ఇండియాపై కయ్యానికి కాలుదువ్వడం అనేది తాము చేసుకున్న దుస్సాహసం అని పాకిస్తాన్ కు అర్థం కావడానికి కేవలం గంటల వ్యవధే పట్టినట్టుగా ఉంది. పెహల్ గావ్ అటాక్ చేయడమే పాక్ తనకు తాను రాసుకున్న సూసైడ్ నోట్. ఎంతసేపూ దొంగ దెబ్బలు తీసేసి పారిపోవడమే, తద్వారా తాము పై చేయి సాధించినట్టుగా ఫీల్ కావడం పాక్ పని. ఈ క్రమంలోనే పెహల్ గావ్ లో పర్యాటకులను కూడా అటాక్ చేసి పాక్ బరి తెగించింది.
ఒకవేళ భారత సైన్యంపై పాక్ ముష్కరులు యథారీతిన దాడులు కొనసాగించినట్టుగా అయితే.. భారత ప్రభుత్వం కూడా వాటిని తిప్పి కొట్టడం మీద దృష్టి పెట్టేదేమో! అలాంటివి కొత్త కాదు కాబట్టి.. వాటికి బదులు మాత్రమే ఇచ్చేదేమో. అయితే పర్యాటకులపై కాల్పుల ద్వారా పాక్ ఇండియాపై యుద్ధం మొదలుపెట్టింది. అది కూడా ఉగ్రవాద మూకలతో. అయితే తాము అలాంటి దొంగ దెబ్బలను తీయగలం కానీ, డైరెక్ట్ యుద్ధంలో కొన్ని గంటల పాటు కూడా తట్టుకునే సామర్థ్యం లేదని పాక్ ఇప్పటికే చాటుకుంది. డైరెక్ట్ వార్ లో పాక్ సామర్థ్యం చాలా పరిమితం అని ఇది వరకూ అనేక మంది చెబుతూ వచ్చారు. ఇండియా ముందు పాక్ ఏ రకంగానూ తట్టుకోలేదని వారు విశ్లేషిస్తూ వచ్చారు.
ఆ విశ్లేషణలు వాస్తవంలో ఏ రకంగానూ తప్పు కాలేదు. ముందుగా పాక్ లోని ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులపై ఇండియా మిస్సైల్ దాడులతోనే పాక్ కు గట్టి షాక్ తగిలింది. ఇండియా వైమానిక దళం పాక్ పై మిస్సైల్ దాడులు చేయడం చాలా సులభం అనే విషయం తొలి రోజే స్పష్టం అయ్యింది. వైమానిక దాడులను తట్టుకోవడానికి పాక్ వద్ద ఎలాంటి రక్షణా వ్యవస్థ లేదని, ఒకవేళ చైనా మేడ్ క్షిపణీ నిరోధక వ్యవస్థ ఉన్నా… అది పాక్ ను ఏ మాత్రం రక్షించలేదని ఆపరేషన్ సింధూర్ దాడుల తొలి రోజే స్పష్టత వచ్చింది.
పాక్, పీవోకే లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత క్షిపణులు దెబ్బతీశాయి. ఆ దాడులను పాక్ ధవీకరించినా, ఉగ్రవాద ప్రాణ నష్టం గురించి మాత్రం కిక్కురుమనలేదు. దీనిపై ఇండియా స్పందిస్తూ.. వంద మంది వరకూ ఉగ్రవాదులు హతమయి ఉండవచ్చని అంచనా వేసింది. అయితే పాక్ ఉగ్రవాదులను ఆయా క్యాంపుల్లోనే ఉంచిందా లేదా ఇండియా దాడులకు భయపడి ముందుగానే వారిని శిబిరాల నుంచి వేరే చోటికి తలరించిందా.. అనేది పూర్తి సమాచారం రావాల్సిన అంశం. అయితే పాక్ లో ఉగ్రముష్కరులు ఎక్కడ దాక్కొనా వదలని రీతిన ఇండియా తదనంతర దాడులు కొనసాగుతూ ఉండటం ఆసక్తికరం.
అయితే పాక్ డొల్లతనం తమ మీద జరిగే క్షిపణి దాడులను అడ్డుకోలేకపోవడంలోనే కాదు, ఇండియాలోని 15 నగరాలపై ఒకేసారి దాడుల విషయంలో విఫలం కావడంలో కూడా బయటపడింది. తమపై జరిగే క్షిపణి దాడులను ఆపుకోలేకపోయిన పాకిస్తాన్, ఇండియాపై క్షిపణి, డ్రోన్ దాడులతో మరో దుస్సాహసం చేసింది. అయితే ఈ దాడులను భారత క్షిపణీ రక్షణ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా అడ్డుకుంది. పాక్ మిస్సైల్ లను వాటిని ప్రయోగించడానికి వచ్చిన పాక్ యుద్ధ విమానాలను, వందలాదిగా పాక్ ప్రయోగించిన డ్రోన్ లను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. వాటిని గాల్లోనే పేల్చి వేసి పాక్ కు షాక్ ను ఇచ్చింది. ఇలా రెండో రకంగా కూడా పాక్ కామెడీ అయిపోయింది.
అయితే పాక్ రెండోసారి దుస్సాహసం చేశాకా ఇండియా ఇక ఉపేక్షించి లాభం లేదన్నట్టుగా మళ్లీ దాడులను మొదలుపెట్టింది. పాక్ రక్షణ వ్యవస్థలనే లక్ష్యంగా చేసుకుని, పాక్ అర్థికంగా భారీ నష్టాలను మూటగట్టే రీతిన ఇండియా ప్రతి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడా జనావాసాల మీద, పాక్ ప్రజలను టార్గెట్ గా చేసుకోకుండా ఉగ్రవాద శిబిరాలను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని, పాక్ కు ఆర్థిక నష్టాలను మిగిల్చే రీతిన ఇండియా దాడులు కొనసాగుతూ ఉండటం అభినందనీయం.
పాక్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూనే, తగిన రీతిన బుద్ధి చెప్పే రీతిన ఇండియా వ్యవహరిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో సరిహద్దుల్లో మాత్రం పాక్ కు ఇంకాస్త ముకుతాడు వేయాల్సి ఉంది. సరిహద్దు ప్రాంతంలో జనావాసాలపై పాక్ ఆర్మీ కాల్పులు, దాడులు చేస్తూ ఉంది. ఇందులో కొంతమంది భారతీయ పౌరులు మరణించారు. వీటిని కూడా ఇండియన్ ఆర్మీ తిప్పి కొడుతూ ఉంది. అయితే ఎయిర్ స్ట్రైక్స్ తో పాక్ కు గట్టి ఝలక్ లు ఇస్తూ.. ఈ బ్యాటిల్ లో ఇండియా పూర్తి పై చేయి సాధిస్తూ ఉంది.
ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పాక్ లో ప్రముఖులు పలాయనం చిత్తగిస్తున్నారనే వార్తలూ వస్తున్నాయి. పాక్ ప్రధాని వెళ్లి బంకర్ లో దాక్కొన్నాడని, పాక్ సైన్యాధ్యక్షుడు పారిపోయాడనే వార్తలూ వస్తున్నాయి. మరి ఇంకా పూర్తి స్థాయిలో యుద్ధం మొదలుకాలేదు, భారత సైన్యం పూర్తిగా కాన్సన్ ట్రేట్ చేసినట్టుగా కూడా కనపడటం లేదు, డజను ఎయిర్ స్ట్రైక్స్ కే పాక్ పరిస్థితి ఇలా తయారుకావడంతో తాము చేసిన దుస్సాహస ఫలితాలు ఎలా ఉన్నయో ఆ దేశానికి అర్థమై ఉండాలి!
ఇండియా నీ విడగొట్టి ముస్లిం ల కోసం ప్రత్యేక దేశం చేసిన పం*ది జిన్నా గాడి పేరుతో ఇండియా ఆంద్ర లో వున్న సెంటర్ లను తెలుగు ముస్లిం లు ఇప్పటికైనా మారుస్తారా లేక పంది మాసం తినే ఆ జిన్నా గాడి కాళ్ళు ఇంకా కుడుస్తూనే వుంటారా?
Jinna Tower stays as it is. Its historic.
We spent a lot to shot down turkey and china drones. They come for peanuts to pakistan. Need to iron out a plan. They sent them in large numbers, guided and unguided sure to cause casualties.
..
Hope this cease fire helps to iron out them.
Antae Pakistan sainyadkshudu paaripoyina kuda valla sainyam sthairyam kolpokunda eduru daadi chesindi anega chepthunnav. Desa drohi ani antaru mana adani ambani thukadae thukadae batch