Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఓటీటీ వేదికపైకి మరో క్రేజీ మూవీ

ఓటీటీ వేదికపైకి మరో క్రేజీ మూవీ

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓటీటీ లోకి మరో సినిమా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాని పేరు రంగమార్తాండ. లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన కృష్ణవంశీ, ఈ సినిమాకు దర్శకుడు. అంతేకాదు.. తన భార్య రమ్యకృష్ణను చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతో డైరక్ట్ చేస్తున్నాడు కృష్ణవంశీ. ఇప్పుడీ సినిమా ఓటీటీ వైపు అడుగులు వేస్తోంది.

వాస్తవానికి ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంకా థియేటర్లు ఓపెన్ చేయలేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరవలేమని ఏపీ ఎగ్జిబిటర్లు చెప్పగా.. తెలంగాణ ఎగ్జిబిటర్లకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. వీటితో పాటు మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.

ఓవరాల్ గా చూసుకుంటే, డిసెంబర్-జనవరి వరకు థియేటర్లలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా లేవు. దీంతో రంగమార్తాండ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన కొంతమంది, దర్శకుడ్ని ఒప్పించినట్టు టాక్.

లెక్కప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ మొదలుపెట్టి సినిమాకు గుమ్మడికాయ కొట్టబోతున్నారు. మరాఠీలో సూపర్ హిట్టయిన నటసామ్రాట్ కు ఇది తెలుగు రీమేక్. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీత దర్శకుడు.

కొత్త చరిత్ర రాస్తున్నాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?