Advertisement

Advertisement


Home > Movies - Movie News

పరుశురామ్ - సీలేరు స్టోరీ

పరుశురామ్ - సీలేరు స్టోరీ

హీరోలు కొత్త బ్యాక్ డ్రాప్ లు, కొత్త కాన్సెప్ట్ లతో కూడిన కథల కోసం చూస్తున్నారు. అందుకే దర్శ‌కులు కూడా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఏ ఒకరిద్దరో కథలు వండడం కుదరని వాళ్లు రీమేక్ మే సుఖమని అటు పోతున్నారు. 

హీరో నాగ్ చైతన్య కోసం దర్శకుడు పరుశురామ్ కూడా ఓ డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా బ్యాక్ డ్రాప్ లో ఓ కథ అల్లుకున్నట్లు బోగట్టా. విశాఖ జిల్లాలో వున్న సీలేరు బ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ అల్లుకున్నారని తెలుస్తోంది. అయితే మరి సినిమాలో విశాఖ జిల్లాలో సీలేరు బ్యారేఙ్ బ్యాక్ డ్రాప్ అని చూపిస్తారా లేదా రాండమ్ గా ఏదో ఏరియాలో బ్యారేజ్ బ్యాక్ డ్రాప్ అని సెట్ చేస్తారా అన్నది చూడాలి.

ప్రస్తుతానికి నాగ్ చైతన్య లైన్ అయితే ఓకె చేసాడు. ఆ లైన్ పట్టుకుని కథ తయారు చేసే పనిలో పరుశురామ్ సీరియస్ గా వర్క్ చేస్తన్నారట. ప్రస్తుతం సరైన ప్రాజెక్టు, సరైన హిట్ కోసం చూస్తున్న 14రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. గతంలో సర్కారు వారి పాట కన్నా ముందే ఈ సినిమాను నిర్మించాల్సి వుంది. కానీ పరుశురామ్ అప్పడు మహేష్ సినిమా వైపు వెళ్లిపోయారు. దాంతో వాయిదా పడింది. నాగ్ చైతన్య మరో సినిమా కు వెళ్లారు. అది ఇప్పుడు జ‌రుగుతోంది.

ఆ సినిమా తరువాత పరుశురామ్ సినిమా మొదలయ్యే అవకాశం వుంది. పరుశురామ్ కనుక తన ఫుల్ స్క్రిప్ట్ తో చైతన్యను మెప్పించగలిగితే. లేదంటే మళ్లీ కథ మొదటికి వస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?