ఈవో మెడకు చందనోత్సవ విషాదం

పెద్ద ఘటన జరిగింది కాబట్టి పెద్ద స్థాయిలో వారు కూడా ఉంటారని వారిని సైతం విచారణలో భాగం చేయాలని కోరుతున్నారు.

ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే విశాఖ సింహాద్రి నాధుని చందనోత్సవం ఈ ఏడాది మాత్రం పెను విషాదాన్ని మిగిలించింది. ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో అప్పటికపుడు కొండ మీద నిర్మించిన గోడ కూలి ఏడుగురు అమాయక భక్తులు మరణించడం యావత్తు ప్రజానీకాన్ని కలచివేసింది. ప్రధాని స్థాయిలో దిగ్భాంతిని వ్యక్తం చేశారు అంటే ఈ ఘటన ఎంతలా జాతీయ శీర్షికకు ఎక్కింది అన్నది తెలుస్తోంది.

ఇంతటి భారీ ఘటన సింహాచలం లాంటి ఒక ప్రసిద్ధ ఆలయంలో జరగడం ఇదే ప్రధమం అయితే బాధ్యులు దీనికి ఎవరా అన్నది కూడా అంతా తర్కించుకున్న్నారు. అయితే కేవలం అధికారులకే పరిమితం చేస్తూ వారి మీదనే చర్యలకు రంగం సిద్ధం అయింది. సింహాచలం ఈవోను ఈ ఘటనకు సంబంధించి సస్పెండ్ చేశారు. ఇంతటి ఉన్నత స్థాయి అధికారి సస్పెండ్ కావడం దేవాలయ చరిత్రలో ఇదే తొలిసారి అని అంటున్నారు

తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఆలయ ఈవో విశాఖ విడిచి ఎక్కడికి వెళ్ళరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికలో ఈవోతో పాటు గా మరో ఆరుగురు ఇంజనీర్లు కూడా ఉన్నారు. గోడ నిర్మించిన కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మొత్తం దుర్ఘటనకు ఈవో బాధ్యుడని తేల్చారు. అయితే కేవలం అధికారుల స్థాయికే పరిమితం చేసి ఇంతటి దుర్ఘటనను వారే కారణం అంటూ విచారించడం మీద అంతా తర్కించుకుంటున్నారు. పెద్ద ఘటన జరిగింది కాబట్టి పెద్ద స్థాయిలో వారు కూడా ఉంటారని వారిని సైతం విచారణలో భాగం చేయాలని కోరుతున్నారు.

11 Replies to “ఈవో మెడకు చందనోత్సవ విషాదం”

  1. పెద్ద ఘటన జరిగింది కాబట్టి.. పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా ఉంటారని.. గ్రేట్ ఆంధ్ర వారు సెలవిచ్చారు..

    మరి అదేంటో..

    జగన్ రెడ్డి ప్రభుత్వం లో ఏమి జరిగినా.. అధికారులదే బాధ్యత.. మా జగన్ రెడ్డి సుద్దపూస అని డిసైడ్ చేసేస్తుంటాడు..

    మా జగన్ రెడ్డి నోట్లో గొట్టం పెట్టినా చీకలేడు .. అని సుతారం గా చెప్పేస్తుంటాడు..

    1. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోయారు…పెద్ద స్థాయి వారు బలి కాలేదేందుకో? పైగా సొంత జిల్లా, పక్క నియోజకవర్గం

    1.  Not ministers, even CM went to review when Annamayya dam was drowned and 40 odd died. But no action, even though incident happened in his own district. Yes , 40 victim families became gorrelu

  2. గొడ పడిపొతె ఆ ఆలయ ఈవో, ఇంజనీర్లు బాద్యులు కాకుండా ముక్యమంత్రి, ప్రదానమంత్రి బాద్యులు అవుతారా?

    .

    మొన్న అంద్రప్రదెష్ కి చెందిన ఒబులాపురం గనులలొ Y.-.S.-.R ఆప్తుడు గాలి జనార్ధన్ రెడ్డి 884 కొట్ల అక్రమ మైనింగ్ చెసారు అని కొర్టు శిక్ష వెస్తె ఎదొ మొక్కుబడిగా ఒక వార్థ రాసి తప్పుకున్నాడు. మన MBS ఎ శీర్షికా రాయడు.

    .

    గొడ పడిపొతె మాత్రం ఎదొ ముక్యమంతి బాద్యత వహించాలి అన్నట్తు రొజూ ఆర్టికల్స్ రాస్తునాడు!

Comments are closed.