Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ సెట్ మీదకు ప్రకాష్ రాజ్

టాలీవుడ్ సెట్ మీదకు ప్రకాష్ రాజ్

కేజిఎప్ 2 సెట్ మీదకు వెళ్లి అక్కడ వర్క్ ఫినిష్ చేసిన సీనియర్ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చారు. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా షూట్ ను మళ్లీ ప్రారంభించారు. కరోనా కారణంగా అన్ని షూటింగ్ ల మాదిరిగానే ఇదీ ఆగిపోయింది. 

ఈ సినిమా దాదాపు పూర్తయిపోయింది. అయితే సోను సూద్, ప్రకాష్ రాజ్ తో కొన్ని హీరో కాంబినేషన్ సీన్లు వుండిపోయాయి. అలాగే పాటల చిత్రీకరణ వుంది. ఇప్పుడు వీటిని ఫినిష్ చేసే పని స్టార్ట్ చేసారు. సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను తీసుకురావాలన్నది ఆలోచన. 

అను ఇమ్మాన్యుయేల్, నభానటేష్ లు ఇంకా షూటింగ్ లుకు రావడం లేదు. వారు వస్తే పాటల వర్క్ కూడా ఫినిష్ చేస్తారు. దేవీశ్రీప్రసాద్ ఇప్పటికే పాటల పని ఫినిష్ చేసారు. బహుశా సంక్రాంతి బరిలో దిగే పక్కా మాస్ సినిమా ఇదే కావచ్చు.

ఎన్టీఆర్ ని చంపేశాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?