మహేష్ సరసన రామ్ చరణ్

ఇప్పటికే చాలామంది హీరోలు మైనపు విగ్రహాల్లోకి మారిపోయారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రామ్ చరణ్ కూడా చేరబోతున్నాడు. ఈ క్రమంలో అతడు మహేష్ బాబు సరసన చోటు దక్కించుకున్నాడు. Advertisement టాలీవుడ్ హీరోలకు మైనపు…

ఇప్పటికే చాలామంది హీరోలు మైనపు విగ్రహాల్లోకి మారిపోయారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రామ్ చరణ్ కూడా చేరబోతున్నాడు. ఈ క్రమంలో అతడు మహేష్ బాబు సరసన చోటు దక్కించుకున్నాడు.

టాలీవుడ్ హీరోలకు మైనపు విగ్రహాలు కొత్త కాదు. మేడమ్ టుస్సాడ్స్ బ్యాంకాక్ బ్రాంచ్ లో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. సింగపూర్ బ్రాంచ్ లో మహేష్ విగ్రహాన్ని, దుబాయ్ బ్రాంచ్ లో బన్నీ విగ్రహాల్ని పెట్టారు.

ఇప్పుడు సింగపూర్ బ్రాంచీలో మహేష్ బాబు సరసన రామ్ చరణ్ చేరబోతున్నాడు. నిజానికి చరణ్ మైనపు విగ్రహాన్ని మెయిన్ బ్రాంచ్ అయిన లండన్ లో పెట్టబోతున్నారనేది టాక్ నడిచింది. కానీ సింగపూర్ కే పరిమితమైంది.

తాజాగా రామ్ చరణ్ కొలతలు తీసుకున్న వీడియోను టుస్సాడ్స్ సంస్థ విడుదల చేసింది. ఇందులో చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ తో కనిపించబోతున్నాడు. త్వరలోనే విగ్రహం రెడీ అవుతుంది. దీని ఆవిష్కరణకు చరణ్, కుటుంబంతో కలిసి సింగపూర్ వెళ్లబోతున్నాడు.

ఇండియాకు చెందిన అమితాబ్, షారూక్, శ్రీదేవి లాంటి స్టార్స్ మైనపు విగ్రహాలన్నీ మెయిన్ బ్రాంచ్ లండన్ లో ఉన్నాయి.

8 Replies to “మహేష్ సరసన రామ్ చరణ్”

    1. విజయవాడ వరదలకు వీళ్ళంతా వరద బాధితులను ఆదుకునేందుకు కోట్లు కోట్లు సహాయం చేసారు.. ఎపుడు ప్రజలకు కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు

    2. Govt pettadam valla upayogam ledu… oka private company valla museum lo pedite manakenti nashtam… Prajalaku cheyalsindi government and Politicians, oka celebrity ki prajalaku cheyalani em rule undi. Valla Money Valla ishtam.

Comments are closed.