సంప‌ద సృష్టించే సంస్థ‌ను చేజేతులా!

సంప‌ద సృష్టించే ఫైబ‌ర్‌నెట్ సంస్థ‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ చేజేతులా మూసివేస్తోంది.

సంప‌ద సృష్టించే ఫైబ‌ర్‌నెట్ సంస్థ‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ చేజేతులా మూసివేస్తోంది. ఈ నెల 16న ఫైబ‌ర్‌నెట్‌కు బాబు స‌ర్కార్ ఉరి’ అనే శీర్షిక‌తో “గ్రేట్ ఆంధ్ర”లో క‌థ‌నం వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడ‌దే నిజ‌మవుతోంది. దాదాపు మూసివేత ద‌శ‌కు ఫైబ‌ర్‌నెట్ సంస్థ చేరుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రూ.3 వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన సంస్థను మ‌రింత అభివృద్ధి చేయాల్సింది పోయి, చంద్ర‌బాబు స‌ర్కార్ లోప‌భూయిష్ట విధానాలు మూసివేసేలా చేస్తున్నాయి.

ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌వికి జీవీరెడ్డి రాజీనామాతోనే ఆ సంస్థ మూసివేత‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంది. విచ్చ‌ల‌విడిగా ఉద్యోగుల తొల‌గింపు, కొత్త నియామ‌కాలు లేక‌పోవ‌డంతో వినియోగ‌దారుల‌కు సేవ‌లు ఆగిపోయాయి. అడిగినా ప‌ట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2.50 ల‌క్ష‌ల క‌నెక్ష‌న్లు మాత్ర‌మే ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇవాళ్టి నుంచి విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ఫైబ‌ర్‌నెట్ ఆప‌రేట‌ర్లు ఆందోళ‌న చేప‌ట్ట‌నున్నారు. స‌ర్వీసుల్ని వెంట‌నే పునరుద్ధ‌రించాల‌ని, కొత్త సెటాఫ్ బాక్స్‌ల‌ను అందించాల‌ని, ఈఎంఐ చార్జీల‌ను తొల‌గించాల‌న్న ప్ర‌ధాన డిమాండ్ల‌తో ఆప‌రేట‌ర్లు ఆందోళ‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. అయితే వెంటిలేట‌ర్‌కు చేరిక ఫైబ‌ర్‌నెట్ సంస్థ‌కు ఊపిరిపోయ‌డం అసాధ్య‌మ‌ని సంబంధిత ఉన్న‌తోద్యోగులు అంటున్నారు.

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ప్ర‌యోజ‌నం ఏంట‌ని వాళ్లు నిల‌దీస్తున్నారు. కూట‌మి స‌ర్కార్ వ‌స్తే, ఫైబ‌ర్‌నెట్‌కు ఎంతో భ‌విష్య‌త్ వుంటుంద‌ని ఆశించిన ఆప‌రేట‌ర్లు, చివ‌రికి అస‌లుకే ఎస‌రు వ‌చ్చింద‌ని వాపోతున్నారు. ప్ర‌భుత్వాన్ని న‌మ్ముకుని ల‌క్ష‌లాది రూపాయ‌లు పెట్టుబ‌డులు పెట్టామ‌ని , తీవ్రంగా న‌ష్ట‌పోతున్న‌ట్టు గ‌గ్గోలు పెట్ట‌డం గ‌మ‌నార్హం. సంప‌ద సృష్టిస్తామ‌న్న ప్ర‌భుత్వ పెద్ద‌లు, వ‌చ్చే ఆదాయాన్ని కూడా ఎలా పోగొట్టుకుంటున్నారో ఈ సంస్థ మూసివేత దిశ‌గా అడుగులు వేయ‌డ‌మే నిద‌ర్శ‌నం.

5 Replies to “సంప‌ద సృష్టించే సంస్థ‌ను చేజేతులా!”

  1. ఉరి వెసింది… మన జగన్ అన్నె! fiber net డబ్బు అంతా కావలసిన వారికి ఉద్యొగాలు ఇచ్చి నొకెసారు! 

    GV Reddy చెప్పింది అదె!

Comments are closed.