ఫొటో చూస్తే ఎవరికైనా చరణ్ ను పోలిన చరణ్ ఉన్నాడేమో అనిపిస్తుంది. కానీ అందులో ఒకటి మైనపు విగ్రహం, ఇంకొకరు అసలైన చరణ్. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహం వెలిసింది.
స్వయంగా రామ్ చరణ్, తన చేతుల మీదుగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. టుస్సాడ్స్ చరిత్రలోనే పెంపుడు కుక్కతో ఓ సెలబ్రిటీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి.
ఆవిష్కరణ సందర్భంగా తన మైనపు ప్రతిమను చూసిన రైమ్ (చరణ్ పెంపుడు శునకం పేరు) కాసేపు గందరగోళానికి గురైంది. ఆ తర్వాత ఎంచక్కా సోఫా ఎక్కి, మైనపు చరణ్ పక్కన సెటిలైంది. అలా ఇద్దరూ కలిసి ప్రతిమతో కలిసి ఫొటోలు దిగారు.
మైనపు ప్రతిమ పెడతామనే ప్రతిపాదన వచ్చినప్పుడు చరణ్ పెట్టిన షరతు ఒకే ఒక్కటి. తన రైమ్ కు కూడా చోటిస్తేనే అంగీకరిస్తానని, లేదంటే నో అని కరాఖండిగా చెప్పేశాడు. అలా తనతో పాటు రైమ్ కు కూడా టుస్సాడ్స్ లో చోటు కల్పించాడు.
ఈ విగ్రహావిష్కరణ కోసం కుటుంబం మొత్తం లండన్ వెళ్లింది. మెగా ఫ్యామిలీకి అక్కడ ఘనస్వాగతం దక్కింది. ఎన్నారైలు డప్పులు కొట్టి మరీ చరణ్-చిరంజీవిని ఆహ్వానించారు.
10Mn kokka. సరే డబ్బులు ఉన్నాయి కాని
How much he must have spent on it..?????