Advertisement

Advertisement


Home > Movies - Movie News

కరోనా బారిన పడిన సీనియర్ హీరో కుటుంబం

కరోనా బారిన పడిన సీనియర్ హీరో కుటుంబం

టాలీవుడ్ లో మరో ప్రముఖుడు కరోనా బారిన పడ్డాడు. అతడు మరెవరో కాదు, సీనియర్ హీరో రాజశేఖర్. ఇతడితో పాటు కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తమకు కరోనా సోకిన విషయాన్ని రాజశేఖర్ స్వయంగా నిర్థారించాడు.

"నిజమే.. జీవిత, నేను, పిల్లలు కరోనా బారిన పడ్డాం. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాం. పిల్లలిద్దరూ పూర్తిగా కరోనా నుంచి బయటపడ్డారు. నేను, జీవిత ఆరోగ్యంగానే ఉన్నాం, త్వరలోనే మేం ఇంటికి వెళ్తాం."

ఇలా తన కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయాన్ని రాజశేఖర్ నిర్థారించారు. లెక్కప్రకారం ఈపాటికి రాజశేఖర్ కొత్త సినిమా సెట్స్ పైకి రావాలి. నీలకంఠ దర్శకత్వంలో ఆయన ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడా ప్రాజెక్టు ఇంకాస్త ఆలస్యమౌతుంది.

మరోవైపు రాజశేఖర్ కూతురు శివానీ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇక మరో కూతురు శివాత్మిక కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమా చేస్తోంది.

టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది కరోనాతో బాధపడ్డారు. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నటుడు నాగబాబు, హీరోయిన్ తమన్న కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రాజశేఖర్ దంపతులు కూడా చేరారు. రాజశేఖర్ స్వతహాగా డాక్టర్ అనే విషయం తెలిసిందే.

కృష్ణమ్మ పరవళ్లు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?