శ్రీలంకన్ స్టార్ స్పిన్నర్ మురళీధరన్ బయోపిక్ ఆగింది. ఈ బయోపిక్ నుంచి వైదొలుగుతున్నట్టుగా తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రకటించాడు. మురళీ బయోపిక్ పై తమిళనాట సినీ ప్రముఖులు విమర్శలు మొదలుపెట్టారు.
ఈలం నినాదానికి అనుకూలంగా స్పందించని మురళీ బయోపిక్ ను ఎలా తీస్తారంటూ వారు వాదించడం మొదలుపెట్టారు. మురళీ లంకలో సెటిలైన ఒక తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి. తమిళ ఈలం తీవ్రవాదం తీవ్ర దశలో ఉన్నప్పుడు మురళీ స్టార్ క్రికెటర్ గా చలామణి అయ్యాడు.
లంక ప్రభుత్వం మురళీపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. తమిళుడు అనే వివక్ష చూపలేదు. మురళీ బౌలింగ్ యాక్షన్ పై అంతర్జాతీయ క్రికెట్ లో వివాదం రేగినప్పుడు కూడా లంక క్రికెట్ బోర్డు అతడికి పూర్తి అండగా నిలిచింది. మురళీ తన ఆట మీదే దృష్టి పెట్టి సాగాడు. చెన్నైకి చెందిన తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకుని.. అలా తమిళంతోనూ తన అనుబంధాన్ని కొనసాగించాడు.
ఇలా మురళీ బయోపిక్ కు బీజం పడినట్టుగా ఉంది. వీర తమిళ వాదులు ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈలం నినాదానికి మురళీ మద్దతుగా మాట్లాడలేదని, ఆయన బయోపిక్ ను ఎలా తీస్తారంటూ వారు ప్రశ్నించ సాగారు. దీంతో మురళీనే స్వయంగా స్పందించాడు.
ఎవరి ప్రాణాలు తీయడాన్నీ తను సమర్థించలేదంటూ మురళీ స్పందించాడు. తన బయోపిక్ ప్రతిపాదనను కూడా రద్దు చేసుకోమని సూచించినట్టుగా ఉన్నాడు. బయోపిక్ వల్ల మురళీకి ఒరిగేది కూడా ఏమీ లేకపోవచ్చు.
అందుకే అతడే విజయ్ సేతుపతికి సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతో విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించాడు. ఈ లెక్కన ఆ సినిమా ప్రస్తుతానికి ఆగినట్టే. తమిళ మూలాలు లేని నటుడు ఎవరితోనైనా ఆ సినిమా తెరకెక్కుతుందో, లేక పూర్తిగా ఆగుతుందో!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు