కన్నడ నటి, బిగ్బాస్ లేడీ ఫేం జయశ్రీ రామయ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కన్నడ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. 2017లో కన్నడ వెండితెరపై జయశ్రీ ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత కన్నడ బిగ్బాస్ సీజన్-3లో 17 మంది కంటెస్టెంట్స్లో జయశ్రీ కూడా ఒకరు. కాగా జయశ్రీ గత కొంత కాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ విషయాన్నే ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
బెంగళూరులో జయశ్రీ నివాసం. గత ఏడాది జూలై 22న తన ఫేస్బుక్లో పెట్టిన పోస్టును గమనిస్తే, ఆమె డిఫ్రెషన్లో ఉన్న విషయం తెలుస్తుంది. "నన్ను ఫాలో అవుతున్న ప్రపంచానికి, డిఫ్రెషన్కు గుడ్బై" అంటూ ఏడాది క్రితం ఆమె పోస్టు పెట్టారు.
ఈ పోస్టుపై నెటిజన్లు అప్రమత్తమై ఓదార్పు మాటలు చెప్పారు. దీంతో ఆమె వెంటనే పోస్టును తొలగించారు. "నేను బాగానే ఉన్నాను. సురక్షితంగా ఉన్నా. లవ్ యూ ఆల్" అంటూ మరో అప్డేట్ పోస్టు పెట్టారామె.
ఆ తర్వాత జూలై 25న సోషల్ మీడియా హ్యాండిల్లో లైవ్ లో మాట్లాడుతూ... "నేను ఇదంతా ప్రచారం కోసం చేయడం లేదు. సుదీప్ సర్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయాన్ని ఆశించడం లేదు. నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. చిన్నప్పటి నుంచి చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నా. వాటిని అధిగమించలేక డిప్రెషన్ లోకి వెళ్లా. నేను డిప్రెషన్ నుంచి బయటపడలేక పోతున్నా. నేను కేవలం చావును ఆశిస్తున్నా" అని ఆమె ఆవేదనతో చెప్పారు.
అప్పటి నుంచి చావు కోసం ఎదురు చూస్తున్నట్టుగా డిఫ్రెషన్తో పోరాడుతూనే ఉన్నారు. చివరికి ఆమెపై డిఫ్రెషన్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో తన నివాసంలో ఉరి వేసుకుని జయశ్రీ ఈ లోకాన్ని శాశ్వతంగా వీడారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు