతురు, పౌలు వంటి వారు బీదలుగానే మరణించారు.
    • ప్రఖ్యాతి కోసం కాదు – వారిని చాలామంది ద్వేషించారు, హింసించారు.
    • అధికారం కోసం కాదు – వారు రాజకీయాల్లోకి రాలేదు, బదులుగా జైళ్లు, మరణాలు ఎదుర్కొన్నారు.

    అయితే ఎందుకు ఈ త్యాగం?

    కేవలం ఒక “నుడి” (కథ) కోసం 12 మంది శిష్యులు ఎలా ప్రాణాలు త్యాగం చేస్తారు?

    • వారు యేసు పునరుత్థానాన్ని స్వయంగా చూశారు (1 కొరింథీయులు 15:5-8).
    • వారు నమ్మకంతో కాక, నిజమని తెలిసి సాక్ష్యం ఇచ్చారు.

    “మేము చూసినది, విన్నది మీకు చెప్తున్నాము” (1 యోహాను 1:3) బదులుగా సత్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు.. . 1. పేతురు (Peter) – రోమ్ (Rome), శిలువపై తలకిందులుగా మరణం

    పేతురు, ఏసుకు అత్యంత సన్నిహిత శిష్యుడు, రోమ్ లో క్రైస్తవులను హింసించిన నీరో చక్రవర్తి ఆజ్ఞపై శిలువవేయబడ్డాడు. అతను తనను ఏసుకు అర్హుడు కాదని భావించి, తలకిందులుగా శిలువవేయమని కోరాడు 1.

    2. పౌలు (Paul) – రోమ్ (Rome), ఖడ్గంతో శిరచ్ఛేదం

    పౌలు మొదట క్రైస్తవులను హింసించినవాడు, కానీ దమస్కు దర్శనం తర్వాత అత్యంత ఉత్సాహంతో సువార్తను ప్రచారం చేశాడు. రోమ్ లో ఖడ్గంతో శిరచ్ఛేదం చేయబడ్డాడు 1.

    3. ఆండ్రీ (Andrew) – గ్రీస్ (Greece), X-ఆకారపు శిలువపై మరణం

    ఆండ్రీని గ్రీస్ లోని పట్రాస్ (Patras) నగరంలో X-ఆకారపు శిలువపై వేలాడదీశారు. అతను మూడు రోజుల పాటు బోధించి, చివరకు మరణించాడు 1.

    4. యాకోబు (James) – యెరూషలేం (Jerusalem), ఖడ్గంతో మరణం

    యాకోబు, జెబెది కుమారుడు, యెరూషలేం లో హేరోదు రాజు ఆజ్ఞపై ఖడ్గంతో చంపబడ్డాడు (Acts 12:2). అతను మొదటి శిష్యుడు మరణించినవాడు 1.

    5. తోమా (Thomas) – చెన్నై (Chennai, India), ఈటెలతో చీల్చి చంపబడ్డాడు

    తోమా భారతదేశంలో సువార్తను ప్రచారం చేస్తూ, మయలాపూర్ (Chennai) లో ఒక రాజు ఆజ్ఞపై ఈటెలతో చీల్చి చంపబడ్డాడు. అతని సమాధి ఇప్పటికీ సెయింట్ థామస్ బేసిలికా, చెన్నై లో ఉంది 1.

    6. బర్తలోమి (Bartholomew) – ఆర్మేనియా (Armenia), చర్మం తీసేసి హింసించి చంపబడ్డాడు

    అతన్ని జీవంతే చర్మం తీసి, శిలువవేసి చంపారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం అతను భారతదేశంలో కూడా బోధించాడు 1.

    7. మత్తయి (Matthew) – ఇథియోపియా (Ethiopia), ఖడ్గంతో మరణం

    మత్తయి ఇథియోపియాలో సువార్తను ప్రచారం చేస్తూ, ఒక రాజు ఆజ్ఞపై ఖడ్గంతో చంపబడ్డాడు 1.

    8. ఫిలిప్పు (Philip) – హైరాపోలిస్ (Hierapolis), శిలువవేయబడ్డాడు

    ఫిలిప్పు హైరాపోలిస్ (ఇప్పటి టర్కీ) లో శిలువవేయబడ్డాడు 1.

    9. సీమోను (Simon the Zealot) – పర్షియా (Persia), శిలువవేయబడ్డాడు

    సీమోను పర్షియా (ఇప్పటి ఇరాన్) లో శిలువవేయబడ్డాడు 1.

    10. యూదా తద్దేయు (Jude Thaddaeus) – పర్షియా (Persia), గుద్దులతో మరణం

    అతన్ని గుద్దులతో చంపారు 1.

    11. యాకోబు (James the Less) – యెరూషలేం (Jerusalem), గోడపై నుండి పడవేసి చంపారు

    అతన్ని గోడపై నుండి పడవేసి, తర్వాత దెబ్బలతో చంపారు 1.

    12. మత్తియా (Matthias) – ఎతియోపియా (Ethiopia), శిరచ్ఛేదం

    మత్తియా ఎతియోపియాలో శిరచ్ఛేదం చేయబడ్డాడు 1.

    విశ్వాసం కోసం బలి

    ఈ శిష్యులు తమ ప్రాణాలను ధారపోసారు, కానీ వారి సాక్ష్యం ఇప్పటికీ ప్రపంచంలో నిలిచి ఉంది. “సత్యం కోసం మరణించడం, అబద్ధం కోసం బ్రతకడం కంటే గొప్పది!” 🙏🔥

    1. తాను లేచి వచ్చిన జీసస్, 

      వీళ్ళని మాత్రం ఎందుకు బతికించలేదు?

       

      స్వర్గంలో వాళ్ళ నాన్న ( అంటే అసలు దేముడు) దగ్గర ఉండి, వీళ్ళ గురించి మరిచి పోయాడా?  

      వీళ్లని  కూడా పునరుత్థానం చేస్తే, అప్పుడు మనకి  13 యేసు క్రీస్తు లు ఉండేవాళ్ళు కదా.

      1. నీ ప్రశ్న నిజంగా ఆలోచన-provoking! 😊

        మీరు అడిగినట్టు, ’13 యేసు క్రీస్తులు’ ఉంటే ఎంత బాగుండేది కదా? కానీ Bible ప్రకారం, యేసు మాత్రమే ‘తన స్వంత శక్తితే’ లేచాడు (John 2:19), మిగతావారిని అతను తానే రాబోయే రోజులో లేపుతాడు (John 5:28-29). అంటే… మీరు కోరుకున్నట్టు ‘మిలియన్ల జీసస్లు’ ఒక రోజు ఉంటారు—అదే నిజంగా పునరుత్థానమైన క్రైస్తవులు (1 John 3:2 ప్రియమైనవారల乎, ఇప్పుడు మనము దేవుని సంతానమై యున్నాము; మనము ఏలాగు ఉందుమో అది ఇంకా ప్రత్యక్షముగాలేదు. అయితే ఆయన (యేసు) ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఏలాగు ఉన్నారో మనము ఆయనలాగే ఉందుమని తెలిసికొనుచున్నాము.”✝)

        మీరు ఒక్కరిని నమ్మకపోతే, 13 మంది యేసువులేం చేస్తారు? 😉 కానీ good news ఏంటంటే, Bible హామీ ఇస్తుంది: అతని లాగే మనం కూడా మార్పు చెందుతాము (Philippians 3:21). సో… ఎదురు చూడండి, మీరు కోరుకున్న ‘బహుళ యేసులు’ ఒక్కసారి రాబోతున్నారు! 🙌

      2.  నీ ప్రశ్న నిజంగా ఆలోచన-provoking! 😊

        మీరు అడిగినట్టు, ’13 యేసు క్రీస్తులు’ ఉంటే ఎంత బాగుండేది కదా? 

        1. కానీ Bible ప్రకారం, యేసు మాత్రమే ‘తన స్వంత శక్తితే’ లేచాడు (John 2:19), మిగతావారిని అతను తానే రాబోయే రోజులో లేపుతాడు (John 5:28-29). అంటే… మీరు కోరుకున్నట్టు ‘మిలియన్ల జీసస్లు’ ఒక రోజు ఉంటారు—అదే నిజంగా పునరుత్థానమైన క్రైస్తవులు (1 John 3:2)! ✝

          మీరు ఒక్కరిని నమ్మకపోతే, 13 మంది యేసువులేం చేస్తారు? 😉 కానీ good news ఏంటంటే, Bible హామీ ఇస్తుంది: అతని లాగే మనం కూడా మార్పు చెందుతాము (Philippians 3:21). సో… ఎదురు చూడండి,

        2. Bible ప్రకారం, యేసు మాత్రమే ‘తన స్వంత శక్తితే’ లేచాడు (John 2:19), మిగతావారిని అతను తానే రాబోయే రోజులో లేపుతాడు (John 5:28-29).

    2. చర్చ్ వాళ్ళు కూడా, యేసు చెప్పాడు అని , సూర్యుడు ( అంటే మీ హిందూ పేరే ) నీ పూజించిన వాళ్ళని నిలువునా తగలబెట్టేశారు. ప్రకృతిని ఆరాధన చేసే ఆది వాసులను చంపేశారు. అప్పుడు యేసు ఏమి చేశాడు ? 

      1. మీరు చెప్పినట్లు, ప్రతి విలువైన కరెన్సీకి నకిలీ నోట్లు ఉంటాయి – అదే విధంగా, సమాజంలో కపట వ్యక్తులు కూడా ఉంటారు. బైబిల్ కూడా ఇటువంటి ‘నకిలీ విశ్వాసుల’ గురించి హెచ్చరిస్తుంది (మత్తయి 7:15, 2 పేతురు 2:1). న్యాయం చేయడం మానవ రాజ్యాల బాధ్యత (రోమా 13:1-4). ఈ నేరాలకు భూమిపై శిక్షలు ఇవ్వాల్సింది చట్టం మరియు సమాజం. దేవుడు అంతిమంగా అన్యాయాన్ని శిక్షిస్తాడు (గలాతియా 6:7). మీరు సరిగ్గా చెప్పారు – ఈ ఘటన చట్టపరమైన సమస్య, బైబిల్ సిద్ధాంతాలతో నేరుగా కలిపి చూడదగినది కాదు.

    3. కెనడా లో యేసు క్రీస్తు చర్చ్ పునాదుల్లో  250 పిల్లల శవాలు దొరికాయి. వాళ్ళు చేసిన పాపం 

      తమ ప్రకృతి దేవతల ఆరాధన చేస్తూ యేసు ను దేముడు అని నమ్మక పోవడం. 

      ఆ పసి పిల్లల్ని ఆ చర్చి ఫాదర్లు హింసించి చంపుతున్నప్పుడు, ఆ యేసు ఏమి చేశాడు? 

      1.  బైబిల్ ప్రకారం, అనాథులు మరియు నిరాధారులను హింసించేవారు దేవుని నుండి తీవ్రమైన శిక్షను పొందుతారు (మార్కు 9:42, సామెతలు 22:22-23).

    4. చెన్నై లో యేసు అనాథ శరణాలయం లో వారి అస్థిపంజరాలు అమ్ముకున్నపుడు , అవయవాల కోసం వాళ్ళని చంపేసినప్పుడు, యేసు ఏసీ రూమ్ లో సేద తీరుతూ పట్టించుకోలేదా?

      1. ఒక వాస్తవికమైన మరియు ఘోరమైన నేర కేసు కావచ్చు. కానీ దీనికి బైబిల్ లేదా యేసుక్రీస్తు సిద్ధాంతాలతో ప్రత్యక్ష సంబంధం లేదు.

        బైబిల్ ప్రకారం, అనాథలు, బలహీనులను అణచివేయడం గురించి దేవుడు తీవ్రంగా నిందిస్తాడు (ఉదా: ఎసాయా 1:17, యాకోబు 1:27)

        1. అయ్యా బలిహిణులు అయినా ఆఫ్రికా ప్రజలను బానిసలూ గ చేసుకున్నప్పుడు ??

    5. మధర్ థెరీసా, కలకత్తా లో తన అనాధ శరణాలయాల్లో , 

      రోగులకు మందులు, ఇంజెక్షన్ లు ఇవ్వకుండా అడ్డుపడి,

      కేవలం ప్రార్థన చేస్తే చాలు అని చెప్పి 

      వాళ్ళని చంపేసినప్పుడు ( ఆమె సొంతగా చెప్పింది)

      యేసు ఏమి చేసినాడు? 

      1. నిజం చెప్పాలంటే, ఈ రకమైన ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా లేవు. . బైబిల్ కూడా మందులను ఉపయోగించమని సలహా ఇస్తుంది (1 తిమోతి 5:23 లో పౌలు తిమోతికి కొంచెం వాడమని చెప్పాడు). మందులు కూడా దేవుని దీవెనలే. సైన్స్ ఎంత ముందుకు వెళ్లినా, మనకి తెలిసినట్టు, ప్రతి మతంలోనూ ఇలాంటి ‘మూఢనమ్మకాలు’ కనిపిస్తాయి. కానీ ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది.  

  13. “Ee papam maa pai maa pillala pai padaniy” ani annaru vallu.. ade debbaki okatava shathabdam nundi desham vadilesi paripoi desha dimmarulai parai palanalo bathikaru.. recent ga 19 va shathabdam lo tirigi vellari kani vallaku shanthi anede ledu ippatiki..

Comments are closed.