ఎక్కడి నుంచినో మొదలై మరెక్కడికో సాగుతున్న సుశాంత్ మరణంపై ధర్యాప్తు వ్యవహారం చివరకు డ్రగ్స్ దగ్గర ఆగినట్టుగా ఉంది. సుశాంత్ ను రియా హత్య చేయించింది అనే ఆరోపణల దగ్గర నుంచి, ఆమె అతడికి గంజాయిని ఇచ్చింది అనేంత వరకూ వచ్చింది ఈ వ్యవహారం. అతడితో ఆమె గంజాయిని పంచుకుందట. అందుకు సంబంధించి ఆమె అరెస్టయ్యింది.
అయితే బాలీవుడ్ లో చాలా మంది గంజాయి తీసుకుంటారు.. అనేది చాలా రొటీన్ గా వినిపించే మాట. ఇలాంటి నేపథ్యంలో తనుక్కొదాన్నీ ఆ విషయంలో అరెస్టు చేసి, బద్నాం చేసే సరికి రియా తీవ్రంగా అసహనభరితురాలు కావడంలో పెద్ద విచిత్రం లేదు. అందులోనూ సుశాంత్ మరణం తర్వాత రియాను సోషల్ మీడియా జనాలు కాల్చుకు తిన్నంత పని చేశారు. ఈ నేపథ్యంలో రియా ఎన్సీబీ విచారణలో సంచలన విషయాలను వెల్లడించినట్టుగా ఉత్తరాది మీడియానే లీకులు ఇస్తోంది.
దాని ప్రకారం.. బాలీవుడ్ లో తన తరహాలో గంజాయి కొట్టిన వాళ్లందరి పేర్లనూ రియా బయటపెట్టిందట. ఆ జాబితాలో ఏకంగా పాతిక మంది ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. తన కు తెలిసిన వాళ్ల పేర్లను ఆమె చెప్పిందని ప్రచారం జరుగుతూ ఉంది. ఆ విషయంలో సారా అలీఖాన్ పేరుతో సహా మరి కొందరి పేర్లు ఉన్నాయట. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా రియా చెప్పి పేర్లలో ఒకటి అని ఇప్పుడు ఉత్తరాది నుంచి టాక్ మొదలైంది. రియాతో ఫోన్ కాల్ సంభాషణల్లో కూడా రకుల్ పేరు వినిపించింది. తద్వారా వీరు సన్నిహితులు అనే విషయంపై అప్పట్లోనే స్పష్టత వచ్చింది.
ఈ నేపథ్యంలో గంజాయి బ్యాచ్ లో కూడా రకుల్ పేరును రియా ప్రస్తావించినట్టుగా పుకార్లు వస్తుండటం విశేషం. అయితే ఇదంతా కొత్త ముచ్చటేమీ కాదని.. బోలెడంత మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు గంజాయి అలవాటే అని, వారి పర్సులను చెక్ చేస్తే ఎప్పుడైనా గంజాయి దొరుకుతుందనే మాట బాలీవుడ్ వ్యవహారాలను ఎరిగిన వారు చెబుతున్నారు. ఇప్పుడిదంతా జనాలను వెర్రివాళ్లను చేసే సంచలన వార్త మాత్రమే అని వారంటున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు